Anganwadi: మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో అంగన్వాడీ ఆహారంలో చనిపోయిన పాము కనిపించింది. అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణీలకు అందించే పోషకాహార లడ్డూ ప్యాకెట్లో చనిపోయిన పాము పిల్ల కనిపించడం స్థానికంగా కలకలం కలిగించింది. ఈ ఘటన పాండుర జిల్లాలోని కర్ఘాట్ కమ్థి గ్రామంలో చోటుచేసుకుంది. వచలా బాయి ధుర్వే అనే గర్భిణీ స్త్రీకి అంగన్వాడీ కేంద్రం నుంచి పోషకాహార ప్యాకెట్ అందించారు.
ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కుటుంబీకులు ఆ ప్యాకెట్ను తెరిచి చూడగా అందులో చనిపోయిన పాము పిల్ల కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే, ఈ ఆహారాన్ని ఎవరూ తినకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆందోలన వ్యక్తి చేశారు. గర్భిణీలు, చిన్నపిల్లలకు సరఫరా చేసే ఆహార నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఫుడ్ శాంపిళ్లను పరీక్ష కోసం పంపారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న అధికారులు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేశారు.

