Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Cm Kcr Bihar Visit Distribution Of Checks To Galwan Martyrs

CM KCR: గల్వాన్ అమరవీరులకు చెక్కుల పంపిణీ.. వారి త్యాగం గొప్పదన్న సీఎం కేసీఆర్

Published Date :August 31, 2022 , 3:43 pm
By Venu Goapl Reddy
CM KCR: గల్వాన్ అమరవీరులకు చెక్కుల పంపిణీ.. వారి త్యాగం గొప్పదన్న సీఎం కేసీఆర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM KCR Bihar visit: ఇండియా, చైనా సైనికుల మధ్య జరిగిన గల్వాన్ ఘర్షణల్లో వీర మరణం పొందిన భారత సైనికులకు చెక్కులు పంపిణీ చేశారు సీఎం కేసీఆర్. బీహర్ రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన భారత సైనికులు సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్, చందన్ కుమార్, జయ్ కిషోర్ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల రూపాయలను చెక్కుల రూపంలో అందించారు. ఇదే విధంగా హైదరాబాద్ అగ్నిప్రమాదంలో మరణించిన 12 మంది కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు. గాల్వాన్‌ లో వీరసైనికుల త్యాగం ఎంతో గొప్పదని.. అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం మన బాధ్యతని.. వలస కూలీలను తెలంగాణ ప్రగతి ప్రతినిధులుగా భావిస్తామని.. చనిపోయిన వలస కూలీల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలనుకున్నాం అని సీఎం కేసీఆర్ అన్నారు.

Read Also: Mallu Ravi: కొండారెడ్డి పల్లి జవాన్‌ కుటుంబానికి న్యాయం ఎప్పుడు?

అంతకు ముందు బుధవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం కేసీఆర్ బీహార్ రాజధాని పాట్నాకు చేరుకున్నారు. పాట్నాలో సీఎం కేసీఆర్‌‌ను ఘనంగా స్వాగతించారు సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్. కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం వలస కూలీలకు ఎంతో సాయం చేసింది.. ఏ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలాగా స్పందించలేదు.. మిషన్ భగీరథను ఎలా చేశారో చూసి రావాలని మా అధికారులను తెలంగాణకు పంపాని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు.

అమరులైన సైనికుల కుటుంబాలకు సహాయం చేయాలని ఎంతో కాలంగా హృదయం భారంగా ఉండేదని.. అందుకే పాట్నాకు వచ్చి ఈ పవిత్ర భూమి కి చెందిన అమరులైన సైనికులకు మా వంతు సహాయం చేస్తున్నాంమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కోల్పోయిన ప్రాణాలను మేము తిరిగి తీసుకురాలేమని.. అమరులైన సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉండాలనే సందేశం అందరికీ చేరాలి. దీంతో సైనికులకు, దేశ రక్షణ దళాలకు ఆత్మస్థైర్యం పెరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అభివృద్ధి బాటలో సాగుతున్న యువ రాష్ట్రం అని ఈ రాష్ట్రాభివృద్ధిలో బీహార్ కు చెందిన వేలమంది శ్రామికులు భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. వీరు ఎన్నో రంగాల్లో పని చేస్తున్నారని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

గొప్ప ప్రభుత్వంగా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ప్రత్యేక రైళ్లను నడపాలని కోరినా పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చిన బీహార్ రాష్ట్రం వారైనా, వేరే రాష్ట్రం వారైనా…. వారిని తెలంగాణ ప్రతినిధులుగా భావిస్తున్నామని నేను ఆ సమయంలో చెప్పానని.. అందుకే వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నామని అన్నారు. కరోనా సమయంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ఎంతోమంది కార్మికులు, శ్రామికులను వారివారి రాష్ట్రాలకు తరలించామని..పని కోసం తెలంగాణకు వలస వచ్చిన వారందరికి మా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం ఉందని మేమ భావిస్తున్నామని కేసీఆర్ అన్నారు. మేము గోదావరి నది ఒడ్డు నుండి గంగా నది ఒడ్డుకు వచ్చామని.. గంగా నదిని పవిత్రనదిని భావించనట్లుగానే తెలంగాణలో గోదావరి నదిని దక్షిణ గంగగా భావిస్తామని అన్నారు. జయ ప్రకాశ్ నారాయణ్ జన్మించిన పవిత్ర భూమి బీహార్ అని.. బీహార్ ప్రజల చైతన్యంతో ప్రారంభమైన ప్రతీ మార్పు ఈ దేశంలో శాంతికి దారి తీసిందని పొగిడారు. బీహార్ లోని నలంద విశ్వవిద్యాలయం ఎంతో చారిత్రకమైందని.. ఇక్కడికి వచ్చి ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bihar cm nitish kumar
  • bihar deputy cm tejaswi yadav
  • CM KCR Bihar visit
  • Distribution of checks to galwan Martyrs
  • RJD-JDU Alliance

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions