కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి వచ్చింది లేదు.. మరోవైపు థర్డ్ వేవ్ భయలు వెంటాడుతున్నాయి.. ఇక, కొత్త కొత్త వేరియంట్లు వెలుగుచూస్తూనే ఉన్నాయి… మరోవైపు కేరళ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే జికా వైరస్ కేసులు నమోదు కాగా.. ఇప్పుడు మహారాష్ట్రలో జికా వైరస్ కేసు వెలుగు చూసింది.. దీంతో.. దానిపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్రం.. వెంటనే కొంత మంది వైద్య నిపుణుల బృందాన్ని మహారాష్ట్రకు పంపించింది.. జికా వైరస్, అక్కడి పరిస్థితులపై ఆ వైద్య బృందం అధ్యయనం చేసి, ప్రజారోగ్యానికి అవసరమైన సిఫార్సులను చేస్తుందని అధికారులు చెబుతున్నారు. హార్డింగ్ మెడికల్ కాలేజీకి సంబంధించిన గైనకాలజిస్ట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ నుంచి ఓ ఎంటమాలిజిస్ట్.. కూడా ఈ టీమ్లో సభ్యులుగా ఉన్నారు.. మొత్తంగా ముగ్గురు ఆ టీమ్లో ఉన్నారు.. కాగా, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో జికా వైరస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.