Charu Pandey: కోచింగ్ లేదు.. బుక్స్ పట్టుకుని కూర్చోలేదు! కానీ 19 గవర్నమెంట్ జాబ్స్ కొట్టింది.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు!

  • కోచింగ్ లేకుండానే 19 ప్రభుత్వ ఉద్యోగాలు..
  • రాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోనున్న ఛత్తీస్‌గఢ్ యువతి!
Charu Pandey

Charu Pandey

Charu Pandey: ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 19 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేసి సంచలనం సృష్టించింది ఓ 23 ఏళ్ల యువతి. ఛత్తీస్‌గఢ్‌లోని టిల్డా-నియోరాకు చెందిన చారు పాండే అనే యువతి సాధించిన ఈ అరుదైన ఘనత ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ప్రస్తుతం ఆమె విశాఖపట్నంలోని కాగ్ (CAG) ఆఫీసులో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా తన ‘డ్రీమ్ జాబ్’ చేస్తోంది. అంతేకాదు ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చారు పాండే బంగారు పతకాన్ని అందుకోనుంది.

ఒకదాని తర్వాత ఒకటి.. వరుసగా 19 ఉద్యోగాలు

గణితంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన చారు.. కాలేజీ రోజుల్లోనే పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. ఎక్కడా ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా, కేవలం సెల్ఫ్ స్టడీపైనే ఆధారపడి పరీక్షలు రాసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎన్నో ప్రతిష్టాత్మక పరీక్షలను ఆమె అవలీలగా క్లియర్ చేసింది.

×
×
Ad

ఆమె సాధించిన ఉద్యోగాల లిస్ట్ ఇదే..

* SSC రిక్రూట్‌మెంట్స్: SSC CGL, CHSL, MTS, GD, CPO.

* బ్యాంకింగ్ రంగం: SBI PO, SBI క్లర్క్, IBPS PO, IBPS క్లర్క్.

* ఇతర రంగాలు: రైల్వేస్, పోలీస్ డిపార్ట్‌మెంట్, పలు స్టేట్ లెవెల్ ఉద్యోగాలు.

రోజుకు 20 గంటల కఠిన సాధన..

ఈ సందర్భంగా చారు మాట్లాడుతూ.. “నిజానికి నేను ఇన్ని ఉద్యోగాలు సాధించాలని ముందే ప్లాన్ చేసుకోలేదు. ఒక ఎగ్జామ్ రాశాక, దాని రిజల్ట్స్ రావడానికి చాలా టైమ్ పట్టేది. ఆ గ్యాప్‌లో ఖాళీగా కూర్చోకుండా మరో నోటిఫికేషన్‌కు ప్రిపేర్ అయ్యేదాన్ని. అలా ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలు వస్తూనే ఉన్నాయి” అని చారు తన జర్నీని పంచుకుంది. ప్రిపరేషన్‌పై పూర్తి ఫోకస్ పెట్టడం కోసం చారు రాయ్‌పూర్‌లోని ఒక గెస్ట్ హౌస్‌లో ఆరు నెలల పాటు ఒంటరిగా గడిపింది. బాహ్య ప్రపంచానికి, సోషల్ మీడియా ఆకర్షణలకు దూరంగా ఉంటూ.. ఆ సమయంలో రోజుకు దాదాపు 20 గంటల పాటు చదివేదాన్ని అని ఆమె వెల్లడించారు. అదే సమయంలో తన సబ్జెక్ట్ నాలెడ్జ్ మరింత పెంచుకోవడానికి స్కూల్ పిల్లలకు ట్యూషన్లు కూడా చెప్పేదని వెల్లడించారు. “సిలబస్ మొత్తం పూర్తి చేయాలనే ఆరాటంతో చదవకూడదు. మనం ఎంత చదివాం, ఏ సబ్జెక్ట్ చదివాం అనేదాని కంటే.. చదివినంత వరకు ఎంత పర్‌ఫెక్ట్‌గా నేర్చుకున్నాం అనేదే ముఖ్యం” అని చారు సక్సెస్ మంత్రను వివరించింది.

యూట్యూబ్, ‘AI’ సాయంతో ప్రిపరేషన్!

కోచింగ్ సెంటర్లకు వేలకు వేలు ఫీజులు కట్టకుండా కేవలం ఆన్‌లైన్ అవకాశాలనే చారు ఆయుధాలుగా మార్చుకుంది. యూట్యూబ్‌లో వివిధ సబ్జెక్ట్ నిపుణుల లెక్చర్స్ వినేదాన్ని అని, చదివేటప్పుడు ఎలాంటి డౌట్స్ వచ్చినా వాటిని నివృత్తి చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ సహాయం తీసుకునేదాన్ని అని ఆమె వెల్లడించింది. సమయ పాలన, సానుకూల దృక్పథం, ఒత్తిడి ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడటం వంటివి అభ్యర్థులకు ఎంతో అవసరమని ఈ చారు సూచిస్తోంది. కాగా, తన కూతురు సాధించిన ఈ అద్భుత విజయాలపై ఆమె తల్లిదండ్రులు స్పందిస్తూ.. “మా అమ్మాయి ఎప్పుడూ పుస్తకాలతోనే కూర్చుని మాకు కనిపించలేదు, కానీ ఆమె కష్టాన్ని, టాలెంట్‌ను మేము ఎప్పుడూ నమ్మాం” అంటూ ఆనందం వ్యక్తం చేశారు.