India’s Population: 2100 నాటికి తగ్గనున్న ఇండియా జనాభా.. అప్పటికీ చైనా కన్నా 2.5 రెట్లు ఎక్కువే..
- 2100 నాటికి తగ్గనున్న భారతదేశ జనాభా..
- శతాబ్ధం చివరి నాటికి ప్రపంచంలో తొలిస్థానంలో భారత్..
- గణనీయమైన జనాభా నష్టాన్ని చవిచూడనున్న చైనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s Population: భారతదేశ జనాభా రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే మన దేశ జనాభా చైనాను అధిగమించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే 2060 దశకం ప్రారంభం నాటికి ఇండియా జనభా గరిష్టంగా 1.7 బిలియన్లకు(170 కోట్లు)కు చేరుతుందని, ఆ తర్వాత 12 శాతం తగ్గుతుందని, ఈ శతాబ్ధంలో భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి చెప్పింది. గురువారం ఇక్కడ విడుదల చేసిన ప్రపంచ జనాభా ప్రాస్పెక్ట్స్ 2024 నివేదిక ప్రకారం, రాబోయే 50-60 సంవత్సరాలలో ప్రపంచ జనాభా పెరుగుతూనే ఉంటుందని, 2024లో 8.2 బిలియన్ల నుండి 2080ల మధ్యకాలంలో సుమారు 10.3 బిలియన్ల జనాభాకు చేరుకోవచ్చని అంచనా వేసింది. శతాబ్ధం చివరి నాటికి 10.2 బిలియన్లకు పడిపోతుందని అంచనా వేసింది.
Read Also: Viral Video: 10 ఉద్యోగాలు.. 1,800 మంది అభ్యర్థులు హాజరు! కుప్పకూలిన రెయిలింగ్
Also Read
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
గతేడాది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనాను భారత్ అధిగమించింది. 2100 నాటి వరకు ఆ స్థానాన్ని కొనసాగిస్తుందని చెప్పింది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల శాఖ ప్రచురించిన నివేదిక ప్రకారం.. 2024లో భారత జనాభా 1.45 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది 2054 నాటికి గరిష్టంగా 1.69 బిలియన్లకు చేరుకుంటుంది. 2100లో శతాబ్ధం చివరి నాటికి 1.5 బిలియన్లకు తగ్గతుందని అంచనా వేయబడింది. అయితే, అప్పటికీ భారత్ ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంగా అగ్రస్థానంలోనే కొనసాగుతుంది.
ప్రస్తుతం 2024లో చైనా జనాభా 1.41 బిలియన్లుగా ఉంది. 2054 నాటికి ఇది 1.21 బిలియన్లకు తగ్గుతుందని, 2100 నాటికి 633 మిలియన్లకు తగ్గుతుందని నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా కలిగిన చైనా 2024-2054 మధ్య జనాభా నష్టాన్ని ఎదుర్కొంటుందని చెప్పింది. జనాభా నష్టంలో జపాన్, రష్యాలు చైనా తర్వాతి స్థానాల్లో ఉంటాయని నివేదిక హైలెట్ చేసింది. తక్కువ స్థాయి సంతానోత్పత్తి కారణంగా చైనా ఈ శతాబ్ధం చివరినాటికి (786 మిలియన్ల మంది) ఏ దేశంలోనైనా అతిపెద్ద జనాభా క్షీణతను నమోదు చేస్తుంది. 2100 నాటికి చైనా మరింత నష్టపోయే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..