Mizoram: మిజోరంలో 700 ఏళ్ల అస్థి పంజరం…
- ఉత్తర మిజోరాం మణిపూర్ సరిహద్దు ప్రాంతంలోని ఒక గుహలో పుర్రెలు
- తొడ, ఎముకలు సహా పురాతన మానవ అవశేషాల లభ్యం
- అతి పురాతనమైన అస్థిపంజర అవశేషాలు గుర్తించిన INTACH
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిజోరంలోని ఒక గుహలో 700 సంవత్సరాల నాటి అస్థిపంజరాలు కనుగొనబడ్డాయి, ఉత్తర మిజోరాం మణిపూర్ సరిహద్దు ప్రాంతంలోని ఒక గుహలో పుర్రెలు, తొడ, ఎముకలు సహా 700 సంవత్సరాలకు పైగా పురాతన మానవ అవశేషాలను పురావస్తు అధికారులు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ మిజో ప్రజల చరిత్రను పునర్నిర్వచించగలదని ఇండియన్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH) మిజోరాం యూనిట్ తెలిపింది.
పూర్తి వివరాల్లోకి వెళితే..మిజోరం రాష్ట్రంలో ఇప్పటివరకు లభించిన అతి పురాతనమైన అస్థిపంజర అవశేషాలు” అని INTACH కన్వీనర్ రిన్ సంగ తెలిపారు. ఈ అవశేషాలపై లోతైన అధ్యయనం చేయడం ద్వారా మిజో చరిత్రను తిరిగి అంచనా వేయాలని INTACH నిర్ణయించింది. ఈ అవశేషాలలో తొమ్మిది మానవ పుర్రెలు, అనేక తొడ ఎముకలు ఉన్నాయి. వీటితో పాటు, ‘దావో’ (పురాతన ఆయుధాలు), కత్తులు మరియు విరిగిన కుండలు కూడా కనుగొనబడ్డాయి” అని అన్నారు.
Also Read
- Modi-Rahman: బ్రిక్స్కు ముందే ఢిల్లీకి రహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
- Monsoon Alert: ఆగస్టులో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో వరస అల్పపీడనాలు..
- Uber-Rapido Merge: ఉబర్, రాపిడో విలీనం..? రవాణా రంగంలో ఊహించని ట్విస్ట్...
- Ajit Doval: ‘పహల్గామ్ దాడి తర్వాత మోడీ అడిగిన ప్రశ్న ఇదే’.. అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
సిచువల్ జిల్లాలోని నార్త్ ఖావ్లెక్ గ్రామానికి సమీపంలో ఉన్న థింగ్ఖువాంగ్ అడవిలోని ఎత్తైన గుహలో ఈ అవశేషాలు ఖననం చేయబడినట్లు రాష్ట్ర కళ ,సంస్కృతి విభాగానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్త వాన్లాల్హుమా సింగ్సన్ తెలిపారు. కార్బన్-14 పరీక్షల ప్రకారం, ఈ అవశేషాలు 1260 AD మరియు 1320 AD మధ్య నాటివని తెలిపారు. ఈ సంవత్సరం జనవరి 11న స్థానిక వేటగాడు ఈ ఆవిష్కరణను చేశాడు, అతను స్థానిక నాయకులకు , INTACHకి దీని గురించి సమాచారం ఇచ్చాడు.
మే 2న, రాష్ట్ర కళ ,సంస్కృతి శాఖ నుండి పురావస్తు నిపుణులు ఈ స్థలాన్ని పరిశీలించారు. ఈ గుహ సముద్ర మట్టానికి దాదాపు 1,228 మీటర్ల ఎత్తులో ఉన్న లోయలో ఉందని సింగ్సన్ చెప్పారు. అక్కడికి చేరుకోవడం చాలా కష్టం. US ప్రయోగశాలకు పంపిన నమూనాల కార్బన్ డేటింగ్ నివేదిక ఆగస్టులో అందిందని అధికారులు వెల్లడించారు.
మిజోరాం మిజో సమాజ చరిత్రను పునర్నిర్వచించాల్సిన అవసరాన్ని ఈ ఆవిష్కరణ హైలైట్ చేస్తుందని మాజీ ఐఏఎస్ అధికారి సంగా అన్నారు. ఇప్పటివరకు మిజో ప్రజలు 1700 AD ప్రాంతంలో మిజోరాంకు వచ్చారని నమ్మేవారు. అయితే ఈ ఆవిష్కరణ ఆ నమ్మకం కంటే దాదాపు 400 సంవత్సరాలు పాతదని ఆయన అన్నారు. ఈ ఆవిష్కరణ 1485 ADలో తూర్పు మిజోరాంలోని చాంఫాయి జిల్లాలోని వాంగ్చియా ప్రదేశంలో లభించిన అస్థిపంజరాల కంటే దాదాపు 200 సంవత్సరాలు పాతది. రాష్ట్ర ప్రభుత్వం, నిపుణుల సహాయంతో, ఈ అవశేషాల DNA పరీక్ష జరుగుతుందని, తద్వారా అవి ఏ జాతి లేదా వంశానికి చెందినవో తెలుసుకోవచ్చన్నారు..
తాజావార్తలు
-
Modi-Rahman: బ్రిక్స్కు ముందే ఢిల్లీకి రహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
-
Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
-
Venky Atluri: వెంకీ అట్లూరి నెక్ట్స్ మూవీస్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ‘పోలీస్’ కథ ఇంకా రాస్తున్నానంటూ రివీల్!
-
Monsoon Alert: ఆగస్టులో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో వరస అల్పపీడనాలు..
-
Uber-Rapido Merge: ఉబర్, రాపిడో విలీనం..? రవాణా రంగంలో ఊహించని ట్విస్ట్…
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!