NTV Telugu Site icon

Bharat Jodo Yatra: భారత్‌ జోడో యాత్రకు నేడు విరామం..

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra: కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. సెప్టెంబర్‌ 7న కన్యాకుమారి నుంచి రాహుల్‌గాంధీ పాదయాత్ర చేపట్టారు. వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ యాత్రలో రాహుల్‌గాంధీ స్వల్ప విరామం తీసుకున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన ఒకరోజు విరామం తర్వాత శుక్రవారం కేరళలోని కొల్లాం నుండి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.బుధవారం నాడు ట్విట్టర్‌లో కాంగ్రెస్‌ నేత జైరాం పాదయాత్ర శుక్రవారం నుంచి పున:ప్రారంభమవుతుందని తెలిపారు.కేరళలోని తిరువనంతపురంలోని నవైక్కుళం నుంచి ప్రారంభమైన యాత్ర బుధవారంతో ఏడో రోజు పూర్తి చేసుకుంది.
ఏడో రోజు రాహుల్ గాంధీ కొల్లాం జిల్లా చత్తన్నూరులో విద్యార్థులతో ముచ్చటించారు.

Supreme Court: హిజాబ్‌పై నిషేధంతో కర్ణాటకలో ఎంత మంది చదువు మానేశారు?

నవైక్కుళం నుంచి పాదయాత్ర ప్రారంభించే ముందు రాహుల్ గాంధీ కేరళలోని శివగిరి మఠంలో సంఘ సంస్కర్త శ్రీనారాయణ గురువుకు నివాళులర్పించారు. యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. తదుపరి 17 రోజుల పాటు రాష్ట్రం గుండా ప్రయాణిస్తుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల పాదయాత్ర 150 రోజుల్లో పూర్తవుతుంది. 12 రాష్ట్రాలను కవర్ చేస్తుంది. కేరళ నుంచి యాత్ర తదుపరి 18 రోజుల పాటు రాష్ట్రం గుండా ప్రయాణించి, సెప్టెంబర్ 30న కర్ణాటకకు చేరుకుంటుంది. ఇది ఉత్తరాన కదలడానికి ముందు 21 రోజుల పాటు కర్ణాటకలో ఉంటుంది. ఈ పాదయాత్రలో ప్రతిరోజు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు. మతం, వర్గాలకు అతీతంగా భారతీయులను ఏకతాటిపైకి తీసుకురావడమే భారత్ జోడో యాత్ర స్ఫూర్తి అని, ఇది ఒకటే దేశమని, మనం కలిసికట్టుగా ఉండి పరస్పరం గౌరవంగా ఉంటేనే విజయవంతమవుతుందని రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు.