Galwan clash: 2020లో భారత్, చైనాల మధ్య ‘‘గల్వాన్ ఘర్షణ’’ చోటుచేసుకుంది. దాదాపుగా రెండు దేశాలు యుద్ధం అంచుకు వెళ్లాయి. దీనిపై అమెరికా సంచలన విషయాలు వెల్లడించింది. భారత్తో ఈ ఘర్షణ జరిగిన కొన్ని రోజులకే, ప్రపంచం మొత్తం కోవిడ్తో బాధపడుతున్న సమయంలో చైనా రహస్యంగా అణు పరీక్షలను రహస్యంగా నిర్వహించినట్లు అమెరికా చెప్పింది. శుక్రవారం జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సులో అమెరికా విదేశాంగ శాఖ అండర్ సెక్రటరీ థామస్ డినాన్నో ఈ ఆరోపణ చేశారు. అమెరికా, రష్యా మధ్య చివరి అణు ఒప్పందం ఫిబ్రవరి 5తో ముగిసిన తర్వాత ఈ ఆరోపణలు రావడం సంచలనంగా మారాయి.
ప్రపంచం కళ్ల నుంచి తప్పించుకోవడానికి చైనా రహస్య అణు పరీక్షలు నిర్వహిస్తోందనే సమాచారం తమ వద్ద ఉన్నాయని డినాన్నో చెప్పారు. జూన్ 22, 2020న చైనా అలాంటి ఒక అణు పరీక్షను నిర్వహించిందని ఆరోపించారు. గల్వాన్ ఘర్షణ జరిగిన కేవలం 7 రోజుల తర్వాత ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. గల్వాన్ ఘర్షణల్లో భారత్ 20 మంది సైనికులను కోల్పోయింది. భారత్ చైనాపై జరిపిన దాడిలో 35-40 మంది చనిపోయినట్లు యూఎస్ నివేదికలు చెబుతున్నాయి. చైనా తన సైనికుల మరణాలను ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు.
చైనా అణుపరీక్షపై యూఎస్ ఏం చెప్పింది.?
చైనా, భారత్ తో ఘర్షణలు జరిగిన 7 రోజులకే జిన్ఙియాంగ్ ప్రావిన్సుల్లోని లోప్ నూర్ సైట్లో అణు పరీక్షలు నిర్వహించింది. పరీక్షల్లో భూమి కంపనాలను గుర్తించడం కష్టంగా ఉండేందుకు ‘‘డీకప్లింగ్’’ అనే టెక్నాలజీని చైనా ఉపయోగించినట్లు అమెరికన్ అధికారి చెబుతున్నారు. డీ కప్లింగ్ అంటే భూగర్భంలో అతిపెద్ద గుహలో పరీక్షలు నిర్వహించడం. దీని వల్ల ఏర్పడే భూకంప తరంగాలు గుహలోనే అబ్సార్వ్ అవుతాయి. చైనా జూన్ 22, 2020న ఇలాంటి పరీక్ష నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి.