CJI U U Lalit: ఒక రోజు ముందుగానే సీజేఐ లలిత్కు వీడ్కోలు.. ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్కు ఒకరోజు ముందుగానే వీడ్కోలు పలకనున్నారు.. రేపు అంటే నవంబర్ 8న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది.. కానీ, రేపు గురునానక్ జయంతి సందర్భంగా సుప్రీంకోర్టుకు సెలవు కావడంతో.. ఒకరోజు ముందుగానే.. అంటే ఈ రోజే యూయూ లలిత్ చివరి పనిదినం కానుంది.. ఈ రోజే ఆయనకు వీడ్కోలు చెప్పనున్నారు.. ఉత్సవ ధర్మాసనం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అత్యున్నత న్యాయస్థానం యొక్క లంచ్ టైం తర్వాత సెషన్లో సమావేశమవుతుంది.. జస్టిస్ డీవై చంద్రచూడ్ మరియు జస్టిస్ త్రివేది కూడా ఉంటారు. సెరిమోనియల్ బెంచ్ యొక్క సంప్రదాయం ప్రకారం, భారతదేశం యొక్క అవుట్గోయింగ్ ప్రధాన న్యాయమూర్తి తన వారసుడితో బెంచ్ను పంచుకుంటారు.. అయితే బార్ అసోసియేషన్ సభ్యులు మరియు ప్రభుత్వ సీనియర్ న్యాయ అధికారులు అతనికి వీడ్కోలు పలుకుతారు.. దీంతో సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తికి నేడు వీడ్కోలు పలుకనున్నారు. ఈ నేపథ్యంలో తన చివరి విచారణను లైవ్స్ట్రీమింగ్ చేయనున్నారు. సుప్రీంకోర్టు వెబ్క్యాస్ట్ చానల్తోపాటు యూట్యూబ్ చానల్లో మధ్యాహ్నం 2 గంటలకు లైవ్ టెలికాస్ట్ ప్రారంభం అవుతుందని ప్రకటించారు.
Read Also: Gujarat : బీజేపీకి షాక్.. పార్టీకి మాజీ మంత్రి గుడ్బై..
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
కాగా, సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్.. ఈ ఏడాది ఆగస్టు నెలలో బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 8వ తేదీన ఆయన పదవీకాలం ముగియనుంది. 74 రోజులపాటు అత్యున్నత పదవిలో కొనసాగిన సీజేఐకి నేడు సుప్రీంకోర్టు వీడ్కోలు చెప్పనుంది.. ఇక, సుప్రీంకోర్టు తదుపతి ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ ఈ నెల 9న బాధ్యతలు స్వీకరించనున్న విషయం విదితమే.. 2024, నవంబర్ 10 వరకు.. అంటే రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. అయితే, భారత సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఆగస్టు 26న అప్పటి సీజేఐ ఎన్వీ రమణ యొక్క సెరిమోనియల్ బెంచ్ యొక్క కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసింది, ఇది అతనికి ఉన్నత న్యాయస్థానంలో చివరి పనిదినం… సెప్టెంబర్ 27 నుండి, సుప్రీంకోర్టు తన వెబ్కాస్ట్ ఛానెల్ మరియు యూట్యూబ్ ద్వారా రాజ్యాంగ ధర్మాసనాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించిన విషయం విదితమే.. ఎనిమిది లక్షల మందికి పైగా వీక్షకులు ఈ ప్రక్రియను వీక్షించారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!