Covid-19: 4 వేలపైగా కరోనా కేసులు.. 24 గంటల్లో ఐదుగురు మృతి
- దేశంలో 4 వేలపైగా కరోనా కేసులు
- 24 గంటల్లో ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రెండు వారాల క్రితం అంతంత మాత్రంగా ఉన్న కేసులు ఈ వారంలో అమాంతంగా పెరిగిపోయాయి. అలాగే మరణాలు కూడా క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4, 026 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య శాఖ తెలిపింది. ఇక కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో మంగళవారం ఉదయం 8 గంటలలోపు ఐదుగురు చనిపోయారని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Rohit Sharma: నా దగ్గర బ్యాట్లు లేవు.. ఆరు దొబ్బేశారు! వీడియో వైరల్
Also Read
- Pregabalin: ప్రెగాబాలిన్ దుర్వినియోగంపై కేంద్రం అలర్ట్.. అమ్మకాలపై ఆరోగ్యశాఖ ఆంక్షలు
- CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
- Abhijit Dipke: "నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు".. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
కేరళలో డయాబెటిస్, హైపర్ టెన్షన్ వ్యాధితో బాధపడుతున్న 80 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఇక మహారాష్ట్రలో ఇద్దరు చనిపోయారు. 70, 73 ఏళ్ల మహిళలు డయాబెటిస్, హైపర్టెన్షన్తో ఉన్న రోగులు చనిపోయారని పేర్కొన్నారు. ఇక తమిళనాడులో 69 మహిళ ఏళ్ల పార్కిన్సన్స్ వ్యాధి చనిపోయింది. పశ్చిమ బెంగాల్లో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న 43 ఏళ్ల మహిళ మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: PM Modi: రేపు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలి భేటీ
కొత్త వైరస్ వేగంగా వ్యాప్తిస్తుందని.. కానీ తేలికపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిర్ధారించింది. సాధారణ లక్షణాలు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట, తలనొప్పి, శరీర నొప్పులు, ముక్కు కారటం, ఆకలి లేకపోవడం వంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కేసులు సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడొద్దని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇంకోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలను కూడా ముమ్మరం చేశాయి. దేశ వ్యాప్తంగా ఆస్పత్రులను అప్రమత్తం చేశాయి. బెడ్ల లభ్యత, ఆక్సిజన్ సిలిండర్లు, అత్యవసర వనరులపై అప్రమత్తం చేశాయి. కోవిడ్ సంబంధిత ఏవైనా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం పూర్తిగా సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య మరియు ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రరావు జాదవ్ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Pregabalin: ప్రెగాబాలిన్ దుర్వినియోగంపై కేంద్రం అలర్ట్.. అమ్మకాలపై ఆరోగ్యశాఖ ఆంక్షలు
-
Arava Sridhar Resignation: ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో పవన్ కల్యాణ్ భేటీ.. పదవికి రాజీనామా..
-
Peddi Censor Report: ‘పెద్ది’కి U/A సర్టిఫికేట్.. కానీ ఈ సీన్లపై సెన్సార్ కత్తెర
-
Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
-
Rukmini Vasanth: AI డీప్ఫేక్ బికినీ వీడియో పై..క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!