Port Blair renamed: “పోర్ట్ బ్లెయిర్” పేరు మార్చిన కేంద్రం..ఇకపై ఇలా పిలవాలి..
- అండమాన్ నికోబార్ రాజధాని పేరు మార్చిన కేంద్రం..
- ఇకపై పోర్ట్ బ్లెయిర్ని ‘‘శ్రీ విజయ పురం’’గా పిలువాలి..
- బ్రిటీష్ వలసవాద ఆనవాళ్లని తొలగిస్తున్న ప్రభుత్వం..
- ఒకప్పుడు చోళుల నౌకాదళానికి ప్రధాన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Port Blair: అండమాన్ అండ్ నికోబార్ దీవుల రాజధాని ‘‘పోర్ట్ బ్లెయిర్’’ పేరుని మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వలసవాద ముద్రల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు కేంద్రం ఈ చర్య తీసుకున్నట్లు చెప్పింది. పోర్ట్ బ్లెయిర్కి కొత్తగా ‘‘శ్రీ విజయ పురం’’ అనే పేరుని పెట్టింది. పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ దీవులకు ప్రవేశస్థానం. బ్రిటీష్ వలసవాద పాలనలో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటీష్ అధికారి కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిన్ పేరు మీద ఈ పట్టణానికి ‘‘పోర్ట్ బ్లెయిర్’’గా పేరు పెట్టారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘‘వలసవాద వారసత్వం మునపటి పేరు ఉన్నప్పటికీ.. శ్రీ విజయ పురం మన స్వాతంత్య్ర పోరాటంలో సాధించిన విజయానికి, అండమాన్ నికోబార్ దీవుల విశిష్ట పాత్రకు ప్రతీక’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ మన స్వాతంత్య్ర పోరాటంలో మన చరిత్రలో అండమాన్ నికోబార్ దీవులకు అసమానమైన స్థానం ఉంది. ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి నావికా స్థావరంగా పనిచేసిన ద్వీప భూభాగం నేడు మన వ్యూహాత్మక, అభివృద్ధి ఆకాంక్షలకు కీలకమైన స్థావరంగా మారింది’’ అని అమిత్ షా అన్నారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
Read Also: Tajikistan: 96 శాతం ముస్లింలున్న దేశంలో హిజాబ్ పై నిషేధం.. మసీదుల స్థానంలో కేఫ్లు, హాల్స్!
‘‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేత మన తిరంగా మొదటి ఆవిష్కరణకు ఆతిథ్యం ఇచ్చిన ప్రదేశం, వీర్ సావర్కర్, ఇతర స్వాతంత్య్ర పోరాట యోధులు స్వతంత్ర దేశం కోసం పోరాడిన సెల్యూలర్ జైలు కూడా ఇదే’’ అని కేంద్ర హోం మంత్రి చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఎంతో మంది సమరయోధులను బ్రిటీష్ వారు ఇక్కడి సెల్యూలర్ జైలులో ఉంచి హింసించేవారు. ప్రస్తుతం ఇది నేషనల్ మెమోరియల్గా ప్రసిద్ధి చెందింది.
జూలై నెలలో రాష్ట్రపతి భవన్ ఐకానిక్ ‘దర్బార్ హాల్’ మరియు ‘అశోక హాల్’కి గణతంత్ర మండపం, అశోక్ మండపంగా పేరు మార్చారు. భారతీయ సాంస్కృతిక విలువలు మరియు నైతికతలను ప్రతిబింబించేలా రాష్ట్రపతి భవన్ వాతావరణాన్ని రూపొందించడానికి స్థిరమైన ప్రయత్నం జరిగిందని రాష్ట్రపతి సెక్రటేరియట్ తెలిపింది. రక్షణ దళాలలో, వలసరాజ్యాల వారసత్వాన్ని తొలగించడానికి కేంద్రం, భారత నావికాదళ సిబ్బంది అందరూ లాఠీలను మోసే పద్ధతిని తొలగించడాన్ని తక్షణమే అమలులోకి తెచ్చింది.
Inspired by the vision of PM @narendramodi Ji, to free the nation from the colonial imprints, today we have decided to rename Port Blair as "Sri Vijaya Puram."
While the earlier name had a colonial legacy, Sri Vijaya Puram symbolises the victory achieved in our freedom struggle…
— Amit Shah (@AmitShah) September 13, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?