India’s Population: 2100 నాటికి తగ్గనున్న ఇండియా జనాభా.. అప్పటికీ చైనా కన్నా 2.5 రెట్లు ఎక్కువే..
- 2100 నాటికి తగ్గనున్న భారతదేశ జనాభా..
- శతాబ్ధం చివరి నాటికి ప్రపంచంలో తొలిస్థానంలో భారత్..
- గణనీయమైన జనాభా నష్టాన్ని చవిచూడనున్న చైనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s Population: భారతదేశ జనాభా రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే మన దేశ జనాభా చైనాను అధిగమించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే 2060 దశకం ప్రారంభం నాటికి ఇండియా జనభా గరిష్టంగా 1.7 బిలియన్లకు(170 కోట్లు)కు చేరుతుందని, ఆ తర్వాత 12 శాతం తగ్గుతుందని, ఈ శతాబ్ధంలో భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి చెప్పింది. గురువారం ఇక్కడ విడుదల చేసిన ప్రపంచ జనాభా ప్రాస్పెక్ట్స్ 2024 నివేదిక ప్రకారం, రాబోయే 50-60 సంవత్సరాలలో ప్రపంచ జనాభా పెరుగుతూనే ఉంటుందని, 2024లో 8.2 బిలియన్ల నుండి 2080ల మధ్యకాలంలో సుమారు 10.3 బిలియన్ల జనాభాకు చేరుకోవచ్చని అంచనా వేసింది. శతాబ్ధం చివరి నాటికి 10.2 బిలియన్లకు పడిపోతుందని అంచనా వేసింది.
Read Also: Viral Video: 10 ఉద్యోగాలు.. 1,800 మంది అభ్యర్థులు హాజరు! కుప్పకూలిన రెయిలింగ్
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
గతేడాది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనాను భారత్ అధిగమించింది. 2100 నాటి వరకు ఆ స్థానాన్ని కొనసాగిస్తుందని చెప్పింది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల శాఖ ప్రచురించిన నివేదిక ప్రకారం.. 2024లో భారత జనాభా 1.45 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది 2054 నాటికి గరిష్టంగా 1.69 బిలియన్లకు చేరుకుంటుంది. 2100లో శతాబ్ధం చివరి నాటికి 1.5 బిలియన్లకు తగ్గతుందని అంచనా వేయబడింది. అయితే, అప్పటికీ భారత్ ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంగా అగ్రస్థానంలోనే కొనసాగుతుంది.
ప్రస్తుతం 2024లో చైనా జనాభా 1.41 బిలియన్లుగా ఉంది. 2054 నాటికి ఇది 1.21 బిలియన్లకు తగ్గుతుందని, 2100 నాటికి 633 మిలియన్లకు తగ్గుతుందని నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా కలిగిన చైనా 2024-2054 మధ్య జనాభా నష్టాన్ని ఎదుర్కొంటుందని చెప్పింది. జనాభా నష్టంలో జపాన్, రష్యాలు చైనా తర్వాతి స్థానాల్లో ఉంటాయని నివేదిక హైలెట్ చేసింది. తక్కువ స్థాయి సంతానోత్పత్తి కారణంగా చైనా ఈ శతాబ్ధం చివరినాటికి (786 మిలియన్ల మంది) ఏ దేశంలోనైనా అతిపెద్ద జనాభా క్షీణతను నమోదు చేస్తుంది. 2100 నాటికి చైనా మరింత నష్టపోయే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!