Delhi: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహ అదృశ్యం.. రంగంలోకి పోలీసులు
- ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహ అదృశ్యం
- రంగంలోకి పోలీసులు.. పని చేయని సీసీకెమెరాలు
- ఆందోళనలో బాధిత కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థిని స్నేహ దేబ్నాథ్(19) అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ యూనివర్సిటీలోని ఆత్మ రామ సనాతన ధర్మ కళాశాలకు చెందిన విద్యార్థిని స్నేహ దేబ్నాథ్ జూలై 7న అదృశ్యమైంది. ఆమె స్వస్థలం త్రిపుర. ఢిల్లీకి వచ్చి చదువుకుంటోంది. మాజీ సైనికుడు, సుబేదార్ మేజర్ (గౌరవ లెఫ్టినెంట్) ప్రీతిష్ దేబ్నాథ్ (రిటైర్డ్) కుమార్తె. ప్రస్తుతం ఆమె మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతోంది. డయాలసిస్ చేయించుకుంటోంది. అయితే బిడ్డ సమాచారం తెలియకపోవడంతో పేరెంట్స్ తల్లడిల్లుతున్నారు. కుమార్తె జాడ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇక 48 గంటల తర్వాత బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. అలాగే తమ బిడ్డ జాడను తెలియజేయాలని ప్రజలకు బాధిత కుటుంబం విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి: Air India Crash: ఎయిర్ ఇండియా క్రాష్ రిపోర్టుపై పైలట్ల సందేహాలు..
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
జూలై 7న స్నేహితురాలిని సారాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్లో దించేందుకు స్నేహ వెళ్లింది. ఉదయం 6:45 గంటలకు స్నేహితురాలిని దింపబోతున్నట్లు కుటుంబ సభ్యులకు ముందుగానే సమాచారం అందించింది. ఉదయం 5:56 గంటలకు తల్లి ఫోన్ చేసినప్పుడు మాట్లాడింది. తిరిగి ఉదయం 8:45 గంటలకు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ఛాప్ అని వచ్చింది. అయితే స్నేహ.. స్నేహితురాలిని కలవలేదని తెలుస్తోంది. క్యాబ్ డ్రైవర్.. రైల్వే స్టేషన్లో దింపడానికి బదులుగా సిగ్నేచర్ బ్రిడ్జి దగ్గర దింపాడని తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉంటే బ్రిడ్జి దగ్గర సీసీ కెమెరాలు పని చేయడం లేదు. దీంతో బాధిత కుటుంబం మరింత ఆందోళనకు గురవుతోంది.
ఇది కూడా చదవండి: Shravan Masam 2025: శ్రావణ మాసంలో శివుడిని పూజించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు…
ఇక స్నేహ అదృశ్యంపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా.. ఢిల్లీ అధికారులను సంప్రదించారు. ఆమె జాడను కనుగొనాలని ఢిల్లీ పోలీసులను కోరారు. అంతేకాకుండా ఇంకోవైపు కుటుంబ సభ్యులు కూడా గాలిస్తున్నారు. ఇక ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్.. స్నేహ కోసం గాలిస్తున్నారు. అయితే ఆమె దగ్గర ఎలాంటి వస్తువులు లేనట్లుగా తెలుస్తోంది. కేవలం ఆమె దగ్గర ఫోన్ మాత్రమే ఉంది. అంతేకాకుండా 4 నెలలుగా స్నేహ ఎటువంటి నగదు కూడా తీసుకోలేదని గుర్తించారు. ఇక స్నేహ అదృశ్యమైన 48 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ అయింది. అయితే సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
-
Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
-
Disha Patani : ప్రాణ స్నేహితులకు కన్నీటి వీడ్కోలు.. ఇన్స్టాలో దిశా ఎమోషనల్ పోస్ట్ వైరల్
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..