ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మరికొందరికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఇక మావోల శిబిరాన్ని డీఆర్జీ సైనికులు ధ్వంసం చేశారు.
ఇది కూడా చదవండి: Ayodhya Terror Attack: అయోధ్యపై దాడికి ప్లాన్.. ఐఎస్ఐ అనుమానిత ఉగ్రవాది అరెస్ట్
ఛత్తీస్గఢ్లోని ధామ్తారి జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఖల్లారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదగిరి అడవుల్లో ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతోంది. కొండ ప్రాంతంలో 25 నుంచి 30 మంది మావోలు ఉన్నట్లు సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Fire Accident: అంబర్పేట ఫ్లైఓవర్ కింద అగ్ని ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్