CJI U U Lalit: ఒక రోజు ముందుగానే సీజేఐ లలిత్కు వీడ్కోలు.. ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్కు ఒకరోజు ముందుగానే వీడ్కోలు పలకనున్నారు.. రేపు అంటే నవంబర్ 8న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది.. కానీ, రేపు గురునానక్ జయంతి సందర్భంగా సుప్రీంకోర్టుకు సెలవు కావడంతో.. ఒకరోజు ముందుగానే.. అంటే ఈ రోజే యూయూ లలిత్ చివరి పనిదినం కానుంది.. ఈ రోజే ఆయనకు వీడ్కోలు చెప్పనున్నారు.. ఉత్సవ ధర్మాసనం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అత్యున్నత న్యాయస్థానం యొక్క లంచ్ టైం తర్వాత సెషన్లో సమావేశమవుతుంది.. జస్టిస్ డీవై చంద్రచూడ్ మరియు జస్టిస్ త్రివేది కూడా ఉంటారు. సెరిమోనియల్ బెంచ్ యొక్క సంప్రదాయం ప్రకారం, భారతదేశం యొక్క అవుట్గోయింగ్ ప్రధాన న్యాయమూర్తి తన వారసుడితో బెంచ్ను పంచుకుంటారు.. అయితే బార్ అసోసియేషన్ సభ్యులు మరియు ప్రభుత్వ సీనియర్ న్యాయ అధికారులు అతనికి వీడ్కోలు పలుకుతారు.. దీంతో సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తికి నేడు వీడ్కోలు పలుకనున్నారు. ఈ నేపథ్యంలో తన చివరి విచారణను లైవ్స్ట్రీమింగ్ చేయనున్నారు. సుప్రీంకోర్టు వెబ్క్యాస్ట్ చానల్తోపాటు యూట్యూబ్ చానల్లో మధ్యాహ్నం 2 గంటలకు లైవ్ టెలికాస్ట్ ప్రారంభం అవుతుందని ప్రకటించారు.
Read Also: Gujarat : బీజేపీకి షాక్.. పార్టీకి మాజీ మంత్రి గుడ్బై..
Also Read
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
కాగా, సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్.. ఈ ఏడాది ఆగస్టు నెలలో బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 8వ తేదీన ఆయన పదవీకాలం ముగియనుంది. 74 రోజులపాటు అత్యున్నత పదవిలో కొనసాగిన సీజేఐకి నేడు సుప్రీంకోర్టు వీడ్కోలు చెప్పనుంది.. ఇక, సుప్రీంకోర్టు తదుపతి ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ ఈ నెల 9న బాధ్యతలు స్వీకరించనున్న విషయం విదితమే.. 2024, నవంబర్ 10 వరకు.. అంటే రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. అయితే, భారత సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఆగస్టు 26న అప్పటి సీజేఐ ఎన్వీ రమణ యొక్క సెరిమోనియల్ బెంచ్ యొక్క కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసింది, ఇది అతనికి ఉన్నత న్యాయస్థానంలో చివరి పనిదినం… సెప్టెంబర్ 27 నుండి, సుప్రీంకోర్టు తన వెబ్కాస్ట్ ఛానెల్ మరియు యూట్యూబ్ ద్వారా రాజ్యాంగ ధర్మాసనాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించిన విషయం విదితమే.. ఎనిమిది లక్షల మందికి పైగా వీక్షకులు ఈ ప్రక్రియను వీక్షించారు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!