కోలుకున్న తర్వాత కూడా సమస్యలు.. ఐదారు నెలలు కోవిడ్ లక్షణాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో కరోనా ఫస్ట్ వేవ్ కంటే.. సెకండ్ వేవ్ ఓ కుదుపు కుదిపేసింది.. కరోనాబారినపడినవారి సంఖ్య పెరగడమే కాదు.. కోవిడ్తో చనిపోయిన వారి సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక, కోవిడ్ బారినపడినవారి ఒళ్లు గుల్లైపోతోంది.. కరోనా నుంచి కోలుకున్నతర్వాత కూడా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా వారు ఐదారు నెలల పాటు కరోనా లక్షణాలతో సతమతమవుతున్నట్టుగా తెలుస్తోంది.. ఈ పరిస్థితికి వైద్య పరిభాషలో లాంగ్ కోవిడ్ అనే పేరు పెట్టారు. ఈ పరిస్థితులపై మాట్లాడిన ఢిల్లీలోని ఎయిమ్స్ కోవిడ్ వైద్య నిపుణులు డాక్టర్ నీరజ్ నిశ్చల్.. లాంగ్ కోవిడ్ లక్షణాలు కేవలం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోని కోవిడ్ బాధితులు కూడా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బాధితులు కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా సుమారు ఐదారు నెలల పాటు వారిలో కోవిడ్-19 క్షణాలు కనిపిస్తున్నాయన్నారు. అయితే, సాధారణ కోవిడ్ను ఎదుర్కున్నవారిలో దీర్ఘకాలం పాటు ఇలాంటి లక్షణాలు లేకపోయినా.. తీవ్రమైన కోవిడ్ ఎదుర్కొన్నబాధితుల్లో మాత్రం ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు డాక్టర్ నీరజ్ నిశ్చల్.
దీనికి సంబంధించిన అధ్యయన నివేదికపై కూడా క్లారిటీ ఇచ్చారు డాక్టర్ నీరజ్ నిశ్చల్… భారత్లో, ఇతర దేశాల్లో దాదాపు 20 శాతం మంది బాధితులు సుదీర్ఘ కోవిడ్తో ఇబ్బందిపడుతున్నారని తెలిపారు.. కోవిడ్ నుండి కోలుకున్నా… వారు బాగా అలసటకు గురవుతున్నట్టు అధ్యయనాల్లో తేలిందన్నారు.. ఒక అధ్యయనంలో కరోనా నుంచి కోలుకున్నవారిలో 11.8 శాతం బాధితులు తీవ్రమైన అలసటకు గురువుతున్నారని.. 10.9 శాతం మందిలో దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు కనిపించాయని.. 6.4 శాతం మంది రుచి కోల్పోవడం.. 6.3 శాతం మంది వాసన కోల్పోవడం.. 6.2 శాతం మంది గొంతు నొప్పితో బాధపడడం.. 5.6 శాతం మందికి శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయని అధ్యయనాల్లో బయటపడినట్టు చెబుతున్నారు. కాగా, కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ లాంటివి కూడా వెలుగు చూస్తున్నాయి.. మరికొందరిలో అక్కడక్కడ రక్తం గడ్డకట్టి.. బాధితులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్టు బయటపడిన సంగతి కూడా తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
Manchu Manoj : ‘ఐక్య’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!
-
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!