Site icon NTV Telugu

COVID 19: దేశంలో కొత్తగా 16,906 కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

Covid 19

Covid 19

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా 15 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, బెంగాల్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా మహమ్మారి పూర్తిగా పోలేదని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. తెలంగాణలో కూడా రోజూ 500 పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,906 కేసులు నమోదు అయ్యాయి. మరణాల సంఖ్య భారీగా పెరిగింది. 24 గంటల్లో మహమ్మారి బారిన పడి 45 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,32,457 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 4 కన్నా దిగువకు వచ్చింది. పాజిటివిటీ రేటు తగ్గడం ఉపశమనం ఇచ్చే అంశం. ప్రస్తుతం డెయిలీ పాజిటివిటీ రేటు 3.68గా ఉంది. గడిచిన రోజులో 15,447 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. కరోనా వల్ల ఇప్పటి వరకు దేశంలో 5,25,519 మరణాలు సంభవంచాయి. కరోనా బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 4,30,11,874గా ఉంది. ఇప్పటి వరకు అర్హులైన వారికి 1,99,12,79,010 డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. మంగళవారం 11,15,068 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా నిన్న ఒక్క రోజు 4,59,302 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు.

Read Also: Earthquake: నెల్లూరులో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనం

ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. అమెరికాలో వారం రోజుల్లోనే 68 వేల మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు. నిన్న ఒక్క రోజే అమెరికాలో 95,342 మంది కొవిడ్​ బారినపడగా.. 254 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 56,28,51,812కు చేరింది. మొత్తం 63,76,619 మంది మరణించారు.

Exit mobile version