Port Blair renamed: “పోర్ట్ బ్లెయిర్” పేరు మార్చిన కేంద్రం..ఇకపై ఇలా పిలవాలి..
- అండమాన్ నికోబార్ రాజధాని పేరు మార్చిన కేంద్రం..
- ఇకపై పోర్ట్ బ్లెయిర్ని ‘‘శ్రీ విజయ పురం’’గా పిలువాలి..
- బ్రిటీష్ వలసవాద ఆనవాళ్లని తొలగిస్తున్న ప్రభుత్వం..
- ఒకప్పుడు చోళుల నౌకాదళానికి ప్రధాన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Port Blair: అండమాన్ అండ్ నికోబార్ దీవుల రాజధాని ‘‘పోర్ట్ బ్లెయిర్’’ పేరుని మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వలసవాద ముద్రల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు కేంద్రం ఈ చర్య తీసుకున్నట్లు చెప్పింది. పోర్ట్ బ్లెయిర్కి కొత్తగా ‘‘శ్రీ విజయ పురం’’ అనే పేరుని పెట్టింది. పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ దీవులకు ప్రవేశస్థానం. బ్రిటీష్ వలసవాద పాలనలో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటీష్ అధికారి కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిన్ పేరు మీద ఈ పట్టణానికి ‘‘పోర్ట్ బ్లెయిర్’’గా పేరు పెట్టారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘‘వలసవాద వారసత్వం మునపటి పేరు ఉన్నప్పటికీ.. శ్రీ విజయ పురం మన స్వాతంత్య్ర పోరాటంలో సాధించిన విజయానికి, అండమాన్ నికోబార్ దీవుల విశిష్ట పాత్రకు ప్రతీక’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ మన స్వాతంత్య్ర పోరాటంలో మన చరిత్రలో అండమాన్ నికోబార్ దీవులకు అసమానమైన స్థానం ఉంది. ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి నావికా స్థావరంగా పనిచేసిన ద్వీప భూభాగం నేడు మన వ్యూహాత్మక, అభివృద్ధి ఆకాంక్షలకు కీలకమైన స్థావరంగా మారింది’’ అని అమిత్ షా అన్నారు.
Also Read
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Read Also: Tajikistan: 96 శాతం ముస్లింలున్న దేశంలో హిజాబ్ పై నిషేధం.. మసీదుల స్థానంలో కేఫ్లు, హాల్స్!
‘‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేత మన తిరంగా మొదటి ఆవిష్కరణకు ఆతిథ్యం ఇచ్చిన ప్రదేశం, వీర్ సావర్కర్, ఇతర స్వాతంత్య్ర పోరాట యోధులు స్వతంత్ర దేశం కోసం పోరాడిన సెల్యూలర్ జైలు కూడా ఇదే’’ అని కేంద్ర హోం మంత్రి చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఎంతో మంది సమరయోధులను బ్రిటీష్ వారు ఇక్కడి సెల్యూలర్ జైలులో ఉంచి హింసించేవారు. ప్రస్తుతం ఇది నేషనల్ మెమోరియల్గా ప్రసిద్ధి చెందింది.
జూలై నెలలో రాష్ట్రపతి భవన్ ఐకానిక్ ‘దర్బార్ హాల్’ మరియు ‘అశోక హాల్’కి గణతంత్ర మండపం, అశోక్ మండపంగా పేరు మార్చారు. భారతీయ సాంస్కృతిక విలువలు మరియు నైతికతలను ప్రతిబింబించేలా రాష్ట్రపతి భవన్ వాతావరణాన్ని రూపొందించడానికి స్థిరమైన ప్రయత్నం జరిగిందని రాష్ట్రపతి సెక్రటేరియట్ తెలిపింది. రక్షణ దళాలలో, వలసరాజ్యాల వారసత్వాన్ని తొలగించడానికి కేంద్రం, భారత నావికాదళ సిబ్బంది అందరూ లాఠీలను మోసే పద్ధతిని తొలగించడాన్ని తక్షణమే అమలులోకి తెచ్చింది.
Inspired by the vision of PM @narendramodi Ji, to free the nation from the colonial imprints, today we have decided to rename Port Blair as "Sri Vijaya Puram."
While the earlier name had a colonial legacy, Sri Vijaya Puram symbolises the victory achieved in our freedom struggle…
— Amit Shah (@AmitShah) September 13, 2024
తాజావార్తలు
-
Ricky Ponting-PBKS: ఒంటరిగా కూర్చుని ఏడ్చేసిన పంజాబ్ హెడ్ కోచ్.. సెటైర్లు వేసిన ఆర్ అశ్విన్!
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
-
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్పై ప్రీతి జింటా ఫైర్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..