CJI U U Lalit: ఒక రోజు ముందుగానే సీజేఐ లలిత్కు వీడ్కోలు.. ఎందుకంటే..?
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్కు ఒకరోజు ముందుగానే వీడ్కోలు పలకనున్నారు.. రేపు అంటే నవంబర్ 8న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది.. కానీ, రేపు గురునానక్ జయంతి సందర్భంగా సుప్రీంకోర్టుకు సెలవు కావడంతో.. ఒకరోజు ముందుగానే.. అంటే ఈ రోజే యూయూ లలిత్ చివరి పనిదినం కానుంది.. ఈ రోజే ఆయనకు వీడ్కోలు చెప్పనున్నారు.. ఉత్సవ ధర్మాసనం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అత్యున్నత న్యాయస్థానం యొక్క లంచ్ టైం తర్వాత సెషన్లో సమావేశమవుతుంది.. జస్టిస్ డీవై చంద్రచూడ్ మరియు జస్టిస్ త్రివేది కూడా ఉంటారు. సెరిమోనియల్ బెంచ్ యొక్క సంప్రదాయం ప్రకారం, భారతదేశం యొక్క అవుట్గోయింగ్ ప్రధాన న్యాయమూర్తి తన వారసుడితో బెంచ్ను పంచుకుంటారు.. అయితే బార్ అసోసియేషన్ సభ్యులు మరియు ప్రభుత్వ సీనియర్ న్యాయ అధికారులు అతనికి వీడ్కోలు పలుకుతారు.. దీంతో సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తికి నేడు వీడ్కోలు పలుకనున్నారు. ఈ నేపథ్యంలో తన చివరి విచారణను లైవ్స్ట్రీమింగ్ చేయనున్నారు. సుప్రీంకోర్టు వెబ్క్యాస్ట్ చానల్తోపాటు యూట్యూబ్ చానల్లో మధ్యాహ్నం 2 గంటలకు లైవ్ టెలికాస్ట్ ప్రారంభం అవుతుందని ప్రకటించారు.
Read Also: Gujarat : బీజేపీకి షాక్.. పార్టీకి మాజీ మంత్రి గుడ్బై..
Also Read
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
కాగా, సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్.. ఈ ఏడాది ఆగస్టు నెలలో బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 8వ తేదీన ఆయన పదవీకాలం ముగియనుంది. 74 రోజులపాటు అత్యున్నత పదవిలో కొనసాగిన సీజేఐకి నేడు సుప్రీంకోర్టు వీడ్కోలు చెప్పనుంది.. ఇక, సుప్రీంకోర్టు తదుపతి ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ ఈ నెల 9న బాధ్యతలు స్వీకరించనున్న విషయం విదితమే.. 2024, నవంబర్ 10 వరకు.. అంటే రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. అయితే, భారత సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఆగస్టు 26న అప్పటి సీజేఐ ఎన్వీ రమణ యొక్క సెరిమోనియల్ బెంచ్ యొక్క కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసింది, ఇది అతనికి ఉన్నత న్యాయస్థానంలో చివరి పనిదినం… సెప్టెంబర్ 27 నుండి, సుప్రీంకోర్టు తన వెబ్కాస్ట్ ఛానెల్ మరియు యూట్యూబ్ ద్వారా రాజ్యాంగ ధర్మాసనాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించిన విషయం విదితమే.. ఎనిమిది లక్షల మందికి పైగా వీక్షకులు ఈ ప్రక్రియను వీక్షించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!