Farooq Abdullah: మనీలాండరింగ్ కేసులో ఫరూక్ అబ్దుల్లాపై ఛార్జిషీట్ దాఖలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farooq Abdullah: జమ్ము కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో మాజీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై చార్జిషీట్ దాఖలు చేయబడింది. ఛార్జిషీట్ను దాఖలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. 84 ఏళ్ల అబ్దుల్లాను పలుమార్లు ప్రశ్నించింది. చివరిసారిగా మే 31న శ్రీనగర్లో ఆయనను మూడు గంటలకు పైగా విచారించారు. 2019లో ఇదే కేసులో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. ఈ కేసులో ఈడీ 2020లోనే ఫరూక్ అబ్దుల్లాకు సంబంధించిన 11.86 కోట్ల ఆస్తులను స్తంభింపజేసింది. ఈ కేసులో ఇప్పటికే అబ్దుల్లాను ఈడీ పలు మార్లు విచారించింది. జేకేసీఏ అధ్యక్షుడిగా అబ్దుల్లా తన పదవిని దుర్వినియోగం చేశారని, బీసీసీఐ ఇచ్చిన నిధులను మళ్లించారని ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసులో జమ్ము కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్కు చెందిన నిధులను స్వాహా చేసినట్లు అభియోగాలున్నాయి. అసోసియేషన్ ఆఫీస్ బేరర్లతో పాటు వివిధ వ్యక్తుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడినట్లు తెలిసింది. అసోసియేషన్ ఆఫీస్ బేరర్లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు దర్యాప్తును ప్రారంభించింది. ఫరూక్ అబ్దుల్లా అసోసియేషన్ అధ్యక్షుడిగా తన పదవిని దుర్వినియోగం చేశారని.. బీసీసీఐ ప్రాయోజిత నిధులను లాండరింగ్ చేసేలా క్రీడా సంఘంలో నియామకాలు చేశారని ఈడీ ఆరోపించింది.
Also Read
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
- BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
Lakhimpur Kheri Violence Case: ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఇచ్చేందుకు అలహాబాద్ కోర్టు నిరాకరణ
సెప్టెంబర్ 2019లోృ అప్పటి జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి అహ్సన్ అహ్మద్ మీర్జాను ఈడీ అరెస్టు చేసింది. అతడిపై విచారణ జరుగుతోంది. ఈ విషయంపై తదుపరి విచారణ పురోగతిలో ఉందని ఈడీ తెలిపింది. దేశంలోని ప్రతిపక్ష నాయకులందరికీ కేంద్ర దర్యాప్తు సంస్థల సమన్లు సాధారణమని కశ్మీర్లోని రాజకీయ పార్టీలు పేర్కొన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు కేంద్ర సంస్థలు ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేస్తాయని అబ్దుల్లా అన్నారు.
తాజావార్తలు
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
Kitchen Hacks: గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయాయా? ఇలా చేస్తే నిమిషాల్లో కొత్త వాటిలా మెరిసిపోతాయి!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
-
PF Money: ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ విషయంలో ఈ తప్పు చేస్తే భారీ నష్టం తప్పదు!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!