Hit And Run: కేంద్రం కీలక నిర్ణయం.. పరిహారం భారీగా పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త సవరణలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది… హిట్ అండ్ రన్ మరణాల పరిహారాన్ని కేంద్రం రూ.25,000 నుంచి రూ.2 లక్షలకు పెంచింది.. దేశంలో ఇప్పటి వరకు హిట్ అండ్ రన్ కేసుల పరిహారం రూ.25,000గా ఉండగా… ఇకపై ఈ కేసుల పరిహారం రూ.2 లక్షలకు కేంద్రం సవరించింది… ఈ మేరకు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆ నోటిఫికేషన్ ప్రకారం హిట్ అండ్ రన్ బాధితుల బంధువులకు ఏప్రిల్ 1 నుండి నష్టపరిహారం ఎనిమిది రెట్లు పెంచింది.. అంటే.. ఏప్రిల్ 1 నుంచి ఈ కేసుల్లో మరణించినవారికి రూ.2 లక్షల పరిహారం అందించనుంది. ఇక, హిట్ అండ్ రన్ కేసులో తీవ్ర గాయాలపాలైన వ్యక్తికి ఇచ్చే సొలేటియం ప్రస్తుతం రూ.12,500గా ఉండగా.. దానిని రూ.50,000కి పెంచింది.
Read Also: IND vs SL: రోహిత్ శర్మ కొత్త రికార్డు.. ప్రపంచంలోనే ఒకేఒక్కడు..
Also Read
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
- PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
- Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
ఫిబ్రవరి 25న విడుదల చేసిన నోటిఫికేషన్లో మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ‘హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్స్ స్కీమ్ బాధితులకు పరిహారం’, 2022 అని పిలవవచ్చని మరియు ఇది ఏప్రిల్ 1, 2022 నుండి అమల్లోకి వస్తుందని పేర్కొంది.. కాగా, ఆగస్టు 2, 2021న మంత్రిత్వ శాఖ ద్వారా ఈ ముసాయిదా పథకం నోటిఫై చేయబడింది. ప్రస్తుతం హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి 1989 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తున్నారు. పాత చట్టంలో నష్టపరిహారం చాలా చాలా తక్కువగా ఉండటంతో కేంద్రం కీలక సవరణలు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గరున్న వివరాల ప్రకారం 2020లో దేశవ్యాప్తంగా 3,66,138 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 1,31,714 మంది మృతిచెందారు. హిట్ అండ్ రన్ కేసుల్లో మృతులకు, బాధితులకు పరిహారం కోసం ప్రభుత్వం మోటర్ వెహికల్స్ యాక్సిడెంట్ ఫండ్ను ఏర్పాటు చేస్తుంది. ఇది హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ల విషయంలో పరిహారం అందించడానికి మరియు ప్రమాద బాధితులకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది.
తాజావార్తలు
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!