NTV Telugu Site icon

వ్యాక్సినేష‌న్‌.. రాష్ట్రాల‌కు కేంద్రం కీల‌క ఆదేశాలు

Ajay Bhalla

క‌రోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేసింది.. ఫ‌స్ట్ వేవ్ కంటే.. భారీగా కేసులు, ఎక్కువ సంఖ్య‌లో మృతులు క‌ల‌వ‌రానికి గురిచేశాయి.. బెడ్లు, ఆక్సిజ‌న్ దొర‌క‌క అల్లాడిపోయిన ప‌రిస్థితి.. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది.. క్ర‌మంగా కేసులు దిగివ‌చ్చాయి.. ఇక‌, చికిత్స‌పై నుంచి వ్యాక్సినేష‌న్‌పై ఫోక‌స్ పెడుతోంది ప్ర‌భుత్వం.. ఈ నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.. క‌రోనా వ్యాప్తిని నిరోధించేందుకు వ్యాక్సినేషన్ చాలా ముఖ్యమైనదంటూ.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా. లాక్‌డౌన్‌కు స్వ‌స్తి చెప్పి అన్‌లాక్‌లోకి వెళ్తున్న స‌మ‌యంలో.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు స‌మీక్షించాల‌ని.. కోవిడ్ నిబంధనలు పాటించడం, టెస్ట్-ట్రాక్-ట్రీట్- వ్యాకినేట్ స్ట్రాటజీని అమలు చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపవద్దని సూచించారు. పరిస్థితులను కూలంకషంగా అంచనా వేసిన తర్వాతే ఆంక్షలను విధించాలా, సడలించాలా అనే విషయంలో నిర్ణయం తీసుకోవాల‌ని కోరింది కేంద్రం.