CNG Rates: 10 శాతం వరకు తగ్గనున్న సీఎన్జీ ధరలు.. ధర విధానంలో మార్పుకు కేంద్రం ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CNG Rates: సహజవాయువు ధరను నిర్ణయించేందుకు ప్రభుత్వం కొత్త పద్ధతిని తీసుకురాబోతోంది. ధర పరిమితి విధించేందుకు కేంద్ర క్యాబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. యూఎస్ఏ, కెనడా, రష్యా వంటి విదేశాల్లోని గ్యాస్ ధరలతో కాకుండా దిగుమతి చేసుకున్న ముడి చమురు ధరతో అనుసంధానించనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీని వల్ల పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) ధర 10 శాతం వరకు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ) ధర 6 శాతం నుంచి 9 శాతానికి తగ్గుతుందని ఆయిల్ సెక్రటరీ పంకజ్ జైన్ గురువారం తెలిపారు.
Read Also: Sri Maha Lakshmi Stotram: కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లి లాంటి శ్రీమహాలక్ష్మి స్తోత్రాలు
Also Read
- Terrorist Digital Plan: భారత్ టార్గెట్గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!
- Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
ఈ మార్పలకు సంబంధించి ప్రభుత్వం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో శనివారం నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. ఇటీవల కాలంలో సీఎన్జీ, పీఎన్జీ ధరలు 80 శాతం మేర పెరిగిన నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్యుడికి ఊరట కలగనుంది. 2030 నాటికి ఇండియా ఇంధన వాడకంలో సహజవాయువు వాటాను ప్రస్తుతం ఉన్న 6.5 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం వల్ల సహజవాయువు వినియోగాన్ని పెంచడానికి సహాయపడుతుంది. కార్బన్ ఉద్గారాల తగ్గింపుకు సహాయపడుతుంది.
కేంద్రం తీసుకున్న ఈ చర్య వల్ల వినియోగదారుడికి సహాయపడుతుందని ఇంధన మంత్రి హర్దీప్ పూరీ ట్వీట్ చేశారు. భారత దేశంలోని గ్యాస్ ధరలపై విదేశాల ప్రభావాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలకు కొనసాగింపుగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హెన్రీ హబ్, అల్బెనా, నేషనల్ బ్యాలెన్సింగ్ పాయింట్(బ్రిటన్), రష్యా అనే 4 గ్యాస్ ట్రేడింగ్ హబ్ లలో ధరల ఆధారంగా దేశీయ గ్యాస్ ధరలను ప్రతీ ఆరు నెలలకు ఒకసారి నిర్ణయించేవారు. అయితే ఈ విధానాన్ని కేంద్రం తాజాగా మార్చబోతోంది.
తాజావార్తలు
-
Terrorist Digital Plan: భారత్ టార్గెట్గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!
-
Red Necked Nightjar : చందమామతో టైమ్ సెట్ చేసుకునే పక్షి.. ఇదే ప్రకృతి మ్యాజిక్.!
-
Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
-
Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
-
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!