Mizoram: మిజోరంలో 700 ఏళ్ల అస్థి పంజరం…
- ఉత్తర మిజోరాం మణిపూర్ సరిహద్దు ప్రాంతంలోని ఒక గుహలో పుర్రెలు
- తొడ, ఎముకలు సహా పురాతన మానవ అవశేషాల లభ్యం
- అతి పురాతనమైన అస్థిపంజర అవశేషాలు గుర్తించిన INTACH
మిజోరంలోని ఒక గుహలో 700 సంవత్సరాల నాటి అస్థిపంజరాలు కనుగొనబడ్డాయి, ఉత్తర మిజోరాం మణిపూర్ సరిహద్దు ప్రాంతంలోని ఒక గుహలో పుర్రెలు, తొడ, ఎముకలు సహా 700 సంవత్సరాలకు పైగా పురాతన మానవ అవశేషాలను పురావస్తు అధికారులు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ మిజో ప్రజల చరిత్రను పునర్నిర్వచించగలదని ఇండియన్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH) మిజోరాం యూనిట్ తెలిపింది.
పూర్తి వివరాల్లోకి వెళితే..మిజోరం రాష్ట్రంలో ఇప్పటివరకు లభించిన అతి పురాతనమైన అస్థిపంజర అవశేషాలు” అని INTACH కన్వీనర్ రిన్ సంగ తెలిపారు. ఈ అవశేషాలపై లోతైన అధ్యయనం చేయడం ద్వారా మిజో చరిత్రను తిరిగి అంచనా వేయాలని INTACH నిర్ణయించింది. ఈ అవశేషాలలో తొమ్మిది మానవ పుర్రెలు, అనేక తొడ ఎముకలు ఉన్నాయి. వీటితో పాటు, ‘దావో’ (పురాతన ఆయుధాలు), కత్తులు మరియు విరిగిన కుండలు కూడా కనుగొనబడ్డాయి” అని అన్నారు.
Also Read
సిచువల్ జిల్లాలోని నార్త్ ఖావ్లెక్ గ్రామానికి సమీపంలో ఉన్న థింగ్ఖువాంగ్ అడవిలోని ఎత్తైన గుహలో ఈ అవశేషాలు ఖననం చేయబడినట్లు రాష్ట్ర కళ ,సంస్కృతి విభాగానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్త వాన్లాల్హుమా సింగ్సన్ తెలిపారు. కార్బన్-14 పరీక్షల ప్రకారం, ఈ అవశేషాలు 1260 AD మరియు 1320 AD మధ్య నాటివని తెలిపారు. ఈ సంవత్సరం జనవరి 11న స్థానిక వేటగాడు ఈ ఆవిష్కరణను చేశాడు, అతను స్థానిక నాయకులకు , INTACHకి దీని గురించి సమాచారం ఇచ్చాడు.
మే 2న, రాష్ట్ర కళ ,సంస్కృతి శాఖ నుండి పురావస్తు నిపుణులు ఈ స్థలాన్ని పరిశీలించారు. ఈ గుహ సముద్ర మట్టానికి దాదాపు 1,228 మీటర్ల ఎత్తులో ఉన్న లోయలో ఉందని సింగ్సన్ చెప్పారు. అక్కడికి చేరుకోవడం చాలా కష్టం. US ప్రయోగశాలకు పంపిన నమూనాల కార్బన్ డేటింగ్ నివేదిక ఆగస్టులో అందిందని అధికారులు వెల్లడించారు.
మిజోరాం మిజో సమాజ చరిత్రను పునర్నిర్వచించాల్సిన అవసరాన్ని ఈ ఆవిష్కరణ హైలైట్ చేస్తుందని మాజీ ఐఏఎస్ అధికారి సంగా అన్నారు. ఇప్పటివరకు మిజో ప్రజలు 1700 AD ప్రాంతంలో మిజోరాంకు వచ్చారని నమ్మేవారు. అయితే ఈ ఆవిష్కరణ ఆ నమ్మకం కంటే దాదాపు 400 సంవత్సరాలు పాతదని ఆయన అన్నారు. ఈ ఆవిష్కరణ 1485 ADలో తూర్పు మిజోరాంలోని చాంఫాయి జిల్లాలోని వాంగ్చియా ప్రదేశంలో లభించిన అస్థిపంజరాల కంటే దాదాపు 200 సంవత్సరాలు పాతది. రాష్ట్ర ప్రభుత్వం, నిపుణుల సహాయంతో, ఈ అవశేషాల DNA పరీక్ష జరుగుతుందని, తద్వారా అవి ఏ జాతి లేదా వంశానికి చెందినవో తెలుసుకోవచ్చన్నారు..
తాజావార్తలు
-
Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
-
Palakura Ullikaram Recipe : పాలకూర ఉల్లికారం.. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే రుచి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
-
Buchi Babu: ‘పెద్ది’ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
-
Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!