Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
- రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్కు షాక్..
- బెయిల్కు నిరాకరించిన సుప్రీంకోర్టు..
- విచారణ మరింత వేగవంతం చేయాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Darshan Case: కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్కు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. దర్శన్ బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో పాటు విచారణ వేగవంతం చేయాలని ఆదేశించింది. జస్టిస్లు జె.బి. పర్దివాలా, విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం, కేసు విచారణ వేగం అత్యంత మందకొడిగా ఉందని పేర్కొంది.
రేణుకా స్వామి హత్య కేసులో 60 మంది కీలక సాక్షుల విచారణ ఏడాదిలోగా పూర్తి చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అవసరమైతే రోజూవారీ విచారణ జరిపేందుకు కూడా ట్రయల్ కోర్టుకు అనుమతి ఇచ్చింది. గత ఏడు నెలల్లో కేవలం 10 మంది సాక్షులను మాత్రమే విచారించారని, అయితే ప్రాసిక్యూషన్ 60 మంది కీలక సాక్షులను ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చిన్న చిన్న కారణాలతో విచారణ వాయిదా వేయకూడదని, విచారణకు డిఫెన్స్ సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. ఏడాదిలోగా విచారణలో స్పష్టమైన పురోగతి లేకుంటే దర్శన్ మళ్లీ కోర్టును ఆశ్రయించొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.
Also Read
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
- CM Vijay Tiruchi Speech: తన డ్రెస్సింగ్ స్టైల్పై ట్రోల్స్ చేసినోళ్లకు సీఎం విజయ్ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. !
- Mamata Banerjee: నాతో ఆడుకుంటున్నారు.. నాకు టైమొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది.. బీజేపీకి మమత హెచ్చరిక
దర్శన్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, ప్రాసిక్యూషన్ 272 మంది సాక్షులను ప్రవేశపెట్టాలని భావిస్తోందని, అయితే ఇప్పటివరకు పురోగతి చాలా నెమ్మదిగా ఉందని అన్నారు. దర్శన్ను క్వారంటైన్ సెల్లో ఉంచారని, ఇతర ఖైదీలను కలవడానికి అతడిని అనుమతించడం లేదని కూడా ఆయన ఆరోపించారు. అయితే అలాంటిదేం లేదని ప్రభుత్వం తరుఫున న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా కోర్టుకు తెలిపారు. ఇతర ఖైదీలను కలుసుకునేందుకు అతడిని అడ్డుకోలేదని చెప్పారు.
దర్శన్ లివ్ ఇన్ పార్ట్నర్గా భావిస్తున్న నటి పవిత్ర గౌడపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడనే ఆరోపణలపై, చిత్ర దుర్గకు చెందిన 33 ఏళ్ల రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. దర్శన్తో సహా పలువురు నిందితులు అతడిని చచ్చేలా కొట్టారు. చివరకు చిత్రహింసలు తీవ్రం కావడంతో అతను మరణించారు. జూన్ 2024లో బెంగళూర్లోని షెడ్డులో మూడు రోజుల పాటు అతడిపై అమానవీయమైన దాడి జరిగింది. ఆ తర్వాత అతడి మృతదేహం సమీపంలోని కాలువలో లభ్యమైంది.
తాజావార్తలు
-
IPL 2026: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర కలకలం.. ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్పై భారీ జరిమానా, నిషేధం..
-
Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
-
Virat Kohli: ‘చెయ్యి దించు.. లేదంటే కొట్టేస్తా’.. కృనాల్ పాండ్యాపై కోహ్లీ ఆగ్రహం..
-
Priyanka Mohan: గ్లోబల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ బ్యూటీ రచ్చ.. కొరియా పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రియాంక మోహన్!
-
PM SVANidhi Scheme: ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు రుణం..! షూరిటీ కూడా అవసరం లేదు
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!