Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
- ఢిల్లీలోని వివేక్ విహార్లో భారీ అగ్నిప్రమాదం
- 9 మంది మృతి
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం ఉదయం ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కనీసం తొమ్మిది మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక శాఖ మంటలను చల్లార్చేందుకు శ్రమిస్తోంది. గాలింపు చర్యలు కొనసాగుతున్న కొద్దీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున సుమారు 3:47 గంటలకు ఫైర్ కంట్రోల్ రూమ్కు కాల్ వచ్చిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వెంటనే 14 అగ్నిమాపక వాహనాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి, భవనంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు చేపట్టాయి.
దట్టమైన పొగ నుండి 12 మందికి పైగా ప్రజలను రక్షించారు. మృతుల సంఖ్య 8 నుండి 9కి పెరిగింది. మరో నలుగురు తీవ్రంగా కాలిపోయారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణల ప్రకారం, భవనంలోని రెండవ అంతస్తులో ఉన్న ఒక ఫ్లాట్లో ఏసీ పేలుడు కారణంగా మంటలు చెలరేగి, అవి మూడవ అంతస్తుకు వ్యాపించాయి. మంటలు మూడవ అంతస్తుకు చేరిన తర్వాత ఫ్లాట్లోని వారు తమను తాము రక్షించుకోవడానికి ఇంటి పైకప్పుపైకి పరుగెత్తారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
అయితే పైకప్పు తలుపు మూసి ఉండటంతో వారు మరణించినట్లు సమాచారం. రెండవ అంతస్తులోనూ నలుగురు మరణించారు. ప్రమాదంలో మృతుల గుర్తింపు ఇంకా నిర్ధారించబడలేదని, వెలికితీసిన మృతదేహాలు చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయని పోలీసులు తెలిపారు. మూడు మృతదేహాలు వారి బెడ్ పైనే లభించాయని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?