CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
- 2026-27 నుంచి కొత్త మూడు భాషల విధానం అమలు
- ప్రస్తుత 10వ తరగతి విద్యార్థులకు పూర్తి మినహాయింపు
- రెండు భారతీయ భాషలు తప్పనిసరి.. కొత్త నిబంధనలు
- ద్విభాషా బోధనతో భాషా అభ్యాసానికి ప్రాధాన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (CBSE) పాఠశాలల్లో మూడు భాషల విధానాన్ని (Three-Language Formula) అమలు చేయడంపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జాతీయ విద్యా విధానం (NEP-2020) సిఫార్సుల ప్రకారం భాషా అభ్యాసాన్ని మరింత అర్థవంతంగా, ఆసక్తికరంగా, విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడేలా రూపొందించనున్నట్లు సీబీఎస్ఈ స్పష్టం చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో అమల్లోకి రానున్నాయి. అయితే, ప్రస్తుతం చదువుతున్న పలు తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షల విషయంలో సీబీఎస్ఈ పెద్ద ఊరటనిచ్చింది.
ప్రస్తుత 10వ తరగతి విద్యార్థులకు మినహాయింపు
సీబీఎస్ఈ తీసుకొచ్చిన ఈ కొత్త మూడు భాషల విధానం ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్తించదని బోర్డు స్పష్టం చేసింది. అలాగే, ప్రస్తుతం 7, 8, 9 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తులో 10వ తరగతికి వెళ్లినప్పుడు కూడా ఈ మూడో భాషలో ప్రత్యేకంగా బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. దీనివల్ల ప్రస్తుత హైస్కూల్ విద్యార్థులపై ఎలాంటి అదనపు పరీక్షల భారం పడబోదు.
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
రెండు భారతీయ భాషలు తప్పనిసరి.. ద్విభాషా బోధన
జాతీయ విద్యా విధానం (NEP-2020) ప్రకారం విద్యార్థులు నేర్చుకునే మూడు భాషల్లో కనీసం రెండు అధికారిక భారతీయ భాషలు ఉండటం తప్పనిసరి. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం 7, 8, 9 తరగతుల్లో రెండో భాషగా రెండు భారతీయ భాషలను చదువుతున్న విద్యార్థులు, ఇకపై వాటితో పాటు ఒక అదనపు భారతీయ భాషను కూడా కొనసాగించాల్సి ఉంటుంది. విద్యార్థులు సరికొత్త భాషలను సులభంగా నేర్చుకునేందుకు వీలుగా, వారి తరగతి స్థాయికి అనుగుణంగా బోధనా సామగ్రిని ద్విభాషా (బైలింగ్వల్) రూపంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు బోర్డు వెల్లడించింది. సంస్కృతిని, భాషా నైపుణ్యాలను పెంపొందించేలా ఈ మార్పులు ఉండబోతున్నాయి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..