NTV Telugu Site icon

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. వధువు, వరుడితో సహా ఐదుగురు మృతి

Road Accident

Road Accident

Road Accident: ఎన్నో కలలతో వివాహంతో ఓకమైన కొత్త జంటను రోడ్డు ప్రమాదం కబళించింది. వధూవరులతో సహా ఐదుగురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఆదివారం చోటు చేసుకుంది. జంజ్‌గిర్-చంపా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ట్రక్కు, కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొత్తగా పెళ్లైన జంట అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

Read Also: Sanjay Raut: అలా అయితే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మరిన్ని కష్టాలు..

పెళ్లి వేడుక ముగిసిన తర్వాత వధూవరులు, బంధువులతో కారు దట్టమైన పకారియా అడవి గుండా వెళ్తున్న క్రమంలో ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కారు పామ్‌గఢ్ నుంచి అకల్తారాకు వెళ్తోంది. విషయం తెలిసిన వెంటనే వైద్య సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుంది.

ముల్ముల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జైంది. అతి కష్టం మీద పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను రాయ్‌గఢ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాద వార్త తెలియగానే ఇరు కుటుంబాల్లో సంతోషాలు ఆవిరయ్యాయి. అంతసేపు బంధుమిత్రులతో సందడిగా ఉన్న ఇట్లు శోకసంద్రంగా మారిపోయింది. బలోడా నివాసి శుభమ్ సోనికి, శివనారాయణ నివాసి నేహకి డిసెంబర్ రాత్రి వివాహం జరిగింది. డిసెంబర్ 10 తెల్లవారుజామున వధువుకు వీడ్కోలు పలికిన తర్వాత శుభమ్ సోని సొంతూరికి వస్తుండగా ఈ ఘటన జరిగింది.