Bharat Jodo Yatra: “భారత్ జోడో యాత్ర”లో పాల్గొనాలని ఉద్ధవ్, శరద్ పవార్లకు కాంగ్రెస్ ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారమే లక్ష్యంగా భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రస్తుతం తమిళనాడు, కేరళ, కర్ణాటకలో పూర్తైంది. తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది. దీని తర్వాత నవంబర్ 7న మహారాష్ట్రలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. ఇదిలా ఉంటే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లను ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ.
మహరాష్ట్ర పీసీసీ ఇంచార్జ్ హెచ్ కే పాటిల్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ , కాంగ్రెస్ నేతలు బాలా సాహెబ్ థోరట్, ముంబై కాంగ్రెస్ చీఫ్ భాయ్ జగ్తాప్ వంటి నాయకులు ఈ ఇద్దరు నాయకులను భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సిందిగా కోరారు. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర నవంబర్ 7న మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఉద్ధవ్ ఠాక్రేను ఆయన నివాసం మాతో శ్రీలో మంగళవారం కలిసింది. శరద్ పవార్ ని యశ్వంత్ రావు చవాన్ ప్రతిష్టాన్ లో కలిసింది కాంగ్రెస్ బృందం. భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని ఇరు నేతలను ఆహ్వానించింది.
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
Read Also: Asia Cup 2023: ఆసియా కప్కు భారత్ దూరం.. తేల్చి చెప్పిన జై షా
గతంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు భాగంగా ఉన్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్ల పాటు ఈ ప్రభుత్వ కొనసాగింది. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ఏక్ నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏక్ నాథ్ షిండే వైపే ఉండటంతో ఏక్ నాథ్ షిండే వర్గం బీజేపీ సహాయంతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను తీసుకున్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ గత వైభవం కోసం భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర 150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా కొనసాగి జమ్మూకాశ్మీర్లో ముగియనుంది. బీజేపీకి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తూ రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతోంది.
తాజావార్తలు
-
Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
-
Toxic Advance Booking: రిలీజ్కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
-
Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
-
Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!