Shravan Masam 2025: శ్రావణ మాసంలో శివుడిని పూజించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shravan Masam 2025: తెలుగు పంచాంగం ప్రకారం.. గత రెండ్రోల కిందటే శ్రావణ మాసం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ నెల మొత్తం అమ్మవారి దేవాలయాలు, శివుడు, శ్రీ హరి ఆలయాలన్నీ భక్తులతో కళకళలాడుతాయి. శివ భక్తులు శివ మాల ధరించి, శివ భజన, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తారు. అంతేకాదు వివాహిత మహిళలు వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతాలు చేస్తారు. ముఖ్యంగా శివయ్యకు శ్రావణ సోమవారం రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులందరూ ఉపవాసం ఉంటారు. శ్రావణ మాసంలో పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి.. శివయ్యకు ఏ విధమైన పూజలు చేస్తే కోరికలన్నీ నెరవేరుతాయనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం…
READ MORE: MS Dhoni: ధోని షర్ట్ ఐఫోన్ కంటే కాస్ట్లీ.. ధర ఎంతంటే?
Also Read
- Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
- Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
సూర్యోదయానికి ముందే నిద్రలేచి…స్నానమాచరించి శివాలయాలను దర్శించుకోవాలి. శివుడికి పాలు లేదా గంగా నీళ్లతో అభిషేకం చేసి, బిల్వపత్రం, విభూది సమర్పించాలి. అనంతరం ఓం నమఃశివాయ అంటూ మంత్రాన్ని జపించాలి. మీకు తోచిన మేరకు పేదలకు దానం చేయాలి. ఇలా శ్రావణమాసంలో వచ్చే సోమవారం చేస్తే మంచిఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. సోమవారం శివ భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని ఉపవాస దీక్షలతో స్వామివారి పూజలో పాల్గొంటారు. ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే సోమవారం పరమేశ్వరుడికి పూజ చేయడం వల్ల జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. భక్తులు ఉపవాసంతో ఆలయాలకు వెళ్లి పరమేశ్వరుడికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకాలు నిర్వహిస్తారు.ఈ క్రమంలోనే అభిషేక ప్రియుడు అయినటువంటి పరమశివుడికి తేనెతో అభిషేకం చేయటం వల్ల మనకు ఆరోగ్యం సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.
READ MORE: Chhangur Baba: హిందూ అమ్మాయిలను వలలో వేయడానికి 1000 మంది ముస్లిం యువకులకు నిధులు..
ఇలాంటి తప్పులు చేయొద్దు..
మత విశ్వాసాల ప్రకారం, కొబ్బరికాయను విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. శ్రావణ మాసం పూజలో శివుడికి కొబ్బరినీళ్లతో అభిషేకం చేయకూడదు. అలాగే శివారాధనలో కుంకుమ లేదా కుంకుమను ఉపయోగించకూడదని నమ్ముతారు. అందుకే వీటిని పూజలో వాడొద్దు. శ్రావణ మాసంలో మాంసం, ఆల్కహాల్ తీసుకోవడం మానుకోవాలి. తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అందుకే శివారాధనలో దానిని వాడకూడదు.మత విశ్వాసాల ప్రకారం, శివుడిని పూజించేటప్పుడు నల్లని దుస్తులు ధరించకూడదు.
తాజావార్తలు
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్లతో ఎక్స్లో పోస్టులు!
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్పై ఉపాసన రియాక్షన్!
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?