Rajnath Singh: భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాం
- భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాం
- గుజరాత్లోని భుజ్ ఎయిర్బేస్ను సందర్శించిన రాజ్నాథ్సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో చూపించామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ తెలిపారు. గుజరాత్లోని భుజ్ ఎయిర్బేస్ను రాజ్నాథ్సింగ్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పాకిస్థాన్పై భారత్ విజయానికి భుజ్ ప్రత్యక్ష సాక్ష్యం అని తెలిపారు. పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని.. మన వాయుసేన అసమాన పరాక్రమం చూపిందని కొనియాడారు. సరిహద్దు దాటకుండానే పాక్లోని టార్గెట్స్ను ధ్వంసం చేసినట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Ramprasad Reddy: త్వరలోనే జగన్, పెద్దిరెడ్డి, రోజా జైలుకు పోతారు!
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
పాకిస్థాన్.. భుజ్ ఎయిర్బేస్ను లక్ష్యంగా చేసుకుందని.. క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసిందని.. వీటిన్నింటినీ భారత వాయుసేన తప్పికొట్టిందని వెల్లడించారు. మన భూభాగంపై ఎలాంటి నష్టం జరగకుండానే అడ్డుకుందని తెలిపారు. భారత వాయుసేన.. పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం, అలాగే మౌలిక సదుపాయాలను నాశనం చేసిందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Konda Surekha : అవినీతి చేసేవాళ్లే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు
భారత్పై ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్థాన్కు 2.1 బిలియన్ డాలర్ల బెయిలౌట్ను పున:పరిశీలించాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF)ను కోరారు. పాకిస్థాన్కు సాయం చేస్తే పరోక్షంగా ఉగ్రవాదానికి నిధులు ఇచ్చినట్లే అవుతుందని తెలిపారు. పాకిస్థాన్కు ఇచ్చే ఏదైనా ఆర్థిక సహాయం అది ఉగ్రవాదానికేనని.. దీంతో ఐఎంఎఫ్ తన నిర్ణయాన్ని పున:పరిశీలించాలని డిమాండ్ చేశారు.
పాకిస్తాన్లోని ప్రతి మూలకు.. ఉగ్రవాదం దాగి ఉన్న ప్రతి చోటికి కూడా తాము చేరుకోగలమని ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి నిరూపించినందుకు ఐఏఎఫ్ను రక్షణ మంత్రి ప్రశంసించారు. ప్రజలు అల్పాహారం తీసుకునే సమయంలోపే వాయుసేన.. పాక్ ఉగ్రవాదులను హతమార్చారని కొనియాడారు. పాకిస్థాన్ చాలా కాలంగా ఉగ్రవాద సంస్థలను పెంచిపోషిస్తోందని.. ఉగ్రవాదులకు పాకిస్థాన్ సురక్షిత స్వర్గధామంగా మారిపోయిందని.. ఒసామా బిన్ లాడెన్ కూడా 2011లో పాకిస్థాన్లోనే దాక్కుకున్నట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం ఐఎంఎఫ్ రెండు విడతలగా 2.1 బిలియన్ల సాయం చేస్తోంది. ఆ సాయాన్ని నిలిపివేయాలని రాజ్నాథ్సింగ్ విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!