Site icon NTV Telugu

Covid 19: దేశంలో మరింత తగ్గిన కరోనా.. 50 వేల దిగువకు యాక్టివ్ కేసులు.

Corona Cases In India

Corona Cases In India

corona cases in india: దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కేవలం 5,554 కొత్త కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే 6,322 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. 18 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.7 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో పాటు మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.11 గా ఉందని తెలిపింది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేల దిగువకు చేరుకుంది. ప్రస్తుతం 48,850 యాక్టివ్ కేసులు ఇండియాలో ఉన్నాయి.

Read Also: Bharat Jodo Yatra: రాహుల్ పాదయాత్రకు విరామం.. ఈ రోజు కేరళకు చేరనున్న పాదయాత్ర

కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 5,28,139 మంది మరణించగా.. 4,39,13,294 మంది కొవిడ్ బారి నుంచి బయటపడ్డారు. మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 4,44,90,283కు చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 1.47 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 1.80 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అర్హులైన వారికి 214.77 కోవిడ్ వ్యాక్సినేషన్ డోసులను అందించారు. నిన్న ఒక్క రోజే 21,63,811 మందికి కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చారు. మొత్తంగా గడిచిన 24 గంటల్లో 3,76,855 కరోనా నిర్థారణ టెస్టులు చేశారు.

ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 4,89,469 కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా 1,667 మరణాలు చోటు చేసుకున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 61,29,83,335కు చేరుకుంది. మరణాల సంఖ్య 65,14,456గా ఉంది. ప్రస్తుతం జపాన్, దక్షిణ కొరియా దేశాల్లోలనే ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ దేశాల్లో లక్షల సంఖ్యలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

Exit mobile version