Delhi: యోగికి రేఖా గుప్తా లేఖ.. యమునా నదిపై కీలక వ్యాఖ్యలు
- సీఎం యోగికి రేఖా గుప్తా లేఖ
- యమునా నదిలో ఇసుక తవ్వకాలు అరికట్టాలని వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్కు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు లేఖ రాయడం సంచలనంగా మారింది. యమునా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టాలని రేఖా గుప్తా కోరారు. ఇసుక అక్రమ తవ్వకాలతో ఢిల్లీకి ప్రమాదం పొంచి ఉందని.. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇద్దరు బీజేపీ ముఖ్యమంత్రుల మధ్య లేఖ చర్చనీయాంశంగా మారింది. ఇది అంతర్ రాష్ట్ర సమస్యగా రేఖా గుప్తా లేఖలో పేర్కొనడం విశేషం. ఈ సందర్భంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆందోళనలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు తెలియజేశారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్లకపోతే భవిష్యత్లో రాజధాని ప్రజలకు ముప్పు పొంచి ఉంటుందని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: KTR: సీఎం వేస్తారేమో అనుకున్నాం.. ఢిల్లీకి వెళ్లారు.. డిప్యూటీ సీఎం, వ్యవసాయ మంత్రి ఎవరైనా రండి చర్చిద్దాం
Also Read
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
మైనింగ్ కార్యకలాపాలు కారణంగా నది బలహీనంగా మారుతుందని.. దీంతో దేశ రాజధాని ఢిల్లీకి వరదల ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. అంతేకాకుండా తవ్వకాలు కారణంగా సహజ మార్గాన్ని కూడా మారుస్తాయని చెప్పారు. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు తీవ్ర ప్రభావం చూపుతుందని రేఖా గుప్తా గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Bathukamma Kunta : బతుకమ్మ కుంట బతికింది.. ఎంత బాగుందో ఇప్పుడు..
అక్రమ తవ్వకాలు అంతర్-రాష్ట్ర సమస్యగా రేఖా గుప్తా తెలిపారు. రెండు ప్రభుత్వాల మధ్య ఉమ్మడి చర్యలు అవసరమని వివరించారు. దీనిపై ఢిల్లీ, యూపీ ప్రభుత్వాల మధ్య సమన్వయ చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. స్పష్టమైన సరిహద్దులు లేకపోవడం వల్లే పర్యవేక్షణ చర్యలు క్లిష్టతరంగా మారినట్టు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం సహకార విధానాన్ని కోరుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి యూపీ పరిపాలనా సమన్వయాన్ని ప్రారంభించాలని రేఖా గుప్తా అభ్యర్థించారు. దీనిపై యోగి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. సానుకూలంగా స్పందిస్తుందో.. లేదంటే తోసిపుచ్చుతుందో చూడాలి.
తాజావార్తలు
-
IRUMUDI Collections : ఇరుముడి మూడు రోజుల కలెక్షన్స్.. ‘బ్లాక్బస్టర్’ ఈజ్ స్మాల్ వర్డ్
-
IND vs SL 2nd Test: పంత్, జురెల్ హాఫ్ సెంచరీలు.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ అంతంటే?
-
Chiranjeevi: వయసు పెరిగినా ఎనర్జీ తగ్గని మెగాస్టార్… 71 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ తో అదరగొడుతున్న ‘కాకా’
-
Simple Ultra: సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్.. 400KM రేంజ్, 115 kmph స్పీడ్.. ధర ఎంతంటే?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..