Congress: కాంగ్రెస్ పుంజుకున్నా.. అధికారం కావాలంటే ఇది చాలదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షనేతగా మోడీ ఏకగ్రీవ ఎన్నిక.. బలపరిచిన టీడీపీ మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సత్తా చాటింది. అయితే, గతంలో పోలిస్తే మాత్రం సీట్లలో భారీగా కోత పడింది. 2014, 2019ల్లో మెజారిటీ మార్క్ 272ని దాటి బీజేపీ సీట్లను కైవసం చేసుకుంది. అయితే, ఈ సారి మాత్రం 240 స్థానాలకు మాత్రమే పరిమితమై సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఎన్డీయే కూటమి మొత్తంగా 292 సీట్లను గెలుచుకుంది. ప్రధాని నేతృత్వంలో ఎన్డీయే కూటమి మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.
మరోవైపు గతంలో పోలిస్తే ప్రతిపక్ష కూటమి బాగా పుంజుకుంది. మొత్తంగా 234 సీట్లను కైవసం చేసుకుని, మెజారిటీ మార్కుకు దగ్గరగా ఆగిపోయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బీజేపీకి బ్రేకులు వేసింది. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో సత్తా చాటింది. అయితే, బీజేపీని మాత్రం అధికారంలోకి రాకుండా అడ్డుకోలేకపోయింది. 10 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా ఎన్డీయే అధికారాన్ని ఏర్పాటు చేస్తోంది.
Also Read
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
Read Also: Mobile Heating: మీ మొబైల్ హీట్ అవుతుందా.. ఇలా చేసి చూడండి..
ఈసారి కాంగ్రెస్ గతంతో పోలిస్తే చాలా మెరుగైంది. గత రెండు సందర్భాల్లో కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లను కూడా సంపాదించుకోలేని ఆ పార్టీ ఈ సారి 100కి చేరువలో అంటే 99 సీట్లను కైవసం చేసుకుంది. 2019లో 52 సీట్ల నుంచి ఈ సారి 99 సీట్లను సాధించింది. అయితే, కాంగ్రెస్ పుంజుకున్న మాట వాస్తమే అయినప్పటికీ, అధికారంలోకి రావడానికి మాత్రం ఈ నెంబర్ సరిపోదు. కాంగ్రెస్ 120 నుంచి 130 సీట్లు వస్తేనే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. మూడు కీలకమైన రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ పార్టీ తన పనితీరు మెరుగుపరుచుకోకుంటే అధికారం అనేది సాధ్యం కాదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నప్పటికీ ఎంపీ సీట్లను మాత్రం స్వీప్ చేయలేకపోతోంది. ప్రభుత్వం ఉన్నా కూడా దాని ప్రయోజనాలను ఉపయోగించుకోవడంలో విఫలమైంది. ఈ రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. ఇక మరోవైపు బీజేపీకి సీట్లు తగ్గినప్పటికీ, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, హిమచల్, ఉత్తరాఖండ్, హర్యానా వంటి హిందీ హార్ట్ ల్యాండ్ మొదటి నుంచి అండగా ఉంటున్నాయి. ఈ ఎన్నికల్లో పలు సంఘటనలు, స్వీయ తప్పిదాలు బీజేపీ సీట్ల తగ్గింపుకు కారణమైంది. అయినా కూడా ఈ రాష్ట్రాల్లో బీజేపీకి సంస్థాగతంగా, గ్రాస్ రూల్ లెవల్లో బలం ఉంది.
తాజావార్తలు
-
Narendra Modi: ‘జవహర్ లాల్ నెహ్రూ’ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
-
Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
-
TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
-
Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు ‘భారతీరాజా’
-
Sleep Disorder : రాత్రి 8 గంటలు నిద్రపోయినా అలసట ఎందుకు పోదు? చాలా మంది తెలుసుకోవాల్సిన నిజాలు!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి