Crops MSP Hike: రైతులకు కేంద్రం శుభవార్త.. 17 పంటలకు కనీస మద్దతు ధర పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతులకు ఊరట కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఖరీఫ్ సీజన్కు గానూ 17 పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2022-23 సీజన్ కు ఖరీఫ్ పంటల ఎంఎస్పీ ఆమోదించబడింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వరి మద్దతు ధరను క్వింటాలుకు రూ.100 పెంచగా… దీంతో క్వింటాలు వరి రూ.2040కి చేరనుంది. 2021-22 వరి ఎంఎస్పీ క్వింటాలుకు రూ.1940గా ఉంది.
Guinnis Record: ఏకధాటిగా పొడవైన రోడ్డు నిర్మాణం.. గిన్నిస్ బుక్లోకి భారత్
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
ఇందులో కందులపై క్వింటాల్కు మద్దతు ధర రూ.300, పెసర్లపై క్వింటాల్కు రూ.400, పొద్దుతిరుగుడుపై క్వింటాల్కు రూ.385, సోయాబీన్ క్వింటాల్కు రూ.300, నువ్వులపై క్వింటాల్కు రూ.523 పెంచినట్లు కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, ఖరీఫ్, రబీ సీజన్లో ఎరువుల అవసరాలను తీర్చడానికి భారతదేశంలో తగినంత యూరియా నిల్వ ఉన్నాయని అన్నారు. డిసెంబర్ వరకు దానిని దిగుమతి చేసుకోవలసిన అవసరం లేదన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు తగ్గుముఖం పట్టాయని, రానున్న ఆరు నెలల్లో వీటి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. దేశంలో తగినంత యూరియా అందుబాటులో ఉంది. దేశీయ అవసరాలకు అనుగుణంగా డిసెంబర్ వరకు యూరియా నిల్వ ఉంది. డిసెంబర్ వరకు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి వెల్లడించారు.
పెంచిన తర్వాత
ధరల వివరాలు(క్వింటాలుకు)
———————-
వరి రూ.2040
వరి ఏ గ్రేడ్ రూ.2060
జొన్న రూ.2970 ,
ఏ గ్రేడ్ రూ. 2990
సజ్జలు : రూ. 2350
రాగి: రూ.3578
మొక్క జొన్న: రూ.1962
కందిపప్పు : రూ. 6600
పెసరపప్పు : రూ. 7755
మినపప్పు : రూ. 6600
వేరు శనగ : రూ. 5850
ప్రొద్దుతిరుగుడు : రూ. 6400
సోయాబీన్ : రూ. 4300
నువ్వులు : రూ. 7830
పత్తి : రూ. 6080
పత్తి పొడవు రకం : రూ.6380
నైగర్ సీడ్ : రూ. 7287.
తాజావార్తలు
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
-
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
ట్రెండింగ్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!