CJI U U Lalit: ఒక రోజు ముందుగానే సీజేఐ లలిత్కు వీడ్కోలు.. ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్కు ఒకరోజు ముందుగానే వీడ్కోలు పలకనున్నారు.. రేపు అంటే నవంబర్ 8న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది.. కానీ, రేపు గురునానక్ జయంతి సందర్భంగా సుప్రీంకోర్టుకు సెలవు కావడంతో.. ఒకరోజు ముందుగానే.. అంటే ఈ రోజే యూయూ లలిత్ చివరి పనిదినం కానుంది.. ఈ రోజే ఆయనకు వీడ్కోలు చెప్పనున్నారు.. ఉత్సవ ధర్మాసనం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అత్యున్నత న్యాయస్థానం యొక్క లంచ్ టైం తర్వాత సెషన్లో సమావేశమవుతుంది.. జస్టిస్ డీవై చంద్రచూడ్ మరియు జస్టిస్ త్రివేది కూడా ఉంటారు. సెరిమోనియల్ బెంచ్ యొక్క సంప్రదాయం ప్రకారం, భారతదేశం యొక్క అవుట్గోయింగ్ ప్రధాన న్యాయమూర్తి తన వారసుడితో బెంచ్ను పంచుకుంటారు.. అయితే బార్ అసోసియేషన్ సభ్యులు మరియు ప్రభుత్వ సీనియర్ న్యాయ అధికారులు అతనికి వీడ్కోలు పలుకుతారు.. దీంతో సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తికి నేడు వీడ్కోలు పలుకనున్నారు. ఈ నేపథ్యంలో తన చివరి విచారణను లైవ్స్ట్రీమింగ్ చేయనున్నారు. సుప్రీంకోర్టు వెబ్క్యాస్ట్ చానల్తోపాటు యూట్యూబ్ చానల్లో మధ్యాహ్నం 2 గంటలకు లైవ్ టెలికాస్ట్ ప్రారంభం అవుతుందని ప్రకటించారు.
Read Also: Gujarat : బీజేపీకి షాక్.. పార్టీకి మాజీ మంత్రి గుడ్బై..
Also Read
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
- Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
- MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
- Sunetra Pawar: సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
కాగా, సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్.. ఈ ఏడాది ఆగస్టు నెలలో బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 8వ తేదీన ఆయన పదవీకాలం ముగియనుంది. 74 రోజులపాటు అత్యున్నత పదవిలో కొనసాగిన సీజేఐకి నేడు సుప్రీంకోర్టు వీడ్కోలు చెప్పనుంది.. ఇక, సుప్రీంకోర్టు తదుపతి ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ ఈ నెల 9న బాధ్యతలు స్వీకరించనున్న విషయం విదితమే.. 2024, నవంబర్ 10 వరకు.. అంటే రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. అయితే, భారత సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఆగస్టు 26న అప్పటి సీజేఐ ఎన్వీ రమణ యొక్క సెరిమోనియల్ బెంచ్ యొక్క కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసింది, ఇది అతనికి ఉన్నత న్యాయస్థానంలో చివరి పనిదినం… సెప్టెంబర్ 27 నుండి, సుప్రీంకోర్టు తన వెబ్కాస్ట్ ఛానెల్ మరియు యూట్యూబ్ ద్వారా రాజ్యాంగ ధర్మాసనాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించిన విషయం విదితమే.. ఎనిమిది లక్షల మందికి పైగా వీక్షకులు ఈ ప్రక్రియను వీక్షించారు.
తాజావార్తలు
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
-
Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
-
Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
-
Dating Rumors: ప్రీతి జింటాతో ఎఫైర్ వార్తలు.. 15 ఏళ్ల తర్వాత మౌనం వీడిన స్టార్ ప్లేయర్!
-
Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!