Corona Vaccination: ఇండియా రికార్డ్ .. వ్యాక్సిన్ కార్యక్రమంలో 200 కోట్ల డోసులు పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India crosses 2 Billion corona vaccine doses: కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఇండియా కీలక మైలురాయిని చేరుకుంది. పాశ్చాత్య దేశాల వెక్కిరింపుల మధ్య సొంతంగా వ్యాక్సిన్లను తయారు చేసుకుని దేశ ప్రజలను కరోనా బారి నుంచి కాపాడుకునే విధంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. ఇండియా వంటి దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పూర్తిగా ప్రజలకు అందాలంటే దశాబ్ధాలు పడుతుందనే పాశ్చాత్య దేశాలు వ్యాఖ్యల నడుమ..ఇది నయా ఇండియా అని సగర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగింది. సెకండ్ వేవ్ లో కరోనా కల్లోలం నుంచి థర్ద్ వేవ్ వచ్చే సరికి మరణాలను దాదాపుగా తగ్గడానికి కారణం వ్యాక్సినేషన్ కార్యక్రమమే.
తాజాగా ఇండియా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 200 కోట్ల వ్యాక్సిన్ డోసుల మైలురాయిని దాటింది. జూలై 17న ఈ కీలకమైలు రాయిని చేరుకుంది. కోవిడ్ 19 వ్యాక్సిన్ 2 బిలయన్ డోసులను అధిగమించడం మాకు గర్వకారణం అని..ఈ ఘనత సాధించినందుకు ఆరోగ్య కార్యకర్తలు, భారత పౌరులను అభిందిస్తున్నానని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లతో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 21, 2021లో 100 కోట్ల డోసుల మైలురాయిని చేరుకోగా.. తాజాగా తొమ్మది నెలల తరువాత జూలై 17న 200 కోట్ల మైలురాయిని చేరుకుంది.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
Read Also: Corona Cases: ఇండియాలో కరోనా విజృంభన.. కొత్తగా 20 వేలకు పైగా కేసులు
జనవరి 16, 2021న ఇండియాలో తొలివిడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయింది. ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన వైద్య సిబ్బంది, ఆశావర్కర్లకు, పారిశుద్ధ్య సిబ్బందికి తొలివిడతలో వ్యాక్సినేషన్ ప్రారంభించారు. 2021 మార్చి 1 నుంచి వ్యాధిగ్రస్తులు, వృద్దులకు టీకాలు ఇవ్వడం ప్రారంభించారు. ఆ తరువాత 2021 ఎప్రిల్ 1 నుంచి దేశంలోని 45 ఏళ్లకు పైబడిన వారికి.. 2021 మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం ఆరంభం అయింది. 2022 మార్చి 16 నుంచి 12-14 ఏళ్లలోపు ఉన్న వారికి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. తాజాగా 2022 జూలై15 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లకు పైబడిన వారికి బూస్టర్ డోస్ ను ఉచితంగా ఇస్తోంది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..