CPEC: పాక్, చైనాలకు ఇండియా స్ట్రాంగ్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India strong warning to Pakistan and China: దాయాది దేశం పాకిస్తాన్, డ్రాగన్ దేశం చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ)పై ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టులో చేరడానికి మూడో దేశాన్ని ప్రొత్సహించాలని చైనా, పాకిస్తాన్ చూస్తున్న తరుణంలో భారత్ ఘాటుగా బదులిచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అరిందమ్ బాగ్చీ భారత్ నిర్ణయాన్ని వెల్లడించారు.
పాకిస్తాన్ ఆక్రమించుకున్న భారత భూభాగంలో సీపెక్ ప్రాజెక్టును నిర్మిస్తున్నా చైనా, పాకిస్తాన్. శుక్రవారం జరిగిన సీపెక్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఈ ప్రాజెక్టులో చేరేందుకు ఆసక్తిగా మూడో దేశాన్ని స్వాగతించాలని చైనా నిర్ణయించింది. ఈ నిర్ణయంపై భారత్ తన వైఖరిని తెలియజేసింది. మంగళవారం అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ..సీపెక్ కింద ఇటువంటి కార్యకలాపాలు చట్టవిరుద్ధం అని.. ఆమోదయోగ్యం కాదని భారత్ తన వాదనను తెలియజేసింది. ఏ దేశమైనా ఇందులో చేరితే భారత దేశ సార్వభౌమాధికారిన్ని, ప్రాదేశిక సమగ్రతను ధిక్కరించడమే అవుతుందని.. బాగ్చీ అన్నారు. పాక్ అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగంలో ఉన్న సీపెక్ ప్రాజెక్టును భారత్ ధృఢంగా, స్థిరంగా వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు.
Also Read
- CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
Read Also: CM Nitish Kumar: బీహార్ సీఎంకు కరోనా పాజిటివ్.. ఏడాదిలో ఇది రెండోసారి
సీపెక్ ద్వారా పాకిస్తాన్ రోడ్డు, రైలు మార్గాలను నిర్మిస్తోంది. చైనా నుంచి భారీగా అప్పులు తీసుకుని ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది పాకిస్తాన్. చైనాలోని జిన్ జియాంగ్ ప్రావిన్స్ నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ గ్వాదర్ పోర్టు వరకు ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. చైనా ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్( బీఆర్ఐ) ప్రాజెక్టులో భాగంగా సీపెక్ ను చైనా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుపై అటు బెలూచిస్తాన్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ, పాకిస్తాన్ సైన్యంతో పాటు అక్కడ చైనీయులపై తరుచుగా దాడులు చేస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల పాక్ ఆర్థిక పరిస్థితి దిగజారినా.. కూడా పట్టించుకోవడం లేదు.
తాజావార్తలు
-
NHAI rs350 Toll Pass: NHAI కొత్త రూ.350 టోల్ పాస్.. ఎవరికి వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?
-
Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి ‘టాయ్ స్టోరీ’ 5 వరకు..
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
Meerpet Aya Murder: రూ.10 వేల కోసం ఘోరం.. మీర్పేట్ ఆయా హత్యలో షాకింగ్ ట్విస్ట్.!
-
CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
ట్రెండింగ్
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!