Strike: పెట్రో ధరలపై ఆగ్రహం.. రెండు రోజులు ఆటోలు, టాక్సీలు బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రో ధరల పెరుగుదల వెనుక ఎలాంటి కారణాలు ఉన్నా.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఆ ధరల జోలికి పోలేదు.. ఇక, ఫలితాలు వెలువడిన తర్వాత కాస్త గ్యాస్ తీసుకుని వరుసగా వడ్డించింది.. దీంతో.. పెట్రోల్ ధరలు ఆల్టైం హై రికార్డును సృష్టించాయి. దీంతో, ఢిల్లీలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఇవాళ, రేపు బంద్ పాటిస్తున్నారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఈ రెండు రోజుల ఆందోళన చేపట్టారు. పెట్రో ధరలను తగ్గించడంతో పాటు తమ కిరాయి పెంచాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దేశం కరోనా కష్టకాలం మొదలయ్యాక పెట్రో ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజారవాణా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. అయితే, ఆటో, ట్యాకీ డ్రైవర్లకు ఈ పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది.
Read Also: Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
Also Read
- Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
- Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
- Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
- Twisha Sharma: సీబీఐ ఛార్జ్షీట్లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా ఢిల్లీలోని ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల సంఘాల సభ్యులు సోమవారం నుంచి రెండు రోజుల పాటు సమ్మె చేయాలని నిర్ణయించారు. ఛార్జీలు పెంచాలని, ఇంధన ధరలు తగ్గించాలని పలు ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ సమస్యలను పరిష్కరిస్తామని ఢిల్లీ ప్రభుత్వం హామీ ఇచ్చినా సమ్మె విరమించలేదు. సమయానుకూలంగా ఛార్జీల సవరణను పరిశీలించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ మజ్దూర్ సంఘ్కు చెందిన ఆటో అండ్ ట్యాక్సీ అసోసియేషన్ ఆఫ్ ఢిల్లీ ఏప్రిల్ 18 మరియు 19 తేదీలలో ఢిల్లీలో సమ్మెను ప్రకటించింది. ఈ రెండు రోజులలో పెద్ద సంఖ్యలో ఆటోలు మరియు క్యాబ్లు ఢిల్లీ వీధుల్లోకి రావని వారు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
-
Anasuya Bharadwaj: మరో వివాదంలో నటి అనసూయ.. ‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై కేసు నమోదు ..
-
NC25 : వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని హీరో మైల్స్టోన్ మూవీ?
-
AP Assembly: నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్తో ప్రారంభం కానున్న శాసనసభ!
ట్రెండింగ్
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!