Bharat Jodo Yatra: “భారత్ జోడో యాత్ర”లో పాల్గొనాలని ఉద్ధవ్, శరద్ పవార్లకు కాంగ్రెస్ ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారమే లక్ష్యంగా భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రస్తుతం తమిళనాడు, కేరళ, కర్ణాటకలో పూర్తైంది. తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది. దీని తర్వాత నవంబర్ 7న మహారాష్ట్రలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. ఇదిలా ఉంటే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లను ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ.
మహరాష్ట్ర పీసీసీ ఇంచార్జ్ హెచ్ కే పాటిల్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ , కాంగ్రెస్ నేతలు బాలా సాహెబ్ థోరట్, ముంబై కాంగ్రెస్ చీఫ్ భాయ్ జగ్తాప్ వంటి నాయకులు ఈ ఇద్దరు నాయకులను భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సిందిగా కోరారు. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర నవంబర్ 7న మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఉద్ధవ్ ఠాక్రేను ఆయన నివాసం మాతో శ్రీలో మంగళవారం కలిసింది. శరద్ పవార్ ని యశ్వంత్ రావు చవాన్ ప్రతిష్టాన్ లో కలిసింది కాంగ్రెస్ బృందం. భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని ఇరు నేతలను ఆహ్వానించింది.
Also Read
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
- Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
Read Also: Asia Cup 2023: ఆసియా కప్కు భారత్ దూరం.. తేల్చి చెప్పిన జై షా
గతంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు భాగంగా ఉన్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్ల పాటు ఈ ప్రభుత్వ కొనసాగింది. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ఏక్ నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏక్ నాథ్ షిండే వైపే ఉండటంతో ఏక్ నాథ్ షిండే వర్గం బీజేపీ సహాయంతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను తీసుకున్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ గత వైభవం కోసం భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర 150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా కొనసాగి జమ్మూకాశ్మీర్లో ముగియనుంది. బీజేపీకి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తూ రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతోంది.
తాజావార్తలు
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
-
SEYON : శివకార్తికేయన్ & కమల్ హాసన్ ‘సెయాన్’ షూటింగ్ స్టార్ట్
-
Salman Khan: స్కూల్ పిల్లల కోసం..సల్మాన్ రూ.15 కోట్ల విరాళం..
-
Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..