సైన్స్ రాకెట్ లాగా దూసుకుపోతున్నా కూడా జనాల్లో మూఢ నమ్మకాలు మాత్రం తగ్గలేదు.. వింత ఆచారాలు మారడం లేదు.. తాజాగా ఓ ఘటన జరిగింది.. పాలాభికం, రక్తాభిషేకం వినే ఉంటారు.. గొడ్డు కారంతో అభిషేకం ఎక్కడైనా చూశారా.. వామ్మో ఇదేం పిచ్చి అనుకుంటున్నారు కదా.. కానీ మీరు విన్నది అక్షరాల నిజం.కారంతో స్నానం చేస్తూ దేవుడిని పూజించే ఆచారం ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం చిల్లీ బాత్ ఒకటి తెరపైకి వచ్చింది. కారంతో నోరు మాత్రమే కాదు.. శరీరం కూడా మంటపుడుతుంది. కానీ,కారం నీళ్లతో స్నానం చేయడమంటే మాటలా? ఇవేవీ లెక్కచేయకుండా తమిళనాడుకు చెందిన ఓ పూజారి ఈ సాహసాన్ని చేసి అందర్నీ అశ్చర్యంలో ముంచెత్తాడు.
వివరాల్లోకి వెళ్తే.. ధర్మపురి జిల్లాలోని నడపనహళ్లీ గ్రామానికి చెందిన గోవిందం అనే పూజారి కారం నీళ్లతో స్నానం చేయడం హాట్ టాపిక్గా మారింది. ఏటా ఆది అమావాస్య రోజున గ్రామ దైవం పెరియ కరుప్పసామికి కారం, పాలతో అభిషేకం చేస్తారు. ఈ క్రమంలో భక్తులు.. పూజారికి కారం నీళ్లతో స్నానం చేయిస్తారు. అలా చేస్తే దుష్టశక్తులు తొలగిపోయి అందరికీ మేలు జరుగుతుందని నమ్మకం. ముందుగా పూజారి గోవిందం రెండు కొడవళ్లపై నిలబడి భక్తుల సమస్యలను విన్నాడు.. ఘాటైన కారం అయిన ఆ పూజారీ మాత్రం వెన్నక్కి తగ్గలేదు..
ఆ ఘాటుకు అక్కడ వాళ్లంతా కూడా షాక్ అయ్యారు.. ఘాటుకు ఉండలేక పోయారు.. కానీ అతను తగ్గలేదు..108 కేజీల కారం నీళ్లను పూజారిపై కుమ్మరించారు. ఆ నీళ్లు కళ్లలోకి వెళ్తున్నా సరే.. ఆ మంటను భరిస్తూ విజయవంతంగా సాంప్రదాయాన్ని పూర్తిచేశాడు పూజారి. కారం నీళ్లను చల్లిన తర్వాత భక్తులు మళ్లీ ఆయనపై నీళ్లు పోశారు. కారం ఘాటు పోయేంత వరకు స్నానం చేయించారు. ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్ల నుంచి వస్తుందట. విచిత్రమేమిటంటే చిల్లీ బాత్ సమయంలో పూజారికి ఎలాంటి మంట పుట్టదట. ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే.. పెరియ కురుప్పస్వామికి భక్తులు మద్యం, సిగరెట్లను సైతం కానుకగా సమర్పిస్తారు.. ఇలా ఎన్నో వింత ఆచారాలు ఇక్కడ ఉన్నాయి.. ఏంటో ఈ జనాలు దేవుడు పేరుతో ప్రాణాన్ని రిస్క్ లో పడేస్తున్నారు..
#WATCH | Tamil Nadu | Thousands of devotees performed Pitru Karma Puja on Aadi Amavasai, in Rameswaram.
Devotees came here early morning, took a holy dip at Agni Teertham before performing the rituals of the puja. pic.twitter.com/n754Gkz48q
— ANI (@ANI) August 16, 2023