Delhi: దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగ, హత్యలు, ముగ్గురు భార్యలు.. ఓ ఆటోడ్రైవర్ 27 ఏళ్ల ప్రయాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగగా పేరుపొందాడు ఓ ఆటో డ్రైవర్. దొంగతనాలే కాకుండా హత్యలు కూడా చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 5 వేలకు పైగా కార్లను దొంగిలించిన నిందితుడు “దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగ” అనిల్ చౌహాన్ను ఢిల్లీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. 52 ఏళ్ల అనిల్ ఢిల్లీ, ముంబై, ఈశాన్య ప్రాంతాలలో ఆస్తులు కలిగి ఉన్నాడని, విలాసవంతమైన జీవనశైలిని కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగ అని, గత 27 ఏళ్లలో ఐదు వేలకు పైగా కార్లను దొంగిలించాడని పోలీసులు పేర్కొంటున్నారు. సెంట్రల్ ఢిల్లీ పోలీస్ స్పెషల్ స్టాఫ్ దేశ్ బంధు గుప్తా రోడ్ ప్రాంతం నుంచి అతడిని పక్కా సమాచారంతో పట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిల్ చౌహాన్ ప్రస్తుతం ఆయుధాల స్మగ్లింగ్లో పాల్గొంటున్నాడు. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయుధాలను తీసుకెళ్లి ఈశాన్య రాష్ట్రాల్లోని నిషేధిత సంస్థలకు సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. మొదట అనిల్ ఢిల్లీలోని ఖాన్పూర్ ప్రాంతంలో ఉంటూ ఆటోరిక్షాలు నడిపేవాడు. 1995 తర్వాత కార్లను దొంగిలించడం ప్రారంభించాడు. ఆ కాలంలో అత్యధికంగా మారుతీ 800 కార్లను దొంగిలించిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. అనిల్ చౌహాన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో కార్లను దొంగిలించి నేపాల్, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు పంపేవాడు. దొంగతనం సమయంలో కొందరు ట్యాక్సీ డ్రైవర్లను కూడా చంపేశాడు. అతను చివరికి అస్సాంకు వెళ్లి అక్కడ నివసించడం ప్రారంభించాడు. అక్రమంగా సంపాదించిన ఆస్తులతో ఢిల్లీ, ముంబై, ఈశాన్య రాష్ట్రాల్లో ఆస్తులు కూడబెట్టాడు. ఆయనపై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. అనిల్ అనేకసార్లు అరెస్టయ్యాడు. ఒకసారి 2015లో కాంగ్రెస్ ఎమ్మెల్యేతో కలిసి ఐదేళ్లపాటు జైలులో ఉండి 2020లో విడుదలయ్యాడు. అతనిపై 180 కేసులు నమోదయ్యాయి.
Also Read
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
- West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Basava Siddalinga Swami: విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న పీఠాధిపతి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనిల్కు ముగ్గురు భార్యలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. అతను అస్సాంలో ప్రభుత్వ కాంట్రాక్టర్గా మారాడు. అక్కడి స్థానిక నాయకులతో టచ్లో ఉన్నాడు. అతని వద్ద నుంచి 6 పిస్టల్స్, ఏడు క్యాట్రిడ్జ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Mega 158: ‘మెగా’ డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
-
Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!