CJP: పంజాబ్, కర్ణాటక పేపర్ లీకుల మాటేమిటి.. కాక్రోచ్ల మౌనం ఎందుకు..?
- పంజాబ్ పేపర్ లీక్ వివాదంపై సీజేపీ మౌనం..
- యువత నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు కాక్రోచ్ పార్టీ దూరం..
- వైరల్ అవుతున్న కాక్రోచ్ లీడర్ల వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్తగా ప్రహ్లాద్ జోషి ఈ శాఖ బాధ్యతలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు యువత నుంచి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కు కొత్త డిమాండ్ ఎదురవుతోంది. పంజాబ్, కర్ణాటక పేపర్ లీకులపై స్పందించాలని కోరుతున్నారు. ఈ రాష్ట్రాల్లో కూడా విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేసేలా ఉద్యమం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ డిమాండ్లపై సీజేపీ నుంచి మౌనమే ఎదురవుతోంది.
పంజాబ్లో ఇటీవల ప్రభుత్వ నియామక పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీక్ ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఫార్మసీ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఎగ్జామ్లో అక్రమాలు జరిగాయి. కాంగ్రెస్తో పాటు బీజేపీ ఆరోపిస్తోంది. పంజాబ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హర్జోత్ సింగ్ బైన్స్ రాజీనామా చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. పంజాబ్ పీసీసీ చీఫ్ అమరిందర్ సింగ్ రాజా వారింగ్ మాట్లాడుతూ.. కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, విద్యాశాఖ మంత్రి బైన్స్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, సీజేపీ పంజాబ్ అంశంపై ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తుందని బీజేపీ ప్రశ్నిస్తోంది. కేవలం సెలెక్టివ్గా ఉద్యమం చేస్తున్నారని విమర్శిస్తోంది.
Also Read
- Asaduddin Owaisi: యూపీలో బీజేపీని ఓడిద్దాం.. అఖిలేష్కు ఓవైసీ ఆఫర్..
- BJP: బీజేపీ పెద్ద లక్ష్యాల కోసం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చిన్న తాగ్యమా.?
- NEET Controversy: "రాజీనామాతో నా కూతురు తిరిగి రాదు.. దోషులను ఉరి తీయండి".. నీట్ బాధితురాలి తల్లి ఆవేదన..
- Rajnath Singh: భారత్ డేటా సెంటర్లు నిర్మిస్తే.. పాకిస్థాన్ ఉగ్రవాద కేంద్రాలు నిర్మిస్తోంది..
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో కూడా పేపర్ లీక్ అంశం ప్రస్తావనకు వస్తోంది. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ నిర్వహించిన పరీక్షపై ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ, ఆ రాష్ట్ర మంత్రి మధు బంగారప్ప రాజీనామాను కోరుతోంది. ప్రధాన్ రాజీనామా విషయంలో బీజేపీపై ఒత్తిడి పెంచిన కాంగ్రెస్, తన ప్రభుత్వంలోని మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తోంది.
మరోవైపు, సీజేపీ లీడర్లు పంజాబ్ పేపర్ లీక్ అంశంపై మాట దాటేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రధాన్ రాజీనామా తర్వాత జంతర్ మంతర్ వద్దకు వచ్చిన ఆప్ నేత మనీష్ సిసోడియాను అక్కడ ఉన్న విద్యార్థులు ప్రశ్నించడం వైరల్ అవుతోంది. కాక్రోచ్ పార్టీ సీనియర్ నాయకులు సౌరభ్, అశుతోష్ రాణాలను ఒక జర్నలిస్ట్ పంజాబ్ పేపర్ లీక్ గురించి ప్రశ్నించిన నేపథ్యంలో వారు సమాధానాలు చెప్పకుండా కారులో వెళ్లిపోతున్న వీడియో వైరల్గా మారింది. ధర్మేంద్ర ప్రధాన్పై మాట్లాడిన గొంతుకలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అవుతున్నాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Journalist: Will we also see protests by CJP in Punjab and Karnataka on paper leak?
Senior Cockroaches Saurabh and Ashutosh Ranka……closed the car door and fled! pic.twitter.com/D9sIJT8Xb5
— Megh Updates 🚨™ (@MeghUpdates) July 25, 2026
తాజావార్తలు
-
CJP: పంజాబ్, కర్ణాటక పేపర్ లీకుల మాటేమిటి.. కాక్రోచ్ల మౌనం ఎందుకు..?
-
IND Vs ZIM: మారని అభిషేక్ శర్మ తీరు.. మరోసారి నిరాశ.. జింబాబ్వేతో ముడో టీ20..
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CWG 2026: కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్లిఫ్టింగ్లో భారత్కు రజతం..
-
Asaduddin Owaisi: యూపీలో బీజేపీని ఓడిద్దాం.. అఖిలేష్కు ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!