Delhi Car Blast : LNJP ఆస్పత్రికి అమిత్షా.. గాయపడినవారికి పరామర్శ..
- రెడ్ ఫోర్ట్ సమీపంలో i20 కారు పేలుడు
- పేలుడులో 10 మంది మృతి.. పలువురు గాయాలు
- LNJP ఆస్పత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్షా
- పేలుడు ఘటనలో గాయపడినవారికి అమిత్ షా పరామర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Car Blast : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించి భయాందోళనలు చెలరేగాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెం.1 సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సాయంత్రం 6.52 గంటల సమయంలో హ్యుందాయ్ i20 కారు ఒక్కసారిగా పేలిపోయింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు కనీసం 10 మంది మృతిచెందినట్లు అధికార వర్గాలు నిర్ధారించాయి. పలువురు గాయపడగా, వారిని సమీపంలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు.
Bihar Elections 2025: ‘చావోరేవో’ దశలోకి బీహార్ ఎన్నికలు.. ఎవరికీ లైఫ్లైన్, ఎవరికీ ఫినిష్ లైన్!
Also Read
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ఈ ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే స్పందించారు. గాయపడిన వారిని చూడటానికి ఆయన ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు అమిత్షా. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అమిత్ షా ఆదేశించారు. అనంతరం పేలుడు ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు. ఈ పేలుడుపై హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. “రెడ్ ఫోర్ట్ సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న హ్యుందాయ్ i20 కారులో భారీ శబ్దంతో పేలుడు జరిగింది. ఈ ఘటనలో పాదచారులు సహా పలువురు గాయపడ్డారు. కొన్ని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రాణనష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందింది. పేలుడు సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం NSG, NIA, FSL బృందాలు సమగ్ర విచారణను ప్రారంభించాయి. పరిసర ప్రాంతాల్లోని అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించేందుకు ఆదేశాలు జారీ చేశాం” అని అన్నారు.
“ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో పాటు స్పెషల్ బ్రాంచ్ అధికారులు కూడా ఘటనాస్థలంలో ఉన్నాయి. అన్ని కోణాల్లో విచారణ సాగుతుంది. ప్రజలకు పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం. ఆసుపత్రిలో గాయపడిన వారిని చూడడంతో పాటు వెంటనే సంఘటన స్థలాన్ని సందర్శిస్తాను,” అని స్పష్టం చేశారు. పేలుడు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే పలు అనుమానాస్పద కోణాల్లో విచారణను ప్రారంభించాయి. ప్రాంతమంతా భద్రత పెంచి, సుభాష్ మార్గ్ను తాత్కాలికంగా మూసివేసినట్లు పోలీసులు తెలిపారు.
Alluri Missing Girls : అల్లూరి జిల్లాలో అదృశ్యమైన ఇద్దరు బాలికలు సేఫ్
#WATCH | Delhi: Blast near Red Fort Metro Station | Union Home Minister Amit Shah holds a meeting with Delhi Police CP Satish Golcha and other officials as he arrives at Lok Nayak Hospital. pic.twitter.com/xONGyu4qCF
— ANI (@ANI) November 10, 2025
తాజావార్తలు
-
Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
-
Xiaomi TV FX Mini LED Series: షియోమి TV FX Mini LED సిరీస్ విడుదల.. Dolby Vision, Fire TV, 4K డిస్ప్లే
-
Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
-
Infinix Smart 20: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 రిలీజ్ డేట్ ఫిక్స్.. 5,200mAh బ్యాటరీ, ధర రూ. 10,000 లోపే..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!