COVID 19: దేశంలో భారీగా తగ్గిన కరోనా .. 10 వేల దిగువకు కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CORONA CASES IN INDIA:దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత వారం రోజూవారీ కేసుల సంఖ్య సగటున 15 వేలకు పైగా నమోదు అయ్యేది. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో కేవలం 9,531 కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 36 మంది మరణించారు. 11,726 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 97,648కు చేరింది.
దేశంలో కరోనా కేసులు ప్రారంభం అయిన రెండున్నరేళ్లలో ఇప్పటి వరకు 4,43,48,960 కరోనా కేసులు నమోదు అయితే వీరిలో 4,37,23,944 మంది కోలుకోగా.. మరణించిన వారి సంఖ్య 5,27,368కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.59 ఉండగా.. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.22గా ఉంది. రోజూవారీ పాజిటివిటీ రేటు 4.15 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 36 మంది మరణిస్తే ఒక్క కేరళలోనే కరోనాతో 10 మంది చనిపోయారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ నుండి నలుగురు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, మణిపూర్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ మరియు హర్యానా నుండి ఇద్దరు చొప్పున మరణించారు.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
Read Also: Pakistan: దైవదూషణ చేశాడంటూ హిందువుపై దాడి..
ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఇండియా ప్రపంచానికి అందనంత ఎత్తులో ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 210.02 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో 35,33,466 మందికి వ్యాక్సినేషన్ చేశారు. గడిచిన 24 గంటల్లో 2,29,546 పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు మొత్తం 88.27 కోట్ల పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా కేసులను పరిశీలిస్తే.. కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. నిన్న ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా 5,51,288 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 60,08,28,427 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. 64,71,809 మంది మహమ్మారి వల్ల మరణించారు. 57,50,66,049 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!