Corona Vaccination: ఇండియా రికార్డ్ .. వ్యాక్సిన్ కార్యక్రమంలో 200 కోట్ల డోసులు పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India crosses 2 Billion corona vaccine doses: కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఇండియా కీలక మైలురాయిని చేరుకుంది. పాశ్చాత్య దేశాల వెక్కిరింపుల మధ్య సొంతంగా వ్యాక్సిన్లను తయారు చేసుకుని దేశ ప్రజలను కరోనా బారి నుంచి కాపాడుకునే విధంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. ఇండియా వంటి దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పూర్తిగా ప్రజలకు అందాలంటే దశాబ్ధాలు పడుతుందనే పాశ్చాత్య దేశాలు వ్యాఖ్యల నడుమ..ఇది నయా ఇండియా అని సగర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగింది. సెకండ్ వేవ్ లో కరోనా కల్లోలం నుంచి థర్ద్ వేవ్ వచ్చే సరికి మరణాలను దాదాపుగా తగ్గడానికి కారణం వ్యాక్సినేషన్ కార్యక్రమమే.
తాజాగా ఇండియా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 200 కోట్ల వ్యాక్సిన్ డోసుల మైలురాయిని దాటింది. జూలై 17న ఈ కీలకమైలు రాయిని చేరుకుంది. కోవిడ్ 19 వ్యాక్సిన్ 2 బిలయన్ డోసులను అధిగమించడం మాకు గర్వకారణం అని..ఈ ఘనత సాధించినందుకు ఆరోగ్య కార్యకర్తలు, భారత పౌరులను అభిందిస్తున్నానని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లతో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 21, 2021లో 100 కోట్ల డోసుల మైలురాయిని చేరుకోగా.. తాజాగా తొమ్మది నెలల తరువాత జూలై 17న 200 కోట్ల మైలురాయిని చేరుకుంది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
Read Also: Corona Cases: ఇండియాలో కరోనా విజృంభన.. కొత్తగా 20 వేలకు పైగా కేసులు
జనవరి 16, 2021న ఇండియాలో తొలివిడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయింది. ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన వైద్య సిబ్బంది, ఆశావర్కర్లకు, పారిశుద్ధ్య సిబ్బందికి తొలివిడతలో వ్యాక్సినేషన్ ప్రారంభించారు. 2021 మార్చి 1 నుంచి వ్యాధిగ్రస్తులు, వృద్దులకు టీకాలు ఇవ్వడం ప్రారంభించారు. ఆ తరువాత 2021 ఎప్రిల్ 1 నుంచి దేశంలోని 45 ఏళ్లకు పైబడిన వారికి.. 2021 మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం ఆరంభం అయింది. 2022 మార్చి 16 నుంచి 12-14 ఏళ్లలోపు ఉన్న వారికి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. తాజాగా 2022 జూలై15 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లకు పైబడిన వారికి బూస్టర్ డోస్ ను ఉచితంగా ఇస్తోంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!