Mizoram: మిజోరంలో 700 ఏళ్ల అస్థి పంజరం…
- ఉత్తర మిజోరాం మణిపూర్ సరిహద్దు ప్రాంతంలోని ఒక గుహలో పుర్రెలు
- తొడ, ఎముకలు సహా పురాతన మానవ అవశేషాల లభ్యం
- అతి పురాతనమైన అస్థిపంజర అవశేషాలు గుర్తించిన INTACH
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిజోరంలోని ఒక గుహలో 700 సంవత్సరాల నాటి అస్థిపంజరాలు కనుగొనబడ్డాయి, ఉత్తర మిజోరాం మణిపూర్ సరిహద్దు ప్రాంతంలోని ఒక గుహలో పుర్రెలు, తొడ, ఎముకలు సహా 700 సంవత్సరాలకు పైగా పురాతన మానవ అవశేషాలను పురావస్తు అధికారులు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ మిజో ప్రజల చరిత్రను పునర్నిర్వచించగలదని ఇండియన్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH) మిజోరాం యూనిట్ తెలిపింది.
పూర్తి వివరాల్లోకి వెళితే..మిజోరం రాష్ట్రంలో ఇప్పటివరకు లభించిన అతి పురాతనమైన అస్థిపంజర అవశేషాలు” అని INTACH కన్వీనర్ రిన్ సంగ తెలిపారు. ఈ అవశేషాలపై లోతైన అధ్యయనం చేయడం ద్వారా మిజో చరిత్రను తిరిగి అంచనా వేయాలని INTACH నిర్ణయించింది. ఈ అవశేషాలలో తొమ్మిది మానవ పుర్రెలు, అనేక తొడ ఎముకలు ఉన్నాయి. వీటితో పాటు, ‘దావో’ (పురాతన ఆయుధాలు), కత్తులు మరియు విరిగిన కుండలు కూడా కనుగొనబడ్డాయి” అని అన్నారు.
Also Read
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
సిచువల్ జిల్లాలోని నార్త్ ఖావ్లెక్ గ్రామానికి సమీపంలో ఉన్న థింగ్ఖువాంగ్ అడవిలోని ఎత్తైన గుహలో ఈ అవశేషాలు ఖననం చేయబడినట్లు రాష్ట్ర కళ ,సంస్కృతి విభాగానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్త వాన్లాల్హుమా సింగ్సన్ తెలిపారు. కార్బన్-14 పరీక్షల ప్రకారం, ఈ అవశేషాలు 1260 AD మరియు 1320 AD మధ్య నాటివని తెలిపారు. ఈ సంవత్సరం జనవరి 11న స్థానిక వేటగాడు ఈ ఆవిష్కరణను చేశాడు, అతను స్థానిక నాయకులకు , INTACHకి దీని గురించి సమాచారం ఇచ్చాడు.
మే 2న, రాష్ట్ర కళ ,సంస్కృతి శాఖ నుండి పురావస్తు నిపుణులు ఈ స్థలాన్ని పరిశీలించారు. ఈ గుహ సముద్ర మట్టానికి దాదాపు 1,228 మీటర్ల ఎత్తులో ఉన్న లోయలో ఉందని సింగ్సన్ చెప్పారు. అక్కడికి చేరుకోవడం చాలా కష్టం. US ప్రయోగశాలకు పంపిన నమూనాల కార్బన్ డేటింగ్ నివేదిక ఆగస్టులో అందిందని అధికారులు వెల్లడించారు.
మిజోరాం మిజో సమాజ చరిత్రను పునర్నిర్వచించాల్సిన అవసరాన్ని ఈ ఆవిష్కరణ హైలైట్ చేస్తుందని మాజీ ఐఏఎస్ అధికారి సంగా అన్నారు. ఇప్పటివరకు మిజో ప్రజలు 1700 AD ప్రాంతంలో మిజోరాంకు వచ్చారని నమ్మేవారు. అయితే ఈ ఆవిష్కరణ ఆ నమ్మకం కంటే దాదాపు 400 సంవత్సరాలు పాతదని ఆయన అన్నారు. ఈ ఆవిష్కరణ 1485 ADలో తూర్పు మిజోరాంలోని చాంఫాయి జిల్లాలోని వాంగ్చియా ప్రదేశంలో లభించిన అస్థిపంజరాల కంటే దాదాపు 200 సంవత్సరాలు పాతది. రాష్ట్ర ప్రభుత్వం, నిపుణుల సహాయంతో, ఈ అవశేషాల DNA పరీక్ష జరుగుతుందని, తద్వారా అవి ఏ జాతి లేదా వంశానికి చెందినవో తెలుసుకోవచ్చన్నారు..
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!