Congress: కాంగ్రెస్ పుంజుకున్నా.. అధికారం కావాలంటే ఇది చాలదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షనేతగా మోడీ ఏకగ్రీవ ఎన్నిక.. బలపరిచిన టీడీపీ మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సత్తా చాటింది. అయితే, గతంలో పోలిస్తే మాత్రం సీట్లలో భారీగా కోత పడింది. 2014, 2019ల్లో మెజారిటీ మార్క్ 272ని దాటి బీజేపీ సీట్లను కైవసం చేసుకుంది. అయితే, ఈ సారి మాత్రం 240 స్థానాలకు మాత్రమే పరిమితమై సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఎన్డీయే కూటమి మొత్తంగా 292 సీట్లను గెలుచుకుంది. ప్రధాని నేతృత్వంలో ఎన్డీయే కూటమి మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.
మరోవైపు గతంలో పోలిస్తే ప్రతిపక్ష కూటమి బాగా పుంజుకుంది. మొత్తంగా 234 సీట్లను కైవసం చేసుకుని, మెజారిటీ మార్కుకు దగ్గరగా ఆగిపోయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బీజేపీకి బ్రేకులు వేసింది. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో సత్తా చాటింది. అయితే, బీజేపీని మాత్రం అధికారంలోకి రాకుండా అడ్డుకోలేకపోయింది. 10 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా ఎన్డీయే అధికారాన్ని ఏర్పాటు చేస్తోంది.
Also Read
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
- West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
- Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..
- West Bengal: మమత మేనల్లుడి కోటకు బీటలు.. ఫల్తాలో భారీ విజయం దిశగా బీజేపీ..
Read Also: Mobile Heating: మీ మొబైల్ హీట్ అవుతుందా.. ఇలా చేసి చూడండి..
ఈసారి కాంగ్రెస్ గతంతో పోలిస్తే చాలా మెరుగైంది. గత రెండు సందర్భాల్లో కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లను కూడా సంపాదించుకోలేని ఆ పార్టీ ఈ సారి 100కి చేరువలో అంటే 99 సీట్లను కైవసం చేసుకుంది. 2019లో 52 సీట్ల నుంచి ఈ సారి 99 సీట్లను సాధించింది. అయితే, కాంగ్రెస్ పుంజుకున్న మాట వాస్తమే అయినప్పటికీ, అధికారంలోకి రావడానికి మాత్రం ఈ నెంబర్ సరిపోదు. కాంగ్రెస్ 120 నుంచి 130 సీట్లు వస్తేనే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. మూడు కీలకమైన రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ పార్టీ తన పనితీరు మెరుగుపరుచుకోకుంటే అధికారం అనేది సాధ్యం కాదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నప్పటికీ ఎంపీ సీట్లను మాత్రం స్వీప్ చేయలేకపోతోంది. ప్రభుత్వం ఉన్నా కూడా దాని ప్రయోజనాలను ఉపయోగించుకోవడంలో విఫలమైంది. ఈ రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. ఇక మరోవైపు బీజేపీకి సీట్లు తగ్గినప్పటికీ, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, హిమచల్, ఉత్తరాఖండ్, హర్యానా వంటి హిందీ హార్ట్ ల్యాండ్ మొదటి నుంచి అండగా ఉంటున్నాయి. ఈ ఎన్నికల్లో పలు సంఘటనలు, స్వీయ తప్పిదాలు బీజేపీ సీట్ల తగ్గింపుకు కారణమైంది. అయినా కూడా ఈ రాష్ట్రాల్లో బీజేపీకి సంస్థాగతంగా, గ్రాస్ రూల్ లెవల్లో బలం ఉంది.
తాజావార్తలు
-
Satya Kumar Yadav: ‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
-
Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
-
Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
-
West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
-
RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?