CJI U U Lalit: ఒక రోజు ముందుగానే సీజేఐ లలిత్కు వీడ్కోలు.. ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్కు ఒకరోజు ముందుగానే వీడ్కోలు పలకనున్నారు.. రేపు అంటే నవంబర్ 8న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది.. కానీ, రేపు గురునానక్ జయంతి సందర్భంగా సుప్రీంకోర్టుకు సెలవు కావడంతో.. ఒకరోజు ముందుగానే.. అంటే ఈ రోజే యూయూ లలిత్ చివరి పనిదినం కానుంది.. ఈ రోజే ఆయనకు వీడ్కోలు చెప్పనున్నారు.. ఉత్సవ ధర్మాసనం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అత్యున్నత న్యాయస్థానం యొక్క లంచ్ టైం తర్వాత సెషన్లో సమావేశమవుతుంది.. జస్టిస్ డీవై చంద్రచూడ్ మరియు జస్టిస్ త్రివేది కూడా ఉంటారు. సెరిమోనియల్ బెంచ్ యొక్క సంప్రదాయం ప్రకారం, భారతదేశం యొక్క అవుట్గోయింగ్ ప్రధాన న్యాయమూర్తి తన వారసుడితో బెంచ్ను పంచుకుంటారు.. అయితే బార్ అసోసియేషన్ సభ్యులు మరియు ప్రభుత్వ సీనియర్ న్యాయ అధికారులు అతనికి వీడ్కోలు పలుకుతారు.. దీంతో సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తికి నేడు వీడ్కోలు పలుకనున్నారు. ఈ నేపథ్యంలో తన చివరి విచారణను లైవ్స్ట్రీమింగ్ చేయనున్నారు. సుప్రీంకోర్టు వెబ్క్యాస్ట్ చానల్తోపాటు యూట్యూబ్ చానల్లో మధ్యాహ్నం 2 గంటలకు లైవ్ టెలికాస్ట్ ప్రారంభం అవుతుందని ప్రకటించారు.
Read Also: Gujarat : బీజేపీకి షాక్.. పార్టీకి మాజీ మంత్రి గుడ్బై..
Also Read
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
కాగా, సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్.. ఈ ఏడాది ఆగస్టు నెలలో బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 8వ తేదీన ఆయన పదవీకాలం ముగియనుంది. 74 రోజులపాటు అత్యున్నత పదవిలో కొనసాగిన సీజేఐకి నేడు సుప్రీంకోర్టు వీడ్కోలు చెప్పనుంది.. ఇక, సుప్రీంకోర్టు తదుపతి ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ ఈ నెల 9న బాధ్యతలు స్వీకరించనున్న విషయం విదితమే.. 2024, నవంబర్ 10 వరకు.. అంటే రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. అయితే, భారత సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఆగస్టు 26న అప్పటి సీజేఐ ఎన్వీ రమణ యొక్క సెరిమోనియల్ బెంచ్ యొక్క కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసింది, ఇది అతనికి ఉన్నత న్యాయస్థానంలో చివరి పనిదినం… సెప్టెంబర్ 27 నుండి, సుప్రీంకోర్టు తన వెబ్కాస్ట్ ఛానెల్ మరియు యూట్యూబ్ ద్వారా రాజ్యాంగ ధర్మాసనాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించిన విషయం విదితమే.. ఎనిమిది లక్షల మందికి పైగా వీక్షకులు ఈ ప్రక్రియను వీక్షించారు.
తాజావార్తలు
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!