Central Government: కరెంట్ కోతలపై కొత్త రూల్స్.. అక్కడ కరెంట్ పోతే మూడు నిమిషాల్లో ఇవ్వాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరెంట్ కోతలపై కేంద్ర విద్యుత్ శాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ మేరకు లక్ష, అంతకు మించి జనాభా ఉండే పట్టణాల్లో డిస్కంలు 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నిబంధనను తక్షణమే అమల్లోకి తెచ్చేలా ప్రతి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆదేశాలివ్వాలని స్పష్టం చేసింది. దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో లక్షకు పైగా జనాభా ఉండే పట్టణాల్లో డీజిల్ జనరేటర్ల వినియోగాన్ని నియంత్రించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది.
కాలుష్యాన్ని నివారించాలంటే పట్టణాల్లో నిరంతర కరెంట్ సరఫరా జరిగేలా డిస్కంలు చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ అభిప్రాయపడింది. ఈ పట్టణాల్లో ఏవైనా కారణాలతో కరెంట్ నిలిపివేసినా మూడు నిమిషాల్లో పునరుద్ధరించాలని.. అప్పుడే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పరిగణించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. అటు కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా డీజిల్ జనరేటర్ల బదులు సౌర, పవన విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధనాన్ని బ్యాటరీ బ్యాకప్ సహాయంతో వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. వచ్చే ఐదేళ్లలో పట్టణాల్లో డీజిల్ జనరేటర్ల బదులు అందరూ సంప్రదాయేతర ఇంధన వినియోగంలోకి మారేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరింది.
Also Read
- New Bat Coronavirus: థాయ్లాండ్లో కొత్త కరోనావైరస్.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?
- Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ భవిష్యత్తును తేల్చనున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు.!
- Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు
- DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
Nitin Gadkari: ఎలక్ట్రిక్ వాహనాల వరుస ప్రమాదాలు.. కేంద్రం సీరియస్
తాజావార్తలు
-
Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్
-
Dragon : గ్లిమ్స్ కోసం మూడు రోజులుగా వర్క్ చేస్తున్న రవి బస్రూర్
-
Kareena-Nayanthara: నయనతార యాక్టింగ్ పై.. కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
-
CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
-
Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం