Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి
- క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- టిప్ పూర్తిగా ప్రయాణికుడి ఇష్టమని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అడ్వాన్స్ టిప్ విధానాన్ని నిలిపివేయాలని క్యాబ్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైడ్ బుక్ చేసుకునే ముందే డ్రైవర్కు టిప్ ఇచ్చే విధానం అన్యాయమైన వ్యాపార పద్ధతి అని.. దీనిని నిలిపివేయాలని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే ఆదేశాలు జారీ చేశారు. రైడ్ పూర్తయ్యాక టిప్ ఇవ్వాలా లేదా అనేది వినియోగదారుడి ఇష్టమని.. టిప్ ఇస్తేనే రైడ్ యాక్సెప్ట్ చేస్తారనే భావన కలిగించడం సరికాదని పేర్కొన్నారు. ఈ అంశంపై జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్కు ఫిర్యాదులు రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రయాణం ప్రారంభించకముందే డ్రైవర్కు టిప్ ఇచ్చేలా ప్రయాణికులను ప్రోత్సహించే అడ్వాన్స్ టిప్పింగ్ ఆప్షన్ను నిలిపివేయాలని క్యాబ్ అగ్రిగేటర్లను ఆదేశించింది. ఈ విధానం వినియోగదారులను తప్పుదోవ పట్టించేదిగా, అన్యాయమైన వ్యాపార పద్ధతిగా గుర్తించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి, కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ అధిపతి నిధి ఖరే తెలిపారు. ఈ వ్యాఖ్యలు సెప్టెంబర్ 15న రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్ Rapidoపై CCPA రూ.10 లక్షల జరిమానా విధించిన మరుసటి రోజు వచ్చాయి. అడ్వాన్స్ టిప్పింగ్తో పాటు పలు అన్యాయమైన వ్యాపార పద్ధతులకు సంబంధించి ఈ చర్య తీసుకుంది.
Also Read
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
క్యాబ్ వచ్చే ముందే టిప్ ఎందుకు?
క్యాబ్ అగ్రిగేటర్లపై జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయని నిధి ఖరే తెలిపారు. రైడ్ తీసుకునే ముందే డ్రైవర్కు అడ్వాన్స్గా టిప్ ఇవ్వాలనే విధానం కొన్ని ప్లాట్ఫామ్లలో కనిపిస్తోందని వినియోగదారులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. టిప్ చెల్లించకపోతే రైడ్ లభించే అవకాశం తగ్గుతుందనే భావన కలిగించేలా ప్రయాణికులను ప్రోత్సహిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని ఆమె వివరించారు. ఇది మిస్లీడింగ్, అన్యాయమైన వ్యాపార పద్ధతిగా గుర్తించినట్లు తెలిపారు. వివరణాత్మక దర్యాప్తు, సంబంధిత సంస్థల వాదనలు విన్న తర్వాత రైడ్ ప్రారంభానికి ముందే టిప్ చెల్లించేలా ఉండే ఈ విధానాన్ని నిలిపివేయాలని ఆదేశించినట్లు నిధి ఖరే వెల్లడించారు.
టిప్ పూర్తిగా ప్రయాణికుడి ఇష్టం
డ్రైవర్కు టిప్ ఇవ్వడం పూర్తిగా ప్రయాణికుడి స్వచ్ఛంద నిర్ణయమని నిధి ఖరే స్పష్టం చేశారు. రైడ్ పూర్తయిన తర్వాత ప్రయాణికుడి ఇష్టానుసారం టిప్ ఇచ్చే అవకాశం ఉండాలని పేర్కొన్నారు. రైడ్ పొందాలంటే ముందుగానే అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఉండకూడదని తెలిపారు.
Uber, Olaపై కొనసాగుతున్న దర్యాప్తు
క్యాబ్ అగ్రిగేటర్ల విషయంలో కేంద్రం చర్యలు Rapidoకే పరిమితం కాలేదు. Uber, Ola వంటి సంస్థల వ్యాపార విధానాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని నిధి ఖరే తెలిపారు. భారత్లో పనిచేస్తున్న క్యాబ్, బైక్-ట్యాక్సీ అగ్రిగేటర్ల వ్యాపార విధానాలను పరిశీలించేందుకు CCPA రంగాల వారీగా దర్యాప్తు చేపట్టింది. ముఖ్యంగా రైడ్ ప్రారంభానికి ముందే అదనపు టిప్ చెల్లించేలా చేసే విధానాలు, డైనమిక్ ప్రైసింగ్ తదితర అంశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే Uber, Ola, Rapido, Namma Yatri సహా పలు ప్లాట్ఫామ్లకు CCPA నోటీసులు జారీ చేసింది. 2023లో రూపొందించిన Dark Patterns మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించింది.
Rapidoకు రూ.10 లక్షల జరిమానా
రైడ్ బుక్ చేసే సమయంలో ప్రయాణికులపై అదనంగా డబ్బు చెల్లించేలా ఒత్తిడి తెచ్చే విధానాలపై CCPA Rapidoను తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో Rapidoను నిర్వహించే Roppen Transportation Services Pvt Ltdకు రూ.10 లక్షల జరిమానా విధించింది.
తాజావార్తలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!