Delhi: దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగ, హత్యలు, ముగ్గురు భార్యలు.. ఓ ఆటోడ్రైవర్ 27 ఏళ్ల ప్రయాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగగా పేరుపొందాడు ఓ ఆటో డ్రైవర్. దొంగతనాలే కాకుండా హత్యలు కూడా చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 5 వేలకు పైగా కార్లను దొంగిలించిన నిందితుడు “దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగ” అనిల్ చౌహాన్ను ఢిల్లీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. 52 ఏళ్ల అనిల్ ఢిల్లీ, ముంబై, ఈశాన్య ప్రాంతాలలో ఆస్తులు కలిగి ఉన్నాడని, విలాసవంతమైన జీవనశైలిని కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగ అని, గత 27 ఏళ్లలో ఐదు వేలకు పైగా కార్లను దొంగిలించాడని పోలీసులు పేర్కొంటున్నారు. సెంట్రల్ ఢిల్లీ పోలీస్ స్పెషల్ స్టాఫ్ దేశ్ బంధు గుప్తా రోడ్ ప్రాంతం నుంచి అతడిని పక్కా సమాచారంతో పట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిల్ చౌహాన్ ప్రస్తుతం ఆయుధాల స్మగ్లింగ్లో పాల్గొంటున్నాడు. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయుధాలను తీసుకెళ్లి ఈశాన్య రాష్ట్రాల్లోని నిషేధిత సంస్థలకు సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. మొదట అనిల్ ఢిల్లీలోని ఖాన్పూర్ ప్రాంతంలో ఉంటూ ఆటోరిక్షాలు నడిపేవాడు. 1995 తర్వాత కార్లను దొంగిలించడం ప్రారంభించాడు. ఆ కాలంలో అత్యధికంగా మారుతీ 800 కార్లను దొంగిలించిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. అనిల్ చౌహాన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో కార్లను దొంగిలించి నేపాల్, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు పంపేవాడు. దొంగతనం సమయంలో కొందరు ట్యాక్సీ డ్రైవర్లను కూడా చంపేశాడు. అతను చివరికి అస్సాంకు వెళ్లి అక్కడ నివసించడం ప్రారంభించాడు. అక్రమంగా సంపాదించిన ఆస్తులతో ఢిల్లీ, ముంబై, ఈశాన్య రాష్ట్రాల్లో ఆస్తులు కూడబెట్టాడు. ఆయనపై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. అనిల్ అనేకసార్లు అరెస్టయ్యాడు. ఒకసారి 2015లో కాంగ్రెస్ ఎమ్మెల్యేతో కలిసి ఐదేళ్లపాటు జైలులో ఉండి 2020లో విడుదలయ్యాడు. అతనిపై 180 కేసులు నమోదయ్యాయి.
Also Read
- NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
- Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
- Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. 'అడ్వాన్స్ టిప్' విధానానికి కేంద్రం చెక్
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
Basava Siddalinga Swami: విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న పీఠాధిపతి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనిల్కు ముగ్గురు భార్యలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. అతను అస్సాంలో ప్రభుత్వ కాంట్రాక్టర్గా మారాడు. అక్కడి స్థానిక నాయకులతో టచ్లో ఉన్నాడు. అతని వద్ద నుంచి 6 పిస్టల్స్, ఏడు క్యాట్రిడ్జ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Sukhbir Singh Badal: నాందేడ్లో సుఖ్బీర్ సింగ్ బాదల్పై దాడి
-
Bank of America: అంబానీ కంపెనీపై అమెరికా బ్యాంక్ కన్ను.. రూ.18,268 కోట్ల భారీ డీల్!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
ట్రెండింగ్
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!