CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
- 2026-27 నుంచి కొత్త మూడు భాషల విధానం అమలు
- ప్రస్తుత 10వ తరగతి విద్యార్థులకు పూర్తి మినహాయింపు
- రెండు భారతీయ భాషలు తప్పనిసరి.. కొత్త నిబంధనలు
- ద్విభాషా బోధనతో భాషా అభ్యాసానికి ప్రాధాన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (CBSE) పాఠశాలల్లో మూడు భాషల విధానాన్ని (Three-Language Formula) అమలు చేయడంపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జాతీయ విద్యా విధానం (NEP-2020) సిఫార్సుల ప్రకారం భాషా అభ్యాసాన్ని మరింత అర్థవంతంగా, ఆసక్తికరంగా, విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడేలా రూపొందించనున్నట్లు సీబీఎస్ఈ స్పష్టం చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో అమల్లోకి రానున్నాయి. అయితే, ప్రస్తుతం చదువుతున్న పలు తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షల విషయంలో సీబీఎస్ఈ పెద్ద ఊరటనిచ్చింది.
ప్రస్తుత 10వ తరగతి విద్యార్థులకు మినహాయింపు
సీబీఎస్ఈ తీసుకొచ్చిన ఈ కొత్త మూడు భాషల విధానం ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్తించదని బోర్డు స్పష్టం చేసింది. అలాగే, ప్రస్తుతం 7, 8, 9 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తులో 10వ తరగతికి వెళ్లినప్పుడు కూడా ఈ మూడో భాషలో ప్రత్యేకంగా బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. దీనివల్ల ప్రస్తుత హైస్కూల్ విద్యార్థులపై ఎలాంటి అదనపు పరీక్షల భారం పడబోదు.
Also Read
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
రెండు భారతీయ భాషలు తప్పనిసరి.. ద్విభాషా బోధన
జాతీయ విద్యా విధానం (NEP-2020) ప్రకారం విద్యార్థులు నేర్చుకునే మూడు భాషల్లో కనీసం రెండు అధికారిక భారతీయ భాషలు ఉండటం తప్పనిసరి. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం 7, 8, 9 తరగతుల్లో రెండో భాషగా రెండు భారతీయ భాషలను చదువుతున్న విద్యార్థులు, ఇకపై వాటితో పాటు ఒక అదనపు భారతీయ భాషను కూడా కొనసాగించాల్సి ఉంటుంది. విద్యార్థులు సరికొత్త భాషలను సులభంగా నేర్చుకునేందుకు వీలుగా, వారి తరగతి స్థాయికి అనుగుణంగా బోధనా సామగ్రిని ద్విభాషా (బైలింగ్వల్) రూపంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు బోర్డు వెల్లడించింది. సంస్కృతిని, భాషా నైపుణ్యాలను పెంపొందించేలా ఈ మార్పులు ఉండబోతున్నాయి.
తాజావార్తలు
-
Hi Movie OTT: నయనతార ‘హాయ్’ మూవీ డిజిటల్ డీల్ ఫిక్స్.. థియేటర్ల తర్వాత ఈ ఓటీటీలో స్ట్రీమింగ్!
-
FIFA World Cup 2026 Final: పొట్టుపొట్టుగా కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్.!
-
US – Iran War: ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. వరుస దాడులతో ఉద్రిక్తత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Lionel Messi: మైదానంలోనే బోరున విలపించిన మెస్సీ..!
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్ ఓటమి.. రోహిత్ సెంచరీ వృథా.. వన్డే సిరీస్ కూడా పాయే!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!