Delhi: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహ అదృశ్యం.. రంగంలోకి పోలీసులు
- ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహ అదృశ్యం
- రంగంలోకి పోలీసులు.. పని చేయని సీసీకెమెరాలు
- ఆందోళనలో బాధిత కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థిని స్నేహ దేబ్నాథ్(19) అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ యూనివర్సిటీలోని ఆత్మ రామ సనాతన ధర్మ కళాశాలకు చెందిన విద్యార్థిని స్నేహ దేబ్నాథ్ జూలై 7న అదృశ్యమైంది. ఆమె స్వస్థలం త్రిపుర. ఢిల్లీకి వచ్చి చదువుకుంటోంది. మాజీ సైనికుడు, సుబేదార్ మేజర్ (గౌరవ లెఫ్టినెంట్) ప్రీతిష్ దేబ్నాథ్ (రిటైర్డ్) కుమార్తె. ప్రస్తుతం ఆమె మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతోంది. డయాలసిస్ చేయించుకుంటోంది. అయితే బిడ్డ సమాచారం తెలియకపోవడంతో పేరెంట్స్ తల్లడిల్లుతున్నారు. కుమార్తె జాడ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇక 48 గంటల తర్వాత బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. అలాగే తమ బిడ్డ జాడను తెలియజేయాలని ప్రజలకు బాధిత కుటుంబం విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి: Air India Crash: ఎయిర్ ఇండియా క్రాష్ రిపోర్టుపై పైలట్ల సందేహాలు..
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
జూలై 7న స్నేహితురాలిని సారాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్లో దించేందుకు స్నేహ వెళ్లింది. ఉదయం 6:45 గంటలకు స్నేహితురాలిని దింపబోతున్నట్లు కుటుంబ సభ్యులకు ముందుగానే సమాచారం అందించింది. ఉదయం 5:56 గంటలకు తల్లి ఫోన్ చేసినప్పుడు మాట్లాడింది. తిరిగి ఉదయం 8:45 గంటలకు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ఛాప్ అని వచ్చింది. అయితే స్నేహ.. స్నేహితురాలిని కలవలేదని తెలుస్తోంది. క్యాబ్ డ్రైవర్.. రైల్వే స్టేషన్లో దింపడానికి బదులుగా సిగ్నేచర్ బ్రిడ్జి దగ్గర దింపాడని తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉంటే బ్రిడ్జి దగ్గర సీసీ కెమెరాలు పని చేయడం లేదు. దీంతో బాధిత కుటుంబం మరింత ఆందోళనకు గురవుతోంది.
ఇది కూడా చదవండి: Shravan Masam 2025: శ్రావణ మాసంలో శివుడిని పూజించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు…
ఇక స్నేహ అదృశ్యంపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా.. ఢిల్లీ అధికారులను సంప్రదించారు. ఆమె జాడను కనుగొనాలని ఢిల్లీ పోలీసులను కోరారు. అంతేకాకుండా ఇంకోవైపు కుటుంబ సభ్యులు కూడా గాలిస్తున్నారు. ఇక ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్.. స్నేహ కోసం గాలిస్తున్నారు. అయితే ఆమె దగ్గర ఎలాంటి వస్తువులు లేనట్లుగా తెలుస్తోంది. కేవలం ఆమె దగ్గర ఫోన్ మాత్రమే ఉంది. అంతేకాకుండా 4 నెలలుగా స్నేహ ఎటువంటి నగదు కూడా తీసుకోలేదని గుర్తించారు. ఇక స్నేహ అదృశ్యమైన 48 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ అయింది. అయితే సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!