Cyclone Biparjoy: 12 గంటల్లో అత్యంత తీవ్రమైన తుఫాన్గా “బిపార్జాయ్”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపార్జాయ్’ తుఫాన్ రానున్న 12 గంటల్లో అత్యంత తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం తెలిపింది. గుజరాత్ లోని పోర్బందర్ తీరానికి 200-300 కి.మీ దూరంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే ఐదురోజులు గుజరాత్ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు, బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.
ప్రస్తుతం తుఫాన్ పోర్ బందర్ తీరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. ప్రస్తుతానికి గుజరాత్ రాష్ట్రాన్ని తుఫాన్ తాకే ప్రమాదం లేదని ఐఎండీ తెలిపింది. రానున్న ఐదు రోజుల్లో మత్స్యకారులు అరేబియా సముద్రంలోకి వెళ్లవద్దని, అన్ని చేపల వేట కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం తుఫాన్ ఉత్తర దిశగా కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో ఈశాన్య దిశగా దాని మార్గాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఆ తరువాత ఉత్తర-వాయువ్య దిశగా వెళ్లే అవకాశం ఉంది.
Also Read
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
- MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
Read Also: Ravindra Jadeja: జడేజానా మజాకా.. తొలి భారత క్రికెటర్గా చరిత్ర
రానున్న ఐదు రోజలు పాటు గుజరాత్ లో వర్షం కురుస్తుందని, ముఖ్యంగా సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఐఎండీ ప్రకారం.. శనివారం ఉదయం 11.30 గంటలకు తూర్పు తూర్పు మధ్య అరేబియా సముద్రం మీద గోవాకు పశ్చిమ-వాయువ్యంగా 700 కి.మీ, ముంబైకి పశ్చిమ-నైరుతి దిశలో 620 కి.మీ, పోర్బందర్కు 590 కి.మీ నైరుతి-నైరుతి మరియు కరాచికి 900 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది.
వచ్చే 24 గంటల్లో మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా క్రమంగా కదులుతుందని, ఆ తరువాత మూడు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతుందని ఐఎండీ తెలిపింది. సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. ఆ తర్వాత జూన్ 13-15 తేదీల్లో ఈ ప్రాంతంలో ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గంటకు 30-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా పోర్బందర్ మరియు కచ్ మరియు జామ్నగర్ వంటి తీరప్రాంత జిల్లాలలో గంటకు 60 కి.మీ మరియు 75 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. పోర్బందర్, గిర్ సోమనాథ్, వల్సాద్ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు.
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!