Abhishek Banerjee: “నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు”.. చిక్కుల్లో మమత మేనల్లుడు
- ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో అభిషేక్ బెనర్జీకి సీఐడీ నోటీసు.
- ఇది రాజకీయ కక్షసాధింపు అని అభిషేక్ ఆరోపణలు
- నా గొంతు కోసినా, భయపడనని కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Banerjee: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అతడిపై పలు కేసుల్లో విచారణ జరుగుతోంది. తాజాగా బెంగాల్ సీఐడీ అతడిని విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చేందుకు ఆయన నివాసానికి వెళ్లింది. శనివారం మధ్యాహ్నం అభిషేక్ కార్యాలయం అయిన ‘‘శాంతినికేతన్’’కు చేరుకుని నోటీసులు ఇవ్వాలని అధికారులు ప్రయత్నించారు. సోమవారం సీఐడీ కార్యాలయం భవానీ భవన్కు విచారణ కోసం రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఆ సమయంలో అభిషేక్ అక్కడ లేకపోవడంతో నోటీసులు తీసుకోలేదు.
మరో సీఐడీ బృందం కాళీఘాట్లోని మరో ఆఫీసులోకి వెళ్లి అక్కడ అభిషేక్ బెనర్జీకి నోటీసలు అందించారు. ఈ వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ.. తాను ఇంకా నోటీసును పూర్తిగా చదవలేదని చెప్పారు. న్యాయవాదులతో చర్చించిన తర్వాత అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. తనపై కేంద్ర సంస్థలు, రాష్ట్రపోలీసులు, కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Also Read
‘‘వారు ఏమి చేయాలనుకుంటే అది చేసుకోనివ్వండి. వారికి నచ్చినట్లు వారు ప్రవర్తించవచ్చు. ఇంతకుముందు కేవలం ED, CBI మాత్రమే ఉండేవి, ఇప్పుడు వాటితో పాటు బెంగాల్ పోలీసులు, కోల్కతా పోలీసులు , KMC (కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్) కూడా జతకలిశాయి. ఇంతకుముందు 2–3 దర్యాప్తు సంస్థలు ఉండేవి, ఇప్పుడు ఆ సంఖ్య 5కి చేరింది. నాపై 5–6 సంస్థలను ఉసిగొలిపి, బ్లాక్మెయిల్ చేయడం ద్వారా నన్ను భయపెట్టి లొంగదీసుకోవచ్చని వారు భావిస్తున్నారు. నేను అలాంటి వ్యక్తిని కాదు. మీరు నా గొంతు కోసినా సరే, మీకు నచ్చినట్లు ఏది చేసినా సరే… నన్ను లొంగదీసుకోవాలంటే ఏడు జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. నేను దేశద్రోహిని కాదు’’ అని ఆయన అన్నారు.
సంతకాల ఫోర్జరీ కేసు ఏంటి.?
టీఎంసీ ఓడిపోయిన తర్వాత, అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష నేతగా సీనియర్ నేత సోవన్ దేబ్ చటర్జీ ఎంపిక లేకపై కొంతమంది ఎమ్మెల్యేల సంతకాలను వారి అనుమతది ల లేకుండా ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే టీఎంసీ ఎమ్మెల్యేలు కునాల్ ఘోష్, నయనా బందోపాధ్యాయలను సీఐడీ విచారించింది.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?