CNG Rates: 10 శాతం వరకు తగ్గనున్న సీఎన్జీ ధరలు.. ధర విధానంలో మార్పుకు కేంద్రం ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CNG Rates: సహజవాయువు ధరను నిర్ణయించేందుకు ప్రభుత్వం కొత్త పద్ధతిని తీసుకురాబోతోంది. ధర పరిమితి విధించేందుకు కేంద్ర క్యాబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. యూఎస్ఏ, కెనడా, రష్యా వంటి విదేశాల్లోని గ్యాస్ ధరలతో కాకుండా దిగుమతి చేసుకున్న ముడి చమురు ధరతో అనుసంధానించనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీని వల్ల పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) ధర 10 శాతం వరకు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ) ధర 6 శాతం నుంచి 9 శాతానికి తగ్గుతుందని ఆయిల్ సెక్రటరీ పంకజ్ జైన్ గురువారం తెలిపారు.
Read Also: Sri Maha Lakshmi Stotram: కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లి లాంటి శ్రీమహాలక్ష్మి స్తోత్రాలు
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
ఈ మార్పలకు సంబంధించి ప్రభుత్వం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో శనివారం నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. ఇటీవల కాలంలో సీఎన్జీ, పీఎన్జీ ధరలు 80 శాతం మేర పెరిగిన నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్యుడికి ఊరట కలగనుంది. 2030 నాటికి ఇండియా ఇంధన వాడకంలో సహజవాయువు వాటాను ప్రస్తుతం ఉన్న 6.5 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం వల్ల సహజవాయువు వినియోగాన్ని పెంచడానికి సహాయపడుతుంది. కార్బన్ ఉద్గారాల తగ్గింపుకు సహాయపడుతుంది.
కేంద్రం తీసుకున్న ఈ చర్య వల్ల వినియోగదారుడికి సహాయపడుతుందని ఇంధన మంత్రి హర్దీప్ పూరీ ట్వీట్ చేశారు. భారత దేశంలోని గ్యాస్ ధరలపై విదేశాల ప్రభావాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలకు కొనసాగింపుగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హెన్రీ హబ్, అల్బెనా, నేషనల్ బ్యాలెన్సింగ్ పాయింట్(బ్రిటన్), రష్యా అనే 4 గ్యాస్ ట్రేడింగ్ హబ్ లలో ధరల ఆధారంగా దేశీయ గ్యాస్ ధరలను ప్రతీ ఆరు నెలలకు ఒకసారి నిర్ణయించేవారు. అయితే ఈ విధానాన్ని కేంద్రం తాజాగా మార్చబోతోంది.
తాజావార్తలు
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!