EV adoption: దేశంలో పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల(EV) స్వీకరణ.. టాప్లో ఢిల్లీ..
- దేశంలో పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ..
- ఈవీ అడాప్టేషన్లో ఢిల్లీ టాప్..
- FICCI-యెస్ బ్యాంక్ నివేదికలో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EV adoption: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(EV) స్వీకరణ పెరుగుతోంది. రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య దేశవ్యాప్తంగా మరింత పెరిగే అవకాశం ఉందని FICCI-యెస్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఈవీ స్వీకరణలో ఢిల్లీ టాప్ ప్లేస్లో ఉన్నట్లు చెప్పింది. ఢిల్లీలో ఈవీ పెనట్రేషన్ రేటు 11.5 శాతంగా ఉందని, వివిధ విభాగాల్లో ఈవీలను అడాప్ట్ చేసుకుంటున్నట్లు నివేదిక హైలెట్ చేసింది.
కేరళలో 11.1 శాతం, అస్సాంలో 10 శాతంగా ఉన్నాయని, ఇక్కడ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ట్రీ వీలర్ ఎక్కువగా ఉన్నట్లు చెప్పింది. దీనికి తోడు గుజరాత్, ఒడిశా, కేరళ, పంజాబ్ రాష్ట్రాలు ఆర్థిక సంవత్సరాలు 21-24 వరకు ఈవీ అమ్మకాల్లో అత్యధితక కాంపౌడ్ వార్షిక వృద్ధి రేటు(CAGR) నమోదు చేశాయి. రాష్ట్రాలు సహకరించడం, ఈవీ వ్యూహాల ప్రాముఖ్యతను నివేదిక నొక్కొ చెప్పింది. ఈ ఐదు రాష్ట్రాలు 2024 ఆర్థిక సంవత్సరంలో ఈవీల పెరుదలలో సఘానికి పైగా దోహదపడ్డాయని, గత నాలుగేళ్లుగా ఈవీ అమ్మకాల విస్తరణ మెరుగుపడిందని నివేదిక పేర్కొంది.
Also Read
- BJPలో చేరిన రాఘవ్ చడ్డాకు ఓటర్ లిస్ట్ షాక్.. పంజాబ్ ఓటర్ లిస్ట్లో పేరు మాయం!
- Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
Read Also: Hyundai Creta EV : హ్యుందాయ్ నుండి వచ్చిన ఈ బ్లాక్ బ్యూటీ మహీంద్రా కొత్త EVతో పోటీ పడుతోంది..!
దేశం నెట్-జీరో లక్ష్యాలను సాధించడానికి ఈవీ పరివర్తన అనేది చాలా కీలకమని చెప్పింది. 2030 నాటికి జాతీయ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రస్తుత EV వ్యాప్తి రేటును రెట్టింపు చేయాలని నివేదిక కోరింది. రాష్ట్రాలు తమ ఈవీ పాలసీలను 2030 వరకు పునరుద్ధరించాలని కోరింది. ప్రజారవాణా, విమానాల ఆపరేషన్స్లో ఈవీ స్వీకరణ తప్పనిసరి చేయాల్సిన అవసరాన్ని నివేదిక చెప్పింది. అనేక రాష్ట్రాల EV విధానాల గడువు ముగియడంతో, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మరియు EV స్వీకరణను వేగవంతం చేయడానికి స్థిరమైన మరియు దీర్ఘకాలిక విధాన వాతావరణాన్ని అందించడం యొక్క ప్రాముఖ్యతను నివేదిక నొక్కి చెప్పింది.
దేశం అంతటా జీరో ఎమిషన్ వెహికల్ (ZEV) వ్యాప్తిని పెంపొందించడానికి కార్యాచరణ సిఫారసులను అందిస్తూనే, ఆశయం-అమలుకు మధ్య అంతరాన్ని తగ్గించడానికి రోడ్ మ్యాప్ని సూచించింది. స్థిరమైన ఆర్థిక చర్యల ద్వారా పరిశ్రమ అభివృద్ధికి, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను రాష్ట్రాలు మరింత వేగం చేయాలని చెప్పింది.
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు విడుదలకు అడ్డంకి
-
Nara Lokesh: వాయిదాపడే ప్రసక్తే లేదు.. స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి!
-
Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!
-
ED Raids: దక్షిణాదిలో 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు.!
-
Kamal : సిద్ధా’ డైరెక్టర్తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!