Covid-19: 4 వేలపైగా కరోనా కేసులు.. 24 గంటల్లో ఐదుగురు మృతి
- దేశంలో 4 వేలపైగా కరోనా కేసులు
- 24 గంటల్లో ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రెండు వారాల క్రితం అంతంత మాత్రంగా ఉన్న కేసులు ఈ వారంలో అమాంతంగా పెరిగిపోయాయి. అలాగే మరణాలు కూడా క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4, 026 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య శాఖ తెలిపింది. ఇక కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో మంగళవారం ఉదయం 8 గంటలలోపు ఐదుగురు చనిపోయారని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Rohit Sharma: నా దగ్గర బ్యాట్లు లేవు.. ఆరు దొబ్బేశారు! వీడియో వైరల్
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
కేరళలో డయాబెటిస్, హైపర్ టెన్షన్ వ్యాధితో బాధపడుతున్న 80 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఇక మహారాష్ట్రలో ఇద్దరు చనిపోయారు. 70, 73 ఏళ్ల మహిళలు డయాబెటిస్, హైపర్టెన్షన్తో ఉన్న రోగులు చనిపోయారని పేర్కొన్నారు. ఇక తమిళనాడులో 69 మహిళ ఏళ్ల పార్కిన్సన్స్ వ్యాధి చనిపోయింది. పశ్చిమ బెంగాల్లో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న 43 ఏళ్ల మహిళ మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: PM Modi: రేపు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలి భేటీ
కొత్త వైరస్ వేగంగా వ్యాప్తిస్తుందని.. కానీ తేలికపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిర్ధారించింది. సాధారణ లక్షణాలు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట, తలనొప్పి, శరీర నొప్పులు, ముక్కు కారటం, ఆకలి లేకపోవడం వంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కేసులు సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడొద్దని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇంకోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలను కూడా ముమ్మరం చేశాయి. దేశ వ్యాప్తంగా ఆస్పత్రులను అప్రమత్తం చేశాయి. బెడ్ల లభ్యత, ఆక్సిజన్ సిలిండర్లు, అత్యవసర వనరులపై అప్రమత్తం చేశాయి. కోవిడ్ సంబంధిత ఏవైనా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం పూర్తిగా సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య మరియు ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రరావు జాదవ్ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!