Bharat Jodo Yatra: “భారత్ జోడో యాత్ర”లో పాల్గొనాలని ఉద్ధవ్, శరద్ పవార్లకు కాంగ్రెస్ ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారమే లక్ష్యంగా భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రస్తుతం తమిళనాడు, కేరళ, కర్ణాటకలో పూర్తైంది. తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది. దీని తర్వాత నవంబర్ 7న మహారాష్ట్రలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. ఇదిలా ఉంటే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లను ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ.
మహరాష్ట్ర పీసీసీ ఇంచార్జ్ హెచ్ కే పాటిల్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ , కాంగ్రెస్ నేతలు బాలా సాహెబ్ థోరట్, ముంబై కాంగ్రెస్ చీఫ్ భాయ్ జగ్తాప్ వంటి నాయకులు ఈ ఇద్దరు నాయకులను భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సిందిగా కోరారు. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర నవంబర్ 7న మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఉద్ధవ్ ఠాక్రేను ఆయన నివాసం మాతో శ్రీలో మంగళవారం కలిసింది. శరద్ పవార్ ని యశ్వంత్ రావు చవాన్ ప్రతిష్టాన్ లో కలిసింది కాంగ్రెస్ బృందం. భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని ఇరు నేతలను ఆహ్వానించింది.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
Read Also: Asia Cup 2023: ఆసియా కప్కు భారత్ దూరం.. తేల్చి చెప్పిన జై షా
గతంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు భాగంగా ఉన్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్ల పాటు ఈ ప్రభుత్వ కొనసాగింది. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ఏక్ నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏక్ నాథ్ షిండే వైపే ఉండటంతో ఏక్ నాథ్ షిండే వర్గం బీజేపీ సహాయంతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను తీసుకున్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ గత వైభవం కోసం భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర 150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా కొనసాగి జమ్మూకాశ్మీర్లో ముగియనుంది. బీజేపీకి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తూ రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతోంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!