CJI BR Gavai: సోషల్ మీడియాలో ఏం అవుతుందో: ‘‘మహావిష్ణువు’’ వివాదం మధ్య సీజేఐ కీలక వ్యాఖ్యలు..
- సోషల్ మీడియాలో ఏం రిపోర్టు అవుతోందో మాకు తెలియదు..
- సోషల్ మీడియాపై సీజేఐ బీఆర్ గవాయ్ వ్యంగ్యాస్త్రాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJI BR Gavai: శ్రీ మహా విష్ణువుపై భారత ప్రధాన న్యాయమూర్తి(CJI) బీఆర్ గవాయ్ వ్యాఖ్యల అనంతరం, సోమవారం సుప్రీంకోర్టులో ఆయనపై దాడి జరిగింది. ఓ న్యాయవాది ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత సీజేఐ గవాయ్ మంగళవారం సోషల్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. సీజేఐ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జిల్లా కోర్టు న్యాయమూర్తుల నియామకం- పదోన్నతులకు సంబంధించిన అంశాన్ని విచారిస్తుండగా ఈ కామెంట్స్ వచ్చాయి.
‘‘ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏం రిపోర్ట్ అవుతుందో మాకు తెలియదు. మీ క్లయింట్ చాలా బాధపడుతాడు’’ అని ఓ న్యాయవాదితో సీజేఐ అన్నారు. న్యాయ అధికారుల సర్వీస్ పరిస్థితులు -జీతాలకు సంబంధించిన అంశాలపై ఆల్ ఇండియా జడ్జిస్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారిస్తున్నప్పుడు చీఫ్ జస్టిస్ చేసిన ఈ వ్యాఖ్య వచ్చింది. ‘‘న్యాయమూర్తి వినోద్ చంద్రన్ ఏదో చెప్పాలని అనుకున్నాడు, కానీ తాను ఆ విషయాన్ని ప్రైవేట్ గా పంచుకోవాలని కోరారు. ఈ రోజుల్లో విషయాలు అతిగా ప్రస్తావించబడే అవకాశం ఉంది’’ అని సీజేఐ సోషల్ మీడియాను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
Read Also: 2025 Nobel Prize Physics: భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ బహుమతి..
వివాదం ఏంటి..?
మధ్యప్రదేశ్ ఖజురహో కాంప్లెక్స్లో విష్ణు విగ్రహాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారిస్తూ, సీజేఐ గవాయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ పిటిషన్ను తిరస్కరిస్తూ, ‘‘మీరు వెళ్లి దేవుడినే ఏమైనా చేయమని అడగండి, మీరు నిజమైన భక్తుడని అంటున్నారు, కాబట్టి ఇప్పుడే వెళ్లి ప్రార్థించండి’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో సీజేఐ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
సోమవారం 71ఏళ్ల న్యాయవాది రాకేష్ కిషోర్ కోర్టు గదిలో చీఫ్ జస్టిస్పై బూటు విసిరేందుకు ప్రయత్నించడంతో వివాదం మరింత పెద్దదైంది. పోలీసులు అతడిని బయటకు తీసుకెళ్తుండగా ‘‘భారతదేశం సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని సహించదు’’ అని కిషోర్ కామెంట్స్ చేశారు. అయితే, ప్రధాన న్యాయమూర్తి కోర్టు రిజిస్ట్రార్ జనరల్ను అభియోగాలు మోపవద్దని కోరిన తర్వాత న్యాయవాదిని అరెస్ట్ చేయలేదు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!