Supreme Court: ‘‘SIR ఎన్నికల సంఘం ప్రత్యేక హక్కు’’.. సుప్రీంలో విపక్షాలకు ఎదురుదెబ్బ..
- సర్ ప్రక్రియలో జోక్యం చేసుకోలేం..
- బీహార్ ఎన్నికల ముందు సుప్రీం కీలక తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా సుప్రీంకోర్టులో విపక్షాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ కార్యక్రమం ద్వారా ఫేక్ ఓటర్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ చర్యను కాంగ్రెస్, ఆర్జేడీ సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సుప్రీంని ఆశ్రయించాయి. మంగళవారం దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం..‘‘ ఎన్నికలు జరగనున్న బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించడం ఎన్నికల కమిషన్ యొక్క ప్రత్యేక హక్కు. ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే అది వారి విధుల్లో జోక్యం చేసుకోవడమే’’ అని న్యాయమూర్తులు సూర్యకాంత్, జోయ్మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఐదు రాష్ట్రాల్లో సర్ ఎప్పుడు నిర్వహిస్తున్నారో తమకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరిన తర్వాత, ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ తర్వాత 3.66 లక్షల ఓటర్ల తొలగింపులు, 21 లక్షల మంది ఓటర్ల చేరికలకు సంబంధించిన డేటాను సేకరించి నోట్ సిద్ధం చేయాలని కోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది.
Also Read
- Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
- Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
- Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
- Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
Read Also: Ponnur Murder: సోదరి ప్రేమ వివాహం.. యువకుడిని దారుణంగా హత్య చేసిన సోదరుడు!
అయితే, SIR ప్రక్రియను సవాలును చేస్తూ దాఖలైన పిటిషన్పై వాదిస్తున్న కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన లక్షల మందికి తెలియజేయలేదని అన్నారు. ఎన్నికల సంఘం తరుపున హాజరైన న్యాయవాది రాకేష్ ద్వివేది మాట్లాడుతూ.. పేర్లు తొలగించబడిన వ్యక్తులకు దాని గురించి సమాచారం అందించినట్లు చెప్పారు. ముసాయిదా, తుది జాబితాలను రాజకీయ పార్టీలకు అందించటన్లు సుప్రీంకోర్టుకు తెలిపారు.
అత్యున్నత న్యాయస్థానం సర్ ప్రక్రియపై ఇచ్చిన తీర్పు, ఎన్నికల సంఘానికి విజయంగా భావించవచ్చు. ఈ ప్రక్రియను కాంగ్రెస్, ఆర్జేడీ తప్పుపట్టాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ, బీజేపీ, ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నాయని పెద్ద ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు విపక్షాలకు భారీ ఎదురుదెబ్బగా అభివర్ణించవచ్చు. సోమవారం బీహార్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు షెడ్యూల్ రిలీజ్ అయింది. నవంబర్ 6, 11 ఎన్నికలు జరిగితే, నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
-
AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
-
Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
-
Varalakshmi Vratam Naivedyam Recipes : వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. 5 నైవేద్యాలు ఇలా చేస్తే టైమ్ సేవ్.!
-
Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!