CDS Anil Chauhan: చైనా యుద్ధంలో ఎయిర్ఫోర్స్ దాడికి అప్పటి ప్రభుత్వం ఒప్పుకోలేదు..
- 1962 చైనా వార్లో ఎయిర్ఫోర్స్ వాడుంటే వేరేలా ఉండేది..
- అప్పటి ప్రభుత్వం ఎయిర్ఫోర్స్ దాడికి అనుమతి ఇవ్వలేదు..
- సంచలన వ్యాఖ్యలు చేసిన సీడీఎస్ అనిల్ చౌహాన్..
CDS Anil Chauhan: త్రివిధ దళాధిపతి, సీడీఎస్ అనిల్ చౌహాన్ 1962 ఇండియా-చైనా యుద్ధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో భారత వైమానిక దళాన్ని ఉపయోగించి ఉంటే కథ వేరుగా ఉండేదని అన్నారు. వైమానిక దళం ఉపయోగించడం వల్ల చైనా దాడి తగ్గేదని చెప్పారు. వైమానిక దళాన్ని ఉపయోగించడం ఉద్రిక్తతల్ని పెంచడం అవుతుందని కొందరు భావిస్తారు, కానీ ఆపరేషన్ సిందూర్ సమయంలో అలా జరగలేదని నిరూపితం అయిందని అనిల్ చౌహాన్ బుధవారం అన్నారు.
63 ఏళ్ల క్రితం చైనాతో జరిగిన యుద్ధం గురించి ఆయన మాట్లాడుతూ.. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్లకు పార్వర్డ్ పాలసీని ఒకే విధంగా వర్తించడం తప్పు అవుతుందని చెప్పారు. అనేక సంవత్సరాలుగా యుద్ధాల ముఖ చిత్రం మారిపోయిందని, భద్రతా పరిస్థితులు, భౌగోళిక స్వరూపాలు, రాజకీయ పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. పూణేలో దివంగత లెఫ్టినెంట్ జనరల్ SPP థోరాట్ ఆత్మకథ ‘‘రెవిల్లే టూ రిట్రీట్’’ విడుదల కార్యక్రమానికి సంబంధించి, వీడియో సందేశంలో అనిల్ చౌహాన్ వ్యాఖ్యానించారు. చైనా-భారత యుద్ధానికి ముందు లెఫ్టినెంట్ జనరల్ థోరాట్ తూర్పు కమాండ్కు జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్గా ఉన్నారు.
Also Read
- PM Modi: హుగ్లీ నదిలో విహరించిన మోడీ.. దృశ్యాలు కెమెరాలో బంధించిన ప్రధాని
- UP: నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
- IRS Officer Daughter Murder: నిందితుడి తీరుపై కోర్టుకు పోలీసులు షాకింగ్ రిపోర్ట్.. ఏముందంటే..!
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
Read Also: AP Politics : ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సూపర్ సిక్స్ పథకాలపై వేడివేడి వాదనలు
1962 ఎయిర్ ఫోర్స్ వాడితే గణనీయమైన ప్రయోజనం ఉండేదని సీడీఎస్ అన్నారు. అయితే, అప్పటి ప్రభుత్వం దీనికి అనుమతించలేదు, లెఫ్టినెంట్ జనరల్ థోరాట్ ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఉపయోగించడంపై ఆలోచించారని అన్నారు. ఎయిర్ ఫోర్స్ ఉపయోగించడం వల్ల చైనా దాడిని పూర్తిగా నిరోధించకపోయినా, వారి దాడిని తగ్గించే అవకాశం ఉండేది, ఆ సమయంలో మన సైన్యాన్ని సిద్ధం చేయడానికి ఎక్కువ సమయం దొరికేది అని అన్నారు. అయితే, ఆ రోజుల్లో వైమానిక దళాన్ని ఉపయోగించడం ఉద్రిక్తల్ని పెంచడంగా భావించే వారని, ఇది నిజం కాదని తాను భావిస్తు్న్నానని, ఆపరేషన్ సిందూర్ ఇందుకు ఉదాహరణ అని అనిల్ చౌహాన్ చెప్పారు.
తాజావార్తలు
-
Sanju Samson: “నా విజయ రహస్యం ఇదే”.. సెంచరీ వీరుడు సంజూ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
MLC Ananthababu: నేడు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ అనంతబాబు!
-
PM Modi: హుగ్లీ నదిలో విహరించిన మోడీ.. దృశ్యాలు కెమెరాలో బంధించిన ప్రధాని
-
UP: నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
-
Stock Market: మార్కెట్లో కొనసాగుతోన్న నష్టాల పరంపర.. కారణమిదే!
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!