Indian Navy: యుద్ధనౌకల ప్రాజెక్ట్ కు కేంద్రం ఆమోదం.. రూ. 20 వేల కోట్లు కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Navy: భారత ప్రభుత్వం రక్షణ రంగానికి ఎక్కువగా నిధులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించగా.. ఇప్పుడు యుద్ధ నౌకలను దేశంలోనే తయారు చేయాలని నిర్ణయించింది. యుద్ధనౌకల తయారీ ప్రాజెక్టకు కేంద్రం ఆమోదం తెలిపింది. భారత నావికాదళానికి ప్రోత్సాహంగా నౌకల్లో ఇంధనం, ఆహారం, మందుగుండు సామగ్రిని నింపడానికి సహాయపడే ఐదు ఫ్లీట్ సపోర్ట్ నౌకలను నిర్మించే ప్రాజెక్టుకు కేంద్రం బుధవారం అనుమతి ఇచ్చింది. ఈ ఐదు నౌకలను రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించే నౌకలు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆత్మనిర్భరత లేదా భారత నౌకాదళ స్వావలంబన లక్ష్యాలను పెంచుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. నౌకాదళ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన రూ.20,000 కోట్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Read also: Nidhi Agerwal: అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈరోజు అది చూసే వాళ్లం
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
భారత నావికాదళ పరాక్రమాన్ని బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనున్నాయి. సముద్రాలలో మోహరించే సమయంలో ఆహారం, ఇంధనం, మందుగుండు సామగ్రితో సహా అవసరమైన సామాగ్రిని అందించడం ద్వారా వివిధ నౌకాదళాలకు సేవలు అందిస్తాయి. ఈ ప్రాజెక్టు హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కు కూడా గణనీయమైన ప్రయోజనాలను అందించనుంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో సహా అనేక భాగస్వాములతో కూడిన సహకార ప్రయత్నాల ద్వారా అమలు చేయబడే ఈ స్మారక ఆర్డర్ ను అందుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. రానున్న 10 ఏళ్లల్లో ఈ ఐదు నౌకలు సిద్ధమవుతాయని రక్షణ రంగం భావిస్తోంది. సుమారు రూ.20 వేల కోట్ల ప్రాజెక్టుకు బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తుది అనుమతి ఇచ్చింది. ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్ లను హెచ్ఎస్ఎల్ అనేక భారతీయ ప్రైవేట్ రంగ చిన్న, మధ్యతరహా సంస్థల మద్దతుతో నిర్మిస్తుందని ప్రభుత్వ రక్షణ వర్గాలు తెలిపినట్టు ఏఎన్ఐ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు వల్ల వేలాది కొత్త ఉద్యోగాలు వస్తాయనీ, ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న పరిశ్రమల సామర్థ్యాలు పెరుగుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నావికాదళంలోని వివిధ ఫ్లీట్లకు చెందిన యుద్ధనౌకలు కార్యకలాపాల సమయంలో ఎల్లప్పుడూ పనిచేయడానికి ఎఫ్ఎస్ఎస్ ఇంధనం, ఆహారం, మందుగుండు సామగ్రి, విడిభాగాలను అందిస్తుంది.
ప్రణాళిక ప్రకారం.. హెచ్ఎస్ఎల్ దాదాపు ఎనిమిదేళ్లలో అన్ని షిప్లను డెలివరీ చేయనుంది. ఒక్కో నౌక దాదాపు 45,000 టన్నుల బరువు ఉంటుంది. హెచ్ఎస్ఎల్ను ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్ల నిర్మాణం కోసం ఇండియన్ నేవీ నామినేట్ చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే నావికాదళంలో ఇండియా ముందు వరుసలో నిలిచే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!