Crops MSP Hike: రైతులకు కేంద్రం శుభవార్త.. 17 పంటలకు కనీస మద్దతు ధర పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతులకు ఊరట కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఖరీఫ్ సీజన్కు గానూ 17 పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2022-23 సీజన్ కు ఖరీఫ్ పంటల ఎంఎస్పీ ఆమోదించబడింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వరి మద్దతు ధరను క్వింటాలుకు రూ.100 పెంచగా… దీంతో క్వింటాలు వరి రూ.2040కి చేరనుంది. 2021-22 వరి ఎంఎస్పీ క్వింటాలుకు రూ.1940గా ఉంది.
Guinnis Record: ఏకధాటిగా పొడవైన రోడ్డు నిర్మాణం.. గిన్నిస్ బుక్లోకి భారత్
Also Read
- Amul milk: సామాన్యుడి జేబుకు 'అముల్' చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
- Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
- AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
- Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
ఇందులో కందులపై క్వింటాల్కు మద్దతు ధర రూ.300, పెసర్లపై క్వింటాల్కు రూ.400, పొద్దుతిరుగుడుపై క్వింటాల్కు రూ.385, సోయాబీన్ క్వింటాల్కు రూ.300, నువ్వులపై క్వింటాల్కు రూ.523 పెంచినట్లు కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, ఖరీఫ్, రబీ సీజన్లో ఎరువుల అవసరాలను తీర్చడానికి భారతదేశంలో తగినంత యూరియా నిల్వ ఉన్నాయని అన్నారు. డిసెంబర్ వరకు దానిని దిగుమతి చేసుకోవలసిన అవసరం లేదన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు తగ్గుముఖం పట్టాయని, రానున్న ఆరు నెలల్లో వీటి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. దేశంలో తగినంత యూరియా అందుబాటులో ఉంది. దేశీయ అవసరాలకు అనుగుణంగా డిసెంబర్ వరకు యూరియా నిల్వ ఉంది. డిసెంబర్ వరకు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి వెల్లడించారు.
పెంచిన తర్వాత
ధరల వివరాలు(క్వింటాలుకు)
———————-
వరి రూ.2040
వరి ఏ గ్రేడ్ రూ.2060
జొన్న రూ.2970 ,
ఏ గ్రేడ్ రూ. 2990
సజ్జలు : రూ. 2350
రాగి: రూ.3578
మొక్క జొన్న: రూ.1962
కందిపప్పు : రూ. 6600
పెసరపప్పు : రూ. 7755
మినపప్పు : రూ. 6600
వేరు శనగ : రూ. 5850
ప్రొద్దుతిరుగుడు : రూ. 6400
సోయాబీన్ : రూ. 4300
నువ్వులు : రూ. 7830
పత్తి : రూ. 6080
పత్తి పొడవు రకం : రూ.6380
నైగర్ సీడ్ : రూ. 7287.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
-
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
-
AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!