Bharat Jodo Yatra: రాహుల్ పాదయాత్రకు విరామం.. ఈ రోజు కేరళకు చేరనున్న పాదయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తమిళనాడులో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం ఆయన యాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. నాలుగో రోజు యాత్రలో రాహుల్ గాంధీ స్వల్ప విరామం తీసుకున్నారు. ఉదయం 7 గంటలకు మూలగం నుంచి ప్రారంభం అయిన రాహుల్ గాంధీ యాత్ర 13 కిలోమీటర్ల పాటు సాగింది. దీని తరువాత స్వల్ప విరామం తీసుకుని సాయంత్రం 4 గంటలకు మళ్లీ పాదయాత్రను ప్రారంభించనున్నారు. కన్యాకుమారి జిల్లా మర్తాండంలోని నేసమని క్రిస్టియన్ మోమోరియల్ కాలేజ్ వద్ద రాహుల్ బస చేయనున్నారు. ఇప్పటి వరకు 43 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ.
తమిళనాడులో నేటితో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగియనుంది. ఈ రోజు రాత్రి కేరళలోకి రాహుల్ పాదయాత్ర చేరనుంది. రాత్రి కేరళ త్రివేడ్రం జిల్లా చెరువర కోణంలోకి పాదయాత్ర చేరనుంది. కేరళలోకి చేరే సమయంలో ఘనంగా స్వాగతించాలని కేరళ కాంగ్రెస్ భావిస్తోంది. కేరళ రాష్ట్రంలో 19 రోజులు 457 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. కేరళలో 43కి పైగా అసెంబ్లీ, 12
లోక్ సభ నియోజకవర్గాల గుండా పాదయాత్ర సాగనుంది. కేరళలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. కేరళలోని వయనాడ్ నుంచే రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నారు.
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
Read Also: Heavy Rains Today and Tomorrow: తెలంగాణను వీడని వరుణుడు.. నేడు, రేపు భారీ వర్షాలు
సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొత్తం 150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల పాటు సాగనుంది. కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన తర్వాత భారత్ జోడో యాత్ కాశ్మీర్లో ముగియనుంది. బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా భారత్ ను కలిపే విధంగా భారత్ జోెడో యాత్ర సాగుతుందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. అయితే 2024 సాధారణ ఎన్నికల లోపు కాంగ్రెస్ పార్టీని సన్నద్ధం చేసేలా ఈ పాదయాత్ర కొనసాగనుంది. అయితే ఈ యాత్రపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. శుక్రవారం పాదయాత్రలో రాహుల్ గాంధీ ధరించిన టీ షర్టు గురించి బీజేపీ విమర్శలు చేసింది. రాహుల్ ధరించిన టీషర్టు విలువ రూ.40,000 ఉంటుందని బీజేపీ ట్వీట్ చేసింది.
తాజావార్తలు
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
-
Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్కు ఊహించని షాక్!
-
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!