Chhattisgarh: “మోడీ సార్ నా భార్యను మీరే కాపాడాలి”.. ఒమన్లో చిత్రహింసలకు గురవుతున్న భారతీయ మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: ఛత్తీస్గఢ్కి చెందిన ఓ మహిళ ఒమన్ దేశంలో నరకయాతన పడుతోంది. బతుకుదెరువు కోసం అక్కడికి వెళ్లిన సదరు మహిళను యజమాని చిత్రహింసలు పెడుతున్నారు. బందీగా ఉంచుకుని, వేరే వారికి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ, తనను రక్షించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకున్న మహిళ వీడియో వెలుగులోకి వచ్చింది. తన భార్యను ఒమన్ నుంచి కాపాడాలని మహిళ భర్త రాష్ట్ర పోలీసులను కోరాడు. ఆమెను విడిచిపెట్టేందుకు రూ. 2 లక్షలు- 3 లక్షలు కోరుతున్నట్లు జోగి ముఖేష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టినట్లు దుర్గ్ పోలీస్ ఉన్నతాధికారి అభిషేక్ ఝా సోమవారం తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు.
Read Also: Iran: భారతీయు టూరిస్టులకు ఇరాన్ శుభవార్త.. ఇకపై వీసా లేకుండానే వెళ్లొచ్చు
Also Read
- Pregabalin: ప్రెగాబాలిన్ దుర్వినియోగంపై కేంద్రం అలర్ట్.. అమ్మకాలపై ఆరోగ్యశాఖ ఆంక్షలు
- CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
- Abhijit Dipke: "నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు".. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
బాధిత మహిళకి భిలాయ్(దుర్గ్)లోని ఖుర్సీపర్కి చెందిన వ్యక్తి ద్వారా హైదరాబాద్కి చెందిన ఏజెంట్ అబ్దుల్లాతో పరిచయం ఏర్పడింది. కేరళ ద్వారా ఆమెను అతను ఒమన్ పంపించినట్లు ఆమె భర్త ముఖేష్ వెల్లడించారు. ముందుగా ఏజెంట్ కేవలం తన భార్యను వంటపని చేస్తుందని చెప్పారని, ఆ తర్వాత ఇంటి పని చేయిస్తున్నారని అతను చెప్పాడు. తన భార్యను విడుదల చేసేందుకు రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షలు అడుగుతున్నాడని, నా భార్య భారత్ తిరిగి వచ్చేలా చూడాలని ప్రధాని సర్కి విజ్ఞప్తి చేస్తున్నానని అతను తెలిపాడు.
తన చిత్రహింసలపై మహిళ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ‘‘ సార్, నా పేరు దీపిక, నేను బిలాయ్కి చెందిన వ్యక్తి. నన్ను అబద్ధాలు చెప్పి ఇక్కడ ట్రాప్ చేశారు. నన్ను కొట్టారు. నన్ను ఇంటి నుంచి వెళ్లనివ్వాలని కోరితే, వారు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. వారు నన్ను వేరొకరికి అమ్ముతామని చెబుతున్నారు. దయచేసి నన్ను రక్షించండి సార్.’’ అంటూ తన ఆవేదనను వెల్లడించింది.
A women from Chhattisgarh allegedly claims she is held captive by her employer in Oman. She released a video saying She was thrashed and assaulted @PMOIndia @vishnudsai @MEAIndia pic.twitter.com/bGRM3zWyrv
— Anurag Dwary (@Anurag_Dwary) February 5, 2024
తాజావార్తలు
-
Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్ను ఫిక్స్ ..
-
Pregabalin: ప్రెగాబాలిన్ దుర్వినియోగంపై కేంద్రం అలర్ట్.. అమ్మకాలపై ఆరోగ్యశాఖ ఆంక్షలు
-
Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
-
Peddi Censor Report: ‘పెద్ది’కి U/A సర్టిఫికేట్.. కానీ ఈ సీన్లపై సెన్సార్ కత్తెర
-
Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!